చిరంజీవి సినిమాకి సంబంధించిన చిన్న విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతుంది. ‘గాడ్ఫాదర్’మూవీ గురించిన ఓ వార్త కూడా అంతే వేగంగా స్ప్రెడ్ అవుతోంది. ఈ మూవీలో చిరంజీవి తల్లిగా గంగవ్వ నటించబోతోందనేదే ఆ న్యూస్. ఈ పాత్రకి స్వయంగా మెగాస్టారే ఆమె పేరును సూచించారట. పాత్ర నిడివి తక్కువే అయినా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట.
మై విలేజ్ షో అనే యూట్యూబ్ చానెల్ ద్వారా పాపులర్ అయిన గంగవ్వ, బిగ్బాస్ షో తర్వాత మరింత ఫేమస్ అయ్యింది. సినిమాల్లో అడుగు పెట్టింది. చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పిస్తోంది. రాజరాజ చోర, లవ్ స్టోరీ వంటి హిట్ చిత్రాల్లో కనిపించింది. మరికొన్ని అవకాశాలు కూడా చేతిలో ఉన్నాయి. ఈమధ్య టీవీ షోస్లోనూ తెగ సందడి చేస్తోంది. కాబట్టి చిరంజీవి సినిమాలో ఆఫర్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
అయితే ‘గాడ్ఫాదర్’ అనేది మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’కి రీమేక్. ఒరిజినల్లో మోహన్ లాల్ తల్లి పాత్ర అసలు ఉండనే ఉండదు. మరి గంగవ్వను తీసుకోవడమేంటి అనేది పెద్ద డౌట్. దర్శకుడు మోహన్ రాజా ఈ స్క్రిప్ట్ని మన నేటివిటీకి, చిరంజీవి ఇమేజ్కి తగ్గట్టు మార్చేశాడని, ఒరిజినల్లో లేని హీరోయిన్ క్యారెక్టర్ని యాడ్ చేశారని, ఆ పాత్ర అనుష్క చేయబోతోందని..ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఆయన తల్లి పాత్రని కూడా యాడ్ చేసి ఉండొచ్చు.
లేదంటే ఒరిజినల్లో ఉన్న ఓ ముసలావిడ పాత్రయినా గంగవ్వ చేస్తుండాలి. మోహన్లాల్ ఓ ఆశ్రమాన్ని నడుపుతుంటారు. అక్కడున్న వారందరికీ ఓ పెద్దావిడ సర్వీస్ చేస్తూ ఉంటుంది. యమా యాక్టివ్గా ఉండే పాత్ర. కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయి. హీరోకి కష్టమొస్తే తట్టుకోలేదామె. ఒకవేళ ఆ పాత్రకి గంగవ్వని తీసుకుంటే తల్లి పాత్ర అని అందరూ అపోహ పడుతున్నారా అనే డౌట్ కూడా ఉంది. ఏదేమైనా, పాత్ర ఏదైనా.. చిరంజీవి సినిమాలో చోటు దొరికివుంటే మాత్రం గంగవ్వ పంట పండినట్టే.
This post was last modified on October 5, 2021 10:17 am
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…