యాక్షన్ హీరో గోపీచంద్ లాంగ్ డిలేయ్డ్ మూవీ ఆరడుగుల బుల్లెట్ ఎట్టకేలకు విడుదలకు నోచుకుంటోంది. గోపీచంద్ లేటెస్ట్ మూవీ సీటీమార్కు ఓ మోస్తరు టాక్, వసూళ్లు రాగానే.. ఈ సినిమా విడుదల గురించి సమాచారం బయటికి వచ్చింది. త్వరలో విడుదల అంటూ కొత్త పోస్టర్ వదిలారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అక్టోబరు 8న ఆరడుగుల బుల్లెట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
ఐతే ఏడెనిమిదేళ్ల కిందట మొదలైన ఈ సినిమాకు మేకింగ్ దశలోనే చాలా ఆలస్యం జరిగింది. రిలీజ్ విషయంలో మరింత ఆలస్యం తప్పలేదు. నాలుగేళ్ల కిందట సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చి థియేటర్లు బుక్ చేసి విడుదలకు అంతా సిద్ధం చేశాక.. రిలీజ్ రోజు ఫైనాన్స్ సమస్యలు తలెత్తడం.. విడుదల అర్ధంతరంగా ఆగిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారైనా సినిమా పక్కాగా విడుదలవుతుందా.. మళ్లీ చివరి నిమిషంలో ఏమైనా అవాంతరాలు ఎదురవుతాయా అని చూడాలి. అక్టోబరు 8న వైష్ణవ్ తేజ్ సినిమా కొండపొలంతో ఆరడుగుల బుల్లెట్ పోటీ పడనుంది.
ముందు భూపతి రాజా అనే తమిళ దర్శకుడు ఈ సినిమాను మొదలుపెట్టి.. మధ్యలో అతను తప్పుకుంటే సీనియర్ గోపాల్ చేతికి ఈ సినిమా వెళ్లింది. ఆయనే సినిమాను పూర్తి చేశారు.ఇందులో అగ్ర కథానాయిక నయనతార.. గోపీచంద్కు జోడీగా నటించింది. బాలాజి రియల్ మీడియా బేనర్ మీద తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మణిశర్మ సంగీతాన్నందించాడు. ఈ చిత్రానికి కథ అందించింది వక్కంతం వంశీ కావడం విశేషం.
This post was last modified on October 2, 2021 6:22 pm
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…