కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఓ హ్యూజ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. ఆ ఆశను ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ తీరుస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. పోస్టర్లు, టీజర్లు చూస్తే ఆ చాన్స్ ఉందనే నమ్మకం కూడా కలిగింది. కానీ కరోనా వల్ల మూవీ థియేటర్కి రావడం మాత్రం కాస్త లేటయ్యింది.
ఎట్టకేలకి థియేటర్లు తెరుచుకోవడంతో అక్టోబర్ 8న రిలీజ్ చేసేస్తామని ఆ మధ్య అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ప్లాన్ మారింది. బ్యాచ్లర్ దసరా బరిలోకి దిగుతున్నాడు. రిలీజ్ డేట్ని చేంజ్ చేశామని, అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని థియేటర్స్లో విడుదల చేయబోతున్నామని నిన్న ప్రకటించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా కాబట్టి పండగ సందర్భంగా రిలీజైతే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారట.
అఖిల్, పూజ ఫ్లైట్లో ఉన్న రొమాంటిక్ ఫొటోని కూడా వదిలారు. నిజానికి అక్టోబర్ 8న ఈ చిత్రంతో పాటు వైష్ణవ్ తేజ్, క్రిష్ల ‘కొండపొలం’ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆ సినిమాని వాయిదా వేస్తున్నారనే గుసగుసలు వినిపించాయి. అయితే రీసెంట్గా చేసిన ట్రైలర్ అనౌన్స్మెంట్ ద్వారా తమ రిలీజ్ డేట్ చేంజ్ కాలేదని చెప్పకనే చెప్పింది ‘కొండపొలం’ టీమ్. కానీ ఊహించని విధంగా అఖిల్ సినిమా పోస్ట్పోన్ అయ్యింది. అయితే ఆ డేట్కి నాగశౌర్య ఆల్రెడీ ఖర్చీఫ్ వేసేశాడు.
లక్ష్మీ సౌజన్య డైరెక్షన్లో తను నటించిన ‘వరుడు కావలెను’ చిత్రం అక్టోబర్ 15నే రిలీజవుతోంది. పైగా ముందు రోజు శర్వానంద్ ‘మహాసముద్రం’ కూడా వస్తుంది. అంటే ప్లాన్ మారినా అఖిల్కి పోటీ తప్పడం లేదన్నమాట.
This post was last modified on September 26, 2021 1:09 pm
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…
వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ తీవ్రంగా కుదుపునకు గురైందని సీఎం చంద్రబాబు చెప్పారు. జగన్ దెబ్బకు ఏపీ బ్రాండ్ కదిలిపోయింది.…
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ వలసదారుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి.…
మొన్న శుక్రవారం రావాల్సిన అఖండ 2 వాయిదా పడటంతో థియేటర్లు బోసిపోతున్నాయి. ఉన్నంతలో ఆంధ్రకింగ్ తాలూకా, రాజు వెడ్స్ రాంబాయి,…
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సోమవారం.. జాతీయ గేయం వందేమాతరంపై చర్చ జరిగింది. ఈ గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యాన్ని…