ఎంతో టాలెంట్ ఉన్నా దానికి తగ్గ అవకాశాలు రాక చాలా కాలం మరుగున ఉండిపోయాడు నవీన్ పొలిశెట్టి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, 1 నేనొక్కడినే లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలేసుకుంటూ నెట్టుకొచ్చాడతను. ఐతే మధ్యలో హిందీలో షార్ట్ ఫిలింలు, స్పెషల్ వీడియోలు అవీ చేసి అక్కడ బాగానే పాపులారిటీ సంపాదించాడు.
తర్వాత తెలుగులో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి విభిన్నమైన సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన అతను.. అదిరిపోయే పెర్ఫామెన్స్తో అందరి దృష్టిలో పడ్డాడు. సినిమా కూడా బాగుండటంతో మంచి ఫలితాన్నందుకుంది. దీంతో ఒక్కసారిగా నవీన్పై అంచనాలు పెరిగిపోయాయి.
ఇదే సమయంలో హిందీలో ‘చిచ్చోరే’తో సత్తా చాటాడు. దీంతో తెలుగులో అతడి కొత్త సినిమా ‘జాతి రత్నాలు’ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా లేకుంటే ఈ సినిమా ఇప్పటికే రిలీజయ్యేుది కూడా.
లాక్ డౌన్ వల్ల రెండు నెలలకు పైగా ఇంటి పట్టునే ఉంటున్న నవీన్.. ఈ టైంలో కూడా ఖాళీగా లేకుండా కొన్ని వీడియోలు చేస్తున్నాడు. హిందీ ఫాలోవర్ల కోసం ఆ మధ్య రిలీజ్ చేసిన వీడియోక మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు తెలుగు వారి కోసం ఒక వీడియో చేశాడు. ఇది చూస్తే నవీన్ ఎంత మంచి పెర్ఫామర్ అనే విషయం మరోసారి అర్థమవుతుంది.
కరోనా రాకముందు, వచ్చిన తొలి రోజుల్లో, ఆ తర్వాత తన అనుభవాల నేపథ్యంలో నవీన్ ఈ వీడియో చేశాడు. ఫోన్ సంభాషణ నేపథ్యంలో ఈ వీడియో మొత్తం సాగింది. కరోనా రావడానికి ముందు 2020 మీద భారీ అంచనాలతో ఏడాదిని మొదలుపెట్టడం.. ‘జాతి రత్నాలు’ సినిమా గురించి బిల్డప్లు ఇవ్వడం చూపించి.. ఆ తర్వాత కరోనా గురించి చాలా తేలిగ్గా మాట్లాడటం.. ఆపై దాని ధాటికి కుదేలవడం.. ఇప్పుడు వాస్తవం బోధపడి అంచనాలన్నీ తగ్గించుకుని నేల మీదికి రావడం.. ఈ నేపథ్యంలో వీడియో నడిచింది. కేవలం ఫోన్ సంభాషణతోనే ఐదు నిమిషాలకు పైగా ఏమాత్రం బోర్ కొట్టించకుండా వీడియోను నడిపించాడు నవీన్.
This post was last modified on June 1, 2020 2:04 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…