Rx 100 Director Ajay
రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన వాళ్లందరూ చాలా వరకు ఔట్ స్పోకెన్గానే ఉంటారు. ఏమనిపిస్తే అది మాట్లాడేస్తుంటారు. కొంచెం బోల్డ్ కామెంట్సే చేస్తుంటారు. చివరగా వర్మ క్యాంపు నుంచి వచ్చి మంచి పేరు సంపాదించిన అజయ్ భూపతికి కొంచెం దూకుడు ఎక్కువన్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా తన తొలి చిత్రం ఆర్ఎక్స్ 100 విడుదలకు ముందే ఈ సినిమా ఆడకుంటే ఊరుకెళ్లి గొర్రెలు మేపుకుంటా అంటూ ఒక కామెంట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడతను. ఇక ఆ చిత్రం రిలీజై బ్లాక్బస్టర్ అయ్యాక పలు సందర్భాల్లో తన మాటల దూకుడు చూపించాడు అజయ్.
తన రెండో సినిమా మహాసముద్రంలో నటించడానికి ముందు అంగీకరించి, తర్వాత హ్యాండ్ ఇచ్చిన ఒక స్టార్ హీరోనుద్దేశించి చీప్ స్టార్ అంటూ అప్పట్లో అజయ్ చేసిన కామెంట్ కూడా అప్పట్లో సంచలనం రేపింది.
ఇప్పుడు తన శైలిని కొనసాగిస్తూ అజయ్ భూపతి.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల మీద ఒక కామెంట్ చేశాడు. “ఈ థ్రిల్లర్ ఎపిసోడ్లు చూస్తుంటే నాక్కూడా రెండు మూడు సినిమాల్లో నటించి ‘మా’ లో కార్డు తీసుకుని ఎన్నికల్లో ప్రెసిడెంటుగా పోటీ చేయాలనుంది. ఏదేమైనా, ఈ ఎన్నికల తరువాత 14th న మన “మహాసముద్రం” రిలీజ్ ఉంది.. అందరూ తప్పకుండా థియేటర్లలోనే చూడండి అని ట్వీట్ చేసి, తన సినిమా ఇంకో 8 రోజుల్లో రిలీజ్ కాబోతోందంటూ కౌంట్ డౌన్ వీడియోను షేర్ చేశాడు అజయ్.
“నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా… (అని నాతో ఇప్పుడే ఒక డైరెక్టర్ అన్నాడు)” అంటూ మరో ట్వీట్ కూడా చేశాడు అజయ్. మా ఎన్నికల విషయంలో జరుగుతున్న రభస చూసి చాలామంది టాలీవుడ్లో చిరాకు పడుతున్నారు. ఎన్నడూ లేని స్థాయిలో ఈ ఎన్నికల వ్యవహారం రసాభాసగా మారిపోయిందేంటా అని అసహనం చెందుతున్నారు. కానీ దీని గురించి ఓపెన్గా మాట్లాడలేక సైలెంటుగా ఉంటున్నారు. కానీ అజయ్ మాత్రం ఈ ఎన్నికల గురించి తనదైన కామెంట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు.
This post was last modified on October 7, 2021 6:53 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…