యాక్షన్ హీరో గోపీచంద్ లాంగ్ డిలేయ్డ్ మూవీ ఆరడుగుల బుల్లెట్ ఎట్టకేలకు విడుదలకు నోచుకుంటోంది. గోపీచంద్ లేటెస్ట్ మూవీ సీటీమార్కు ఓ మోస్తరు టాక్, వసూళ్లు రాగానే.. ఈ సినిమా విడుదల గురించి సమాచారం బయటికి వచ్చింది. త్వరలో విడుదల అంటూ కొత్త పోస్టర్ వదిలారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అక్టోబరు 8న ఆరడుగుల బుల్లెట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
ఐతే ఏడెనిమిదేళ్ల కిందట మొదలైన ఈ సినిమాకు మేకింగ్ దశలోనే చాలా ఆలస్యం జరిగింది. రిలీజ్ విషయంలో మరింత ఆలస్యం తప్పలేదు. నాలుగేళ్ల కిందట సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చి థియేటర్లు బుక్ చేసి విడుదలకు అంతా సిద్ధం చేశాక.. రిలీజ్ రోజు ఫైనాన్స్ సమస్యలు తలెత్తడం.. విడుదల అర్ధంతరంగా ఆగిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారైనా సినిమా పక్కాగా విడుదలవుతుందా.. మళ్లీ చివరి నిమిషంలో ఏమైనా అవాంతరాలు ఎదురవుతాయా అని చూడాలి. అక్టోబరు 8న వైష్ణవ్ తేజ్ సినిమా కొండపొలంతో ఆరడుగుల బుల్లెట్ పోటీ పడనుంది.
ముందు భూపతి రాజా అనే తమిళ దర్శకుడు ఈ సినిమాను మొదలుపెట్టి.. మధ్యలో అతను తప్పుకుంటే సీనియర్ గోపాల్ చేతికి ఈ సినిమా వెళ్లింది. ఆయనే సినిమాను పూర్తి చేశారు.ఇందులో అగ్ర కథానాయిక నయనతార.. గోపీచంద్కు జోడీగా నటించింది. బాలాజి రియల్ మీడియా బేనర్ మీద తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మణిశర్మ సంగీతాన్నందించాడు. ఈ చిత్రానికి కథ అందించింది వక్కంతం వంశీ కావడం విశేషం.
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…
ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం ఒకెత్తయితే.. విజయాలు సాధించడం మరో ఎత్తు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం అయ్యేలా సక్సెస్ సాధించకపోతే…
బాలీవుడ్ లో కొంత కాలంగా విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ కథలు, సిల్లీ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటాయి. క్రిటిక్స్…