ఇంకో మూడు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘కొండపొలం’ సినిమా. టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడైన క్రిష్ రూపొందించిన చిత్రమిది. ఓవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ‘హరిహర వీరమల్లు’ లాంటి భారీ చిత్రాన్ని రూపొందిస్తూ.. మధ్యలో దొరికిన కొంచెం ఖాళీలో చాలా తక్కువ రోజుల్లో, తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను లాగించేశాడు క్రిష్. ఈ సినిమాకు కథ సొంతంగా రాసుకోవాల్సిన అవసరం క్రిష్కు రాలేదు. ఇది ‘కొండపొలం’ పేరుతోనే ప్రముఖ రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకటరెడ్డి రాసిన పుస్తకం ఆధారంగా క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించాడు.
ట్రైలర్ చూస్తే.. దాదాపుగా పుస్తకాన్ని అనుసరించే సినిమా తీసినట్లుగా ఉంది. కానీ పుస్తకంలో హీరోయిన్ పాత్ర ఉండదు. ఓబులమ్మ పేరుతో రకుల్ ప్రీత్ చేసిన పాత్ర సినిమా కోసం ప్రత్యేకంగా సృష్టించిందట. ఈ పుస్తకానికి సంబంధించి తాను తీసుకున్న సినిమాటిక్ లిబర్టీ ఇదని క్రిష్ వెల్లడించాడు.
పుస్తకంలో కథానాయిక పాత్ర లేదని.. కానీ ఈ కథకు ఓ అందమైన ప్రేమకథను జోడిస్తే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో ఓబులమ్మ పాత్రను జోడించినట్లు క్రిష్ వెల్లించాడు. ఈ పాత్రను సినిమాలో పెట్టాలనుకున్నపుడు ఒరిజినల్ రైటర్ సన్నపురెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడానని.. ఆయన కూడా ఈ పాత్రను తీర్చిదిద్దడంలో తన వంతు సాయం అందించారని క్రిష్ తెలిపాడు. మోడర్న్గా కనిపించే రకుల్.. ఈ పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయిందని క్రిష్ తెలిపాడు.
ఈ సినిమా చిత్రీకరణ గోవాలో జరపాలని అనుకున్నామని.. కానీ ఈ కథలో పులి, గొర్రెలు ఉంటాయని.. గొర్రెల మీద పులి దాడి చేసే సన్నివేశాలు ఉంటాయని తెలిసి అక్కడి అధికారులు షూటింగ్కు అనుమతులు ఇవ్వలేదని క్రిష్ తెలిపాడు. దీంతో మన చుట్టూ ఉన్న ప్రాంతాలను పరిశీలించి వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరిపామని.. సినిమాలో మెజారిటీ సన్నివేశాలు అక్కడ తీసినవే అని క్రిష్ వెల్లడించాడు.
This post was last modified on October 5, 2021 3:09 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…