హార్రర్ కామెడీ.. ఒకప్పుడు తెలుగులో కాసుల పంట పండించిన జానర్. ప్రేమకథా చిత్రమ్, గీతాంజలి, కాంఛన, రాజు గారి గది.. ఇలా ఈ జానర్లో వచ్చిన చాలా సినిమాలు ఘనవిజయాలందుకున్నాయి. కానీ ఈ జానర్లో ఒక దశ దాటాక మరీ రొటీన్ సినిమాలు రావడం.. జనాలకు మొహం మొత్తేయడంతో తిరస్కరణ మొదలైంది. హార్రర్ కామెడీ అంటేనే జనాలు బెంబేలెత్తిపోయే పరిస్థితి తలెత్తింది. వరుసగా ఈ జానర్లో వచ్చిన సినిమాలు నిరాశ పరచడంతో ఇక్కడ ఆ టైపు సినిమాలను పక్కన పెట్టేశారు.
కానీ తమిళంలో మాత్రం ఈ జానర్ను ఎంతకీ వదలట్లేదు. మన హార్రర్ కామెడీ సినిమాల స్ఫూర్తితో సీనియర్ దర్శకుడు సుందర్.. కొన్నేళ్ల కిందట హన్సిక ప్రధాన పాత్రలో ‘ఆరణ్మయి’ అనే సినిమా తీశాడు. అది అక్కడ సూపర్ హిట్టయింది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘కళావతి’ పేరుతో రిలీజ్ చేశారు. సరైన స్పందన రాలేదు. తర్వాత త్రిష, సిద్దార్థ్లతో ‘ఆరణ్మయి-2’ తీశాడు. అది కూడా అక్కడ బాగా ఆడింది.
కానీ తెలుగులో రిలీజ్ చేస్తే మనోళ్లు పట్టించుకోలేదు. ఇప్పుడు సుందర్ ఈ సిరీస్లో ‘ఆరణ్మయి-3’ తీశాడు. ఈ చిత్రం ఇంకా భారీ స్థాయిలో తెరకెక్కింది. ఇందులో ఆర్య హీరోగా నటిస్తే.. టాలీవుడ్ పాపులర్ హీరోయిన్ రాశి ఖన్నా కథానాయికగా నటించడం విశేషం. ఆండ్రియా, సుందర్ కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ చేశారు. అందులో ఒక్క సీన్, షాట్ కూడా కొత్తగా లేదు. మన ఫిలిం మేకర్లు అరగదీసిన కాన్సెప్ట్లనే మళ్లీ అక్కడ వాడినట్లున్నారు.
అనగనగా ఒక రాజమహల్.. అందులో తీరని కోరికతో ఓ దయ్యం.. అక్కడికి వెళ్లిన వాళ్లనంతా ఓ ఆటాడించడం.. ఆ దయ్యానికో ఫ్లాష్ బ్యాక్.. దయ్యాన్ని నియంత్రించడానికి ఓ మంత్రగాడు.. హీరో హీరోయిన్లు అతడితో కలిసి దయ్యం బెడద వదలించుకోవడానికి ప్లాన్ చేయడం.. ఇలా ఒక ఫార్మాట్లో సాగిపోయే సినిమాలా కనిపిస్తోందిది. హార్రర్ కామెడీ సీన్లేవీ కొత్తగా లేవు. కొన్ని నెలల కిందట కరోనా కారణంగా చనిపోయిన కమెడియన్ వివేక్ నటించిన చివరి సినిమా ఇది. ఆయన నటించిన ఓ సన్నివేశం ట్రైలర్లోనూ ఉంది.
This post was last modified on October 2, 2021 12:08 pm
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…