కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఓ హ్యూజ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. ఆ ఆశను ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ తీరుస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. పోస్టర్లు, టీజర్లు చూస్తే ఆ చాన్స్ ఉందనే నమ్మకం కూడా కలిగింది. కానీ కరోనా వల్ల మూవీ థియేటర్కి రావడం మాత్రం కాస్త లేటయ్యింది.
ఎట్టకేలకి థియేటర్లు తెరుచుకోవడంతో అక్టోబర్ 8న రిలీజ్ చేసేస్తామని ఆ మధ్య అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ప్లాన్ మారింది. బ్యాచ్లర్ దసరా బరిలోకి దిగుతున్నాడు. రిలీజ్ డేట్ని చేంజ్ చేశామని, అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని థియేటర్స్లో విడుదల చేయబోతున్నామని నిన్న ప్రకటించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా కాబట్టి పండగ సందర్భంగా రిలీజైతే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారట.
అఖిల్, పూజ ఫ్లైట్లో ఉన్న రొమాంటిక్ ఫొటోని కూడా వదిలారు. నిజానికి అక్టోబర్ 8న ఈ చిత్రంతో పాటు వైష్ణవ్ తేజ్, క్రిష్ల ‘కొండపొలం’ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆ సినిమాని వాయిదా వేస్తున్నారనే గుసగుసలు వినిపించాయి. అయితే రీసెంట్గా చేసిన ట్రైలర్ అనౌన్స్మెంట్ ద్వారా తమ రిలీజ్ డేట్ చేంజ్ కాలేదని చెప్పకనే చెప్పింది ‘కొండపొలం’ టీమ్. కానీ ఊహించని విధంగా అఖిల్ సినిమా పోస్ట్పోన్ అయ్యింది. అయితే ఆ డేట్కి నాగశౌర్య ఆల్రెడీ ఖర్చీఫ్ వేసేశాడు.
లక్ష్మీ సౌజన్య డైరెక్షన్లో తను నటించిన ‘వరుడు కావలెను’ చిత్రం అక్టోబర్ 15నే రిలీజవుతోంది. పైగా ముందు రోజు శర్వానంద్ ‘మహాసముద్రం’ కూడా వస్తుంది. అంటే ప్లాన్ మారినా అఖిల్కి పోటీ తప్పడం లేదన్నమాట.
This post was last modified on September 26, 2021 1:09 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…