ఏ హీరో కెరీర్లో అయినా 25వ సినిమా ఓ మైల్ స్టోన్. అందుకే దాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తుంటారు. ఇక ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ విషయంలో ఇంకెంత ప్లానింగ్ ఉంటుంది, ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి! తన ట్వంటీ ఫిఫ్త్ మూవీ అనౌన్స్మెంట్ రాబోతోందని తెలియగానే ఏం సినిమా, డైరెక్టర్ ఎవరు, టైటిల్ ఏం పెట్టారు అంటూ ఒకటే ప్రశ్నలు. వాటన్నింటికీ సమాధానం దొరికేసింది. ప్రభాస్ 25వ సినిమా ప్రకటన వచ్చేసింది.
తన మైల్ స్టోన్ మూవీని డైరెక్ట్ చేసే బాధ్యతను సందీప్ రెడ్డి వంగా చేతికి అప్పగించాడు ప్రభాస్. వీరి మూవీకి ‘స్పిరిట్’ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. యూవీ క్రియేషన్స్తో కలిసి టీ సిరీస్ సంస్థ ప్యాన్ ఇండియా స్థాయిలో దీన్ని నిర్మించనుంది. ఆల్రెడీ యువీ క్రియేషన్స్ ప్రభాస్తో మిర్చి, సాహో చిత్రాలు తీసింది. ‘రాధేశ్యామ్’ కూడా తీస్తోంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది.
నిజానికి ప్రభాస్ ఇరవై అయిదో సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయబోతున్నాడనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ చివరికి చాన్స్ సందీప్కి దక్కింది. ‘అర్జున్రెడ్డి’తో టాలీవుడ్లో ఎంత పెద్ద హిట్ కొట్టాడో, దాన్ని ‘కబీర్సింగ్’గా బాలీవుడ్లో రీమేక్ చేసి అంతే సక్సెస్ అయ్యాడు సందీప్. తన నెక్స్ట్ సినిమాని కూడా హిందీలోనే కమిటయ్యాడు. రణ్బీర్ కపూర్తో ‘యానిమల్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత ప్రభాస్తో ప్యాన్ ఇండియా మూవీని సెట్ చేసుకోవడం సెన్సేషన్ సృష్టిస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి. రాధేశ్యామ్, ఆదిపురుష్, సాలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలకు బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తున్నాడు. వాటిలో ఒకట్రెండు పూర్తయ్యాక ‘స్పిరిట్’ని సెట్స్కి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలను త్వరలో తెలియజేస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…