ఒకప్పుడు తమ ఫేవరేట్ స్టార్ సినిమా ఎప్పుడు థియేటర్కి వస్తుందా అని చూసేవారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు తమ స్టార్ సినిమా సింగిల్గా రావడం కుదురుతుందా లేదా అని ఆలోచించాల్సి వస్తోంది. కరోనా వల్ల మూతబడిన థియేటర్లు తెరుచుకోగానే, వాయిదా పడిన సినిమాలన్నీ రిలీజుకి రెడీ అయిపోయాయి. ఒకరి తర్వాత ఒకరుగా ఖర్చీఫులు వేసుకుంటూ పోవడంతో కొన్ని సినిమాలకి శ్లాట్ దొరకనట్టుగా అయ్యింది. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆచార్య, అఖండ చిత్రాల గురించి.
అందరూ తమ రిలీజ్ డేట్స్ ప్రకటించినా ఈ రెండు సినిమాల మేకర్స్ మాత్రం ఇంతవరకు అనౌన్స్మెంట్తో రాలేదు. అయితే అల్లు అర్జున్ ‘పుష్ప’ని కాస్త ముందుకు లాక్కొచ్చి ‘ఆచార్య’కి క్రిస్మస్ రేస్లో చోటిచ్చాడు. రేపో మాపో ప్రకటన రావొచ్చు. ఇక మిగిలింది ‘అఖండ’. రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటి డైరెక్షన్లో బాలకృష్ణ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. ఎక్స్పెక్టేషన్స్తో పాటు ఎదురు చూపులూ భారీగానే ఉన్నాయి. అందుకే సంక్రాంతి పండక్కి ఫీస్ట్ ఇద్దామని ఫిక్సయ్యారు టీమ్. కానీ ‘ఆర్ఆర్ఆర్’తో పాటు భీమ్లానాయక్, రాధేశ్యామ్, సర్కారువారి పాట రేస్కి రెడీ అయిపోవడంతో అఖండకి వెనక్కి తగ్గక తప్పలేదు.
ఇక మిగిలింది దీపావళి. ఆ సమయంలో భారీ చిత్రాలేవీ రావడం లేదు. రజినీకాంత్ ‘అన్నాత్తే’ ఉంది కానీ, టాలీవుడ్ మార్కెట్ని రజినీ సినిమా కబ్జా చేస్తుందని భయపడే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇక వరుణ్ తేజ్ ‘గని’ కూడా వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అంటే ఏవో ఒకట్రెండు మీడియమ్ రేంజ్ సినిమాలు తప్ప బిగ్ మూవీసేవీ లేవు. సో, బాలయ్య నిక్షేపంగా దీపావళికి వచ్చేయొచ్చు. ఒకవేళ ఇది కనుక మిస్సయితే మళ్లీ ఉగాది వరకు ఆయనకు చాన్స్ దొరకదు. కాబట్టి ఈ వీకెండ్ లోపు ఈ విషయం తేల్చేస్తారని, దివాలీ రిలీజ్ని అనౌన్స్ చేస్తారని అంచనా. చూడాలి మరి మేకర్స్ ఏం డిసైడ్ చేస్తారో!
This post was last modified on October 4, 2021 2:21 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…