చిరంజీవి సినిమాకి సంబంధించిన చిన్న విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతుంది. ‘గాడ్ఫాదర్’మూవీ గురించిన ఓ వార్త కూడా అంతే వేగంగా స్ప్రెడ్ అవుతోంది. ఈ మూవీలో చిరంజీవి తల్లిగా గంగవ్వ నటించబోతోందనేదే ఆ న్యూస్. ఈ పాత్రకి స్వయంగా మెగాస్టారే ఆమె పేరును సూచించారట. పాత్ర నిడివి తక్కువే అయినా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట.
మై విలేజ్ షో అనే యూట్యూబ్ చానెల్ ద్వారా పాపులర్ అయిన గంగవ్వ, బిగ్బాస్ షో తర్వాత మరింత ఫేమస్ అయ్యింది. సినిమాల్లో అడుగు పెట్టింది. చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పిస్తోంది. రాజరాజ చోర, లవ్ స్టోరీ వంటి హిట్ చిత్రాల్లో కనిపించింది. మరికొన్ని అవకాశాలు కూడా చేతిలో ఉన్నాయి. ఈమధ్య టీవీ షోస్లోనూ తెగ సందడి చేస్తోంది. కాబట్టి చిరంజీవి సినిమాలో ఆఫర్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
అయితే ‘గాడ్ఫాదర్’ అనేది మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’కి రీమేక్. ఒరిజినల్లో మోహన్ లాల్ తల్లి పాత్ర అసలు ఉండనే ఉండదు. మరి గంగవ్వను తీసుకోవడమేంటి అనేది పెద్ద డౌట్. దర్శకుడు మోహన్ రాజా ఈ స్క్రిప్ట్ని మన నేటివిటీకి, చిరంజీవి ఇమేజ్కి తగ్గట్టు మార్చేశాడని, ఒరిజినల్లో లేని హీరోయిన్ క్యారెక్టర్ని యాడ్ చేశారని, ఆ పాత్ర అనుష్క చేయబోతోందని..ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఆయన తల్లి పాత్రని కూడా యాడ్ చేసి ఉండొచ్చు.
లేదంటే ఒరిజినల్లో ఉన్న ఓ ముసలావిడ పాత్రయినా గంగవ్వ చేస్తుండాలి. మోహన్లాల్ ఓ ఆశ్రమాన్ని నడుపుతుంటారు. అక్కడున్న వారందరికీ ఓ పెద్దావిడ సర్వీస్ చేస్తూ ఉంటుంది. యమా యాక్టివ్గా ఉండే పాత్ర. కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయి. హీరోకి కష్టమొస్తే తట్టుకోలేదామె. ఒకవేళ ఆ పాత్రకి గంగవ్వని తీసుకుంటే తల్లి పాత్ర అని అందరూ అపోహ పడుతున్నారా అనే డౌట్ కూడా ఉంది. ఏదేమైనా, పాత్ర ఏదైనా.. చిరంజీవి సినిమాలో చోటు దొరికివుంటే మాత్రం గంగవ్వ పంట పండినట్టే.
This post was last modified on October 5, 2021 10:17 am
కేశినేని బ్రదర్స్ మధ్య రాజుకున్న ఆరోపణలు, ప్రత్యారోపణల వ్యవహారం ఏపీలో కలకలమే రేపుతోంది. పదేళ్ల పాటు విజయవాడ ఎంపీగా నాని…
ఫ్లాపుల పరంపరకు బ్రేక్ వేస్తూ తనకో బ్లాక్ బస్టర్ ఇస్తాడని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మీద సూర్య పెట్టుకున్న నమ్మకం…
అమెరికాలో విడుదల కాబోయే విదేశీ సినిమాలకు ఇకపై వంద శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఒక్కసారిగా…
గత కొన్నేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయిన మాట వాస్తవం. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ సినిమాలు తీసే ఇండస్ట్రీగా…
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణకు పౌరసన్మాన సభ ఘనంగా జరిగింది. వేలాదిగా…
టీడీపీకి ప్రాణ సమానమైన కార్యక్రమం ఏదైనా ఉంటే.. అది మహానాడే. దివంగత ముఖ్యమంత్రి, తెలుగువారిఅన్నగారు ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని..…