చిరంజీవి సినిమాకి సంబంధించిన చిన్న విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతుంది. ‘గాడ్ఫాదర్’మూవీ గురించిన ఓ వార్త కూడా అంతే వేగంగా స్ప్రెడ్ అవుతోంది. ఈ మూవీలో చిరంజీవి తల్లిగా గంగవ్వ నటించబోతోందనేదే ఆ న్యూస్. ఈ పాత్రకి స్వయంగా మెగాస్టారే ఆమె పేరును సూచించారట. పాత్ర నిడివి తక్కువే అయినా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట.
మై విలేజ్ షో అనే యూట్యూబ్ చానెల్ ద్వారా పాపులర్ అయిన గంగవ్వ, బిగ్బాస్ షో తర్వాత మరింత ఫేమస్ అయ్యింది. సినిమాల్లో అడుగు పెట్టింది. చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పిస్తోంది. రాజరాజ చోర, లవ్ స్టోరీ వంటి హిట్ చిత్రాల్లో కనిపించింది. మరికొన్ని అవకాశాలు కూడా చేతిలో ఉన్నాయి. ఈమధ్య టీవీ షోస్లోనూ తెగ సందడి చేస్తోంది. కాబట్టి చిరంజీవి సినిమాలో ఆఫర్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
అయితే ‘గాడ్ఫాదర్’ అనేది మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’కి రీమేక్. ఒరిజినల్లో మోహన్ లాల్ తల్లి పాత్ర అసలు ఉండనే ఉండదు. మరి గంగవ్వను తీసుకోవడమేంటి అనేది పెద్ద డౌట్. దర్శకుడు మోహన్ రాజా ఈ స్క్రిప్ట్ని మన నేటివిటీకి, చిరంజీవి ఇమేజ్కి తగ్గట్టు మార్చేశాడని, ఒరిజినల్లో లేని హీరోయిన్ క్యారెక్టర్ని యాడ్ చేశారని, ఆ పాత్ర అనుష్క చేయబోతోందని..ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఆయన తల్లి పాత్రని కూడా యాడ్ చేసి ఉండొచ్చు.
లేదంటే ఒరిజినల్లో ఉన్న ఓ ముసలావిడ పాత్రయినా గంగవ్వ చేస్తుండాలి. మోహన్లాల్ ఓ ఆశ్రమాన్ని నడుపుతుంటారు. అక్కడున్న వారందరికీ ఓ పెద్దావిడ సర్వీస్ చేస్తూ ఉంటుంది. యమా యాక్టివ్గా ఉండే పాత్ర. కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయి. హీరోకి కష్టమొస్తే తట్టుకోలేదామె. ఒకవేళ ఆ పాత్రకి గంగవ్వని తీసుకుంటే తల్లి పాత్ర అని అందరూ అపోహ పడుతున్నారా అనే డౌట్ కూడా ఉంది. ఏదేమైనా, పాత్ర ఏదైనా.. చిరంజీవి సినిమాలో చోటు దొరికివుంటే మాత్రం గంగవ్వ పంట పండినట్టే.
This post was last modified on October 5, 2021 10:17 am
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…