ఒకప్పుడు టాలీవుడ్లో దర్శకేంద్రుడి హవా ఎలా సాగిందో తెలిసిందే. తెలుగు సినిమాకు కమర్షియల్ హంగులు అద్ది మన సినిమాల రీచ్, మార్కెట్ను అమాంతం పెంచేసిన దర్శకుడాయన. ఆయన ఏం చేస్తే అది అప్పట్లో ట్రెండ్ అయింది. కానీ ఎలాంటి ట్రెండ్ సెట్టర్ అయినా.. ఏదో ఒక దశలో ఔట్ డేటెడ్ కావాల్సిందే. దర్శకేంద్రుడు కూడా అందుకు మినహాయింపు కాలేకపోయారు. ఆయన గత రెండు దశాబ్దాల్లో తీసిన సినిమాల్లో ఒక్క శ్రీరామదాసు మినహా ఏదీ ఆకట్టుకోలేదు. చివరగా తన స్టయిల్లో తీసిన భక్తి చిత్రం ఓం నమో వేంకటేశాయ కూడా చేదు అనుభవాన్నే ఎదుర్కొంది.
ఇక రాఘవేంద్రరావు తీసిన మామూలు సినిమాలు ఝుమ్మంది నాదం, అల్లరి బుల్లోడు, సుభాష్ చంద్రబోస్ లాంటి సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచిని రాఘవేంద్రరావు అర్థం చేసుకోలేకపోయారనడానికి ఈ సినిమాలు నిదర్శనంగా నిలిచాయి.
దీంతో నెమ్మదిగా సినిమాలు తగ్గించేసి, ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయినట్లు కనిపించిన రాఘవేంద్రరావు.. చాలా కాలం తర్వాత తన స్వీయ నిర్మాణంలో, దర్శకత్వ పర్యవేక్షణలో పెళ్ళిసంద-డి అనే సినిమాను రూపొందించారు. గౌరి రోనంకి అనే కొత్త దర్శకురాలు ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్, ఇంకా పాటలు.. ఏవి చూసినా.. 90ల్లో రాఘవేంద్రరావు తీసిన రొమాంటిక్ సినిమాలను తలపించాయి. పెళ్ళిసంద-డి అని పేరు పెట్టి అప్పటి సినిమానే తీశారా అన్న కామెంట్లు పడ్డాయి ఈ సినిమా ప్రోమోలు చూసి.
ఈ టైంలో ఇలాంటి సినిమా తీయడమే రిస్క్ అంటే.. గట్టి పోటీ ఉన్న దసరా సీజన్లో ఈ చిత్రాన్ని నిలబెట్టాడు రాఘవేంద్రరావు. ఈ చిత్రానికి రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. అక్టోబరు 15న పెళ్ళిసంద-డి విడుదల కానుంది. అదే రోజు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, వరుడు కావలెను.. ముందు రోజు మహాసముద్రం మంచి అంచనాల రిలీజవుతున్నాయి. వీటి పోటీని తట్టుకుని ఈ మోడర్న్ పెళ్ళిసంద-డి ఏమాత్రం ప్రేక్షకులను ఆకర్షిస్తుందో ఏమో మరి.
This post was last modified on October 2, 2021 7:40 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…