కొంచెం డివైడ్ టాక్ ఉంటేనేమి.. బాక్సాఫీస్ దగ్గర లవ్ స్టోరి జోరు మామూలుగా లేదు. తొలి రోజు లాగే రెండో రోజూ ఈ సినిమా భారీ వసూళ్లే రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రానికి శనివారం కూడా మెజారిటీ థియేటర్లలో హౌస్ ఫుల్స్ పడ్డాయి. ముఖ్యంగా నైజాంలో లవ్ స్టోరి జోరు మామూలుగా లేదు. తొలి రోజు తెలంగాణలో రూ.3 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.2.6 కోట్లు కొల్లగొట్టింది. మొత్తం ఈ ఏరియాలో 2 రోజుల షేర్ రూ.5.6 కోట్లకు చేరింది.
ఆదివారం కూడా సినిమాకు ఇదే స్థాయిలో వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్న నేపథ్యంలో నైజాంలో రూ.10 కోట్ల షేర్ మార్కును పెద్ద కష్టం కాకపోవచ్చు. ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ ఉన్నప్పటికీ ఈ చిత్రం బాగానే పెర్ఫామ్ చేస్తోంది. రెండో రోజు అక్కడ రూ.2.5 కోట్ల మేర షేర్ వచ్చినట్లు అంచనా. అక్కడ మొత్తం రెండు రోజుల షేర్ రూ.6 కోట్లకు అటు ఇటుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకు కలిపి లవ్ స్టోరి షేర్ రూ.12 కోట్లకు చేరువగా ఉంది. యుఎస్లో ఈ సినిమా ఇంకా మెరుగైన వసూళ్లు రాబడుతోంది.
కరోనా ధాటికి పూర్తిగా చల్లబడిపోయిన యుఎస్ తెలుగు సినిమా బాక్సాఫీస్లో లవ్ స్టోరి వేడి పుట్టించింది. ప్రిమియర్లు, తొలి రోజు వసూళ్లతోనే 6 లక్షల డాలర్ల మార్కును దాటేసిన ఈ సినిమా.. శనివారం కూడా అదరగొట్టింది. 2.88 లక్షల డాలర్లు రాబట్టి ఔరా అనిపించింది. దీంతో మొత్తం యుఎస్ వసూళ్లు 8.95 లక్షల డాలర్లకు చేరుకున్నాయి. ఆదివారమే లవ్ స్టోరి మిలియన్ డాలర్ల క్లబ్లో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనా ప్రభావం మొదలయ్యాక యుఎస్లో రిలీజైన తెలుగు సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్గా లవ్ స్టోరి నిలవడం లాంఛనమే.
This post was last modified on September 27, 2021 7:28 am
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…