వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు సందిగ్ధత తప్పట్లేదు. ఈ పండక్కి ముందు అనుకున్న సినిమాలు వేరు. చివరికి రేసులో నిలుస్తున్న సినిమాలు వేరు. 2022 సంక్రాంతికి అనుకున్న ‘సర్కారు వారి పాట’ ఇప్పుడు పండుగ రేసు నుంచి తప్పుకున్నట్లే కనిపిస్తోంది. ఆ చిత్రం వేసవికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి కావడానికి సమయం పట్టేట్లుండటం.. పైగా విపరీతమైన పోటీ ఉండటంతో వేసవిలో సోలో రిలీజ్ బెటర్ అనే అభిప్రాయానికి చిత్ర బృందం వచ్చినట్లు కనిపిస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ రేసులోకి వచ్చిన నేపథ్యంలో భీమ్లానాయక్, రాధేశ్యామ్ చిత్రాల విషయంలోనూ సందేహాలు వ్యక్తమయ్యాయి కానీ.. ఆ రెండు చిత్రాల బృందాలు సంక్రాంతి రిలీజ్ను ధ్రువీకరించాయి. ముందు అనుకున్నట్లే జనవరి 12న భీమ్లా నాయక్, 14న రాధేశ్యామ్ రాబోతున్నాయి. వీటికంటే ముందు జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ రావడం పక్కా అన్నట్లే. ఈ మూడు చిత్రాలకు బెర్తులు దాదాపు ఫిక్స్ అయినట్లే. ఇక మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు లేనట్లే.
ఐతే ‘ఆర్ఆర్ఆర్’ను సంక్రాంతి బరిలోకి తీసుకురావడం పట్ల టాలీవుడ్లో అసంతృప్త స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నట్లు సమాచారం. మూడు పెద్ద సినిమాలు ఆల్రెడీ సంక్రాంతికి ఖరారైనట్లు తెలిశాక ‘ఆర్ఆర్ఆర్’ను జనవరి 7కు ఫిక్స్ చేయడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ విషయమై కొందరు నిర్మాతలు సమావేశమై ‘ఆర్ఆర్ఆర్’ టీం మీద ఆగ్రహం వ్యక్తం చేశారని, ఫిలిం చాంబర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని చూస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఐతే సంక్రాంతికి వారం ముందే తమ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బందేముందన్న వాదన ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ నుంచి వినిపిస్తోంది. వేసవి వరకు తమ చిత్రాన్ని ఆపే పరిస్థితి లేదని.. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యమై వడ్డీల భారం భారీగా మోస్తున్నామని.. కాబట్టి డేట్ మార్చడానికి వీల్లేదని.. ఇంకోసారి రిలీజ్ డేట్ మారిస్తే ప్రేక్షకుల్లో చులకన అయిపోతామని ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ అంటున్నట్లు సమాచారం. కాబట్టి ఇప్పుడనుకుంటున్న లైనప్పే సంక్రాంతికి ఫిక్సయినట్లుగా భావించాల్సిందే.
వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా వారణాసి ఒకటే కాబట్టి…
తాను కథానాయికగా నటించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమని ఫిలిం మేకర్స్ విపరీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్లని సమీరా…
దేశ రాజధాని ఢిల్లీ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులతో…
కొలువులు అడిగితే యువతను పోలీసులతో కొట్టిస్తున్నారని.. కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్ రాసే సమయం వచ్చిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి…
ఈ నెల 30 విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం నుంచి ప్రమోషనల్ కంటెంట్ మొత్తం దాదాపుగా బయటికి వచ్చేసింది. ట్రైలర్,…