కొంచెం డివైడ్ టాక్ ఉంటేనేమి.. బాక్సాఫీస్ దగ్గర లవ్ స్టోరి జోరు మామూలుగా లేదు. తొలి రోజు లాగే రెండో రోజూ ఈ సినిమా భారీ వసూళ్లే రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రానికి శనివారం కూడా మెజారిటీ థియేటర్లలో హౌస్ ఫుల్స్ పడ్డాయి. ముఖ్యంగా నైజాంలో లవ్ స్టోరి జోరు మామూలుగా లేదు. తొలి రోజు తెలంగాణలో రూ.3 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.2.6 కోట్లు కొల్లగొట్టింది. మొత్తం ఈ ఏరియాలో 2 రోజుల షేర్ రూ.5.6 కోట్లకు చేరింది.
ఆదివారం కూడా సినిమాకు ఇదే స్థాయిలో వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్న నేపథ్యంలో నైజాంలో రూ.10 కోట్ల షేర్ మార్కును పెద్ద కష్టం కాకపోవచ్చు. ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ ఉన్నప్పటికీ ఈ చిత్రం బాగానే పెర్ఫామ్ చేస్తోంది. రెండో రోజు అక్కడ రూ.2.5 కోట్ల మేర షేర్ వచ్చినట్లు అంచనా. అక్కడ మొత్తం రెండు రోజుల షేర్ రూ.6 కోట్లకు అటు ఇటుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకు కలిపి లవ్ స్టోరి షేర్ రూ.12 కోట్లకు చేరువగా ఉంది. యుఎస్లో ఈ సినిమా ఇంకా మెరుగైన వసూళ్లు రాబడుతోంది.
కరోనా ధాటికి పూర్తిగా చల్లబడిపోయిన యుఎస్ తెలుగు సినిమా బాక్సాఫీస్లో లవ్ స్టోరి వేడి పుట్టించింది. ప్రిమియర్లు, తొలి రోజు వసూళ్లతోనే 6 లక్షల డాలర్ల మార్కును దాటేసిన ఈ సినిమా.. శనివారం కూడా అదరగొట్టింది. 2.88 లక్షల డాలర్లు రాబట్టి ఔరా అనిపించింది. దీంతో మొత్తం యుఎస్ వసూళ్లు 8.95 లక్షల డాలర్లకు చేరుకున్నాయి. ఆదివారమే లవ్ స్టోరి మిలియన్ డాలర్ల క్లబ్లో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనా ప్రభావం మొదలయ్యాక యుఎస్లో రిలీజైన తెలుగు సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్గా లవ్ స్టోరి నిలవడం లాంఛనమే.
This post was last modified on September 27, 2021 7:28 am
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…