కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఓ హ్యూజ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. ఆ ఆశను ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ తీరుస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. పోస్టర్లు, టీజర్లు చూస్తే ఆ చాన్స్ ఉందనే నమ్మకం కూడా కలిగింది. కానీ కరోనా వల్ల మూవీ థియేటర్కి రావడం మాత్రం కాస్త లేటయ్యింది.
ఎట్టకేలకి థియేటర్లు తెరుచుకోవడంతో అక్టోబర్ 8న రిలీజ్ చేసేస్తామని ఆ మధ్య అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ప్లాన్ మారింది. బ్యాచ్లర్ దసరా బరిలోకి దిగుతున్నాడు. రిలీజ్ డేట్ని చేంజ్ చేశామని, అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని థియేటర్స్లో విడుదల చేయబోతున్నామని నిన్న ప్రకటించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా కాబట్టి పండగ సందర్భంగా రిలీజైతే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారట.
అఖిల్, పూజ ఫ్లైట్లో ఉన్న రొమాంటిక్ ఫొటోని కూడా వదిలారు. నిజానికి అక్టోబర్ 8న ఈ చిత్రంతో పాటు వైష్ణవ్ తేజ్, క్రిష్ల ‘కొండపొలం’ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆ సినిమాని వాయిదా వేస్తున్నారనే గుసగుసలు వినిపించాయి. అయితే రీసెంట్గా చేసిన ట్రైలర్ అనౌన్స్మెంట్ ద్వారా తమ రిలీజ్ డేట్ చేంజ్ కాలేదని చెప్పకనే చెప్పింది ‘కొండపొలం’ టీమ్. కానీ ఊహించని విధంగా అఖిల్ సినిమా పోస్ట్పోన్ అయ్యింది. అయితే ఆ డేట్కి నాగశౌర్య ఆల్రెడీ ఖర్చీఫ్ వేసేశాడు.
లక్ష్మీ సౌజన్య డైరెక్షన్లో తను నటించిన ‘వరుడు కావలెను’ చిత్రం అక్టోబర్ 15నే రిలీజవుతోంది. పైగా ముందు రోజు శర్వానంద్ ‘మహాసముద్రం’ కూడా వస్తుంది. అంటే ప్లాన్ మారినా అఖిల్కి పోటీ తప్పడం లేదన్నమాట.
This post was last modified on September 26, 2021 1:09 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…