Rx 100 Director Ajay
రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన వాళ్లందరూ చాలా వరకు ఔట్ స్పోకెన్గానే ఉంటారు. ఏమనిపిస్తే అది మాట్లాడేస్తుంటారు. కొంచెం బోల్డ్ కామెంట్సే చేస్తుంటారు. చివరగా వర్మ క్యాంపు నుంచి వచ్చి మంచి పేరు సంపాదించిన అజయ్ భూపతికి కొంచెం దూకుడు ఎక్కువన్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా తన తొలి చిత్రం ఆర్ఎక్స్ 100 విడుదలకు ముందే ఈ సినిమా ఆడకుంటే ఊరుకెళ్లి గొర్రెలు మేపుకుంటా అంటూ ఒక కామెంట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడతను. ఇక ఆ చిత్రం రిలీజై బ్లాక్బస్టర్ అయ్యాక పలు సందర్భాల్లో తన మాటల దూకుడు చూపించాడు అజయ్.
తన రెండో సినిమా మహాసముద్రంలో నటించడానికి ముందు అంగీకరించి, తర్వాత హ్యాండ్ ఇచ్చిన ఒక స్టార్ హీరోనుద్దేశించి చీప్ స్టార్ అంటూ అప్పట్లో అజయ్ చేసిన కామెంట్ కూడా అప్పట్లో సంచలనం రేపింది.
ఇప్పుడు తన శైలిని కొనసాగిస్తూ అజయ్ భూపతి.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల మీద ఒక కామెంట్ చేశాడు. “ఈ థ్రిల్లర్ ఎపిసోడ్లు చూస్తుంటే నాక్కూడా రెండు మూడు సినిమాల్లో నటించి ‘మా’ లో కార్డు తీసుకుని ఎన్నికల్లో ప్రెసిడెంటుగా పోటీ చేయాలనుంది. ఏదేమైనా, ఈ ఎన్నికల తరువాత 14th న మన “మహాసముద్రం” రిలీజ్ ఉంది.. అందరూ తప్పకుండా థియేటర్లలోనే చూడండి అని ట్వీట్ చేసి, తన సినిమా ఇంకో 8 రోజుల్లో రిలీజ్ కాబోతోందంటూ కౌంట్ డౌన్ వీడియోను షేర్ చేశాడు అజయ్.
“నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా… (అని నాతో ఇప్పుడే ఒక డైరెక్టర్ అన్నాడు)” అంటూ మరో ట్వీట్ కూడా చేశాడు అజయ్. మా ఎన్నికల విషయంలో జరుగుతున్న రభస చూసి చాలామంది టాలీవుడ్లో చిరాకు పడుతున్నారు. ఎన్నడూ లేని స్థాయిలో ఈ ఎన్నికల వ్యవహారం రసాభాసగా మారిపోయిందేంటా అని అసహనం చెందుతున్నారు. కానీ దీని గురించి ఓపెన్గా మాట్లాడలేక సైలెంటుగా ఉంటున్నారు. కానీ అజయ్ మాత్రం ఈ ఎన్నికల గురించి తనదైన కామెంట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…