కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఓ హ్యూజ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. ఆ ఆశను ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ తీరుస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. పోస్టర్లు, టీజర్లు చూస్తే ఆ చాన్స్ ఉందనే నమ్మకం కూడా కలిగింది. కానీ కరోనా వల్ల మూవీ థియేటర్కి రావడం మాత్రం కాస్త లేటయ్యింది.
ఎట్టకేలకి థియేటర్లు తెరుచుకోవడంతో అక్టోబర్ 8న రిలీజ్ చేసేస్తామని ఆ మధ్య అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ప్లాన్ మారింది. బ్యాచ్లర్ దసరా బరిలోకి దిగుతున్నాడు. రిలీజ్ డేట్ని చేంజ్ చేశామని, అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని థియేటర్స్లో విడుదల చేయబోతున్నామని నిన్న ప్రకటించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా కాబట్టి పండగ సందర్భంగా రిలీజైతే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారట.
అఖిల్, పూజ ఫ్లైట్లో ఉన్న రొమాంటిక్ ఫొటోని కూడా వదిలారు. నిజానికి అక్టోబర్ 8న ఈ చిత్రంతో పాటు వైష్ణవ్ తేజ్, క్రిష్ల ‘కొండపొలం’ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆ సినిమాని వాయిదా వేస్తున్నారనే గుసగుసలు వినిపించాయి. అయితే రీసెంట్గా చేసిన ట్రైలర్ అనౌన్స్మెంట్ ద్వారా తమ రిలీజ్ డేట్ చేంజ్ కాలేదని చెప్పకనే చెప్పింది ‘కొండపొలం’ టీమ్. కానీ ఊహించని విధంగా అఖిల్ సినిమా పోస్ట్పోన్ అయ్యింది. అయితే ఆ డేట్కి నాగశౌర్య ఆల్రెడీ ఖర్చీఫ్ వేసేశాడు.
లక్ష్మీ సౌజన్య డైరెక్షన్లో తను నటించిన ‘వరుడు కావలెను’ చిత్రం అక్టోబర్ 15నే రిలీజవుతోంది. పైగా ముందు రోజు శర్వానంద్ ‘మహాసముద్రం’ కూడా వస్తుంది. అంటే ప్లాన్ మారినా అఖిల్కి పోటీ తప్పడం లేదన్నమాట.
This post was last modified on September 26, 2021 1:09 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…