యాక్షన్ హీరో గోపీచంద్ లాంగ్ డిలేయ్డ్ మూవీ ఆరడుగుల బుల్లెట్ ఎట్టకేలకు విడుదలకు నోచుకుంటోంది. గోపీచంద్ లేటెస్ట్ మూవీ సీటీమార్కు ఓ మోస్తరు టాక్, వసూళ్లు రాగానే.. ఈ సినిమా విడుదల గురించి సమాచారం బయటికి వచ్చింది. త్వరలో విడుదల అంటూ కొత్త పోస్టర్ వదిలారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అక్టోబరు 8న ఆరడుగుల బుల్లెట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
ఐతే ఏడెనిమిదేళ్ల కిందట మొదలైన ఈ సినిమాకు మేకింగ్ దశలోనే చాలా ఆలస్యం జరిగింది. రిలీజ్ విషయంలో మరింత ఆలస్యం తప్పలేదు. నాలుగేళ్ల కిందట సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చి థియేటర్లు బుక్ చేసి విడుదలకు అంతా సిద్ధం చేశాక.. రిలీజ్ రోజు ఫైనాన్స్ సమస్యలు తలెత్తడం.. విడుదల అర్ధంతరంగా ఆగిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారైనా సినిమా పక్కాగా విడుదలవుతుందా.. మళ్లీ చివరి నిమిషంలో ఏమైనా అవాంతరాలు ఎదురవుతాయా అని చూడాలి. అక్టోబరు 8న వైష్ణవ్ తేజ్ సినిమా కొండపొలంతో ఆరడుగుల బుల్లెట్ పోటీ పడనుంది.
ముందు భూపతి రాజా అనే తమిళ దర్శకుడు ఈ సినిమాను మొదలుపెట్టి.. మధ్యలో అతను తప్పుకుంటే సీనియర్ గోపాల్ చేతికి ఈ సినిమా వెళ్లింది. ఆయనే సినిమాను పూర్తి చేశారు.ఇందులో అగ్ర కథానాయిక నయనతార.. గోపీచంద్కు జోడీగా నటించింది. బాలాజి రియల్ మీడియా బేనర్ మీద తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మణిశర్మ సంగీతాన్నందించాడు. ఈ చిత్రానికి కథ అందించింది వక్కంతం వంశీ కావడం విశేషం.
This post was last modified on October 2, 2021 6:22 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…