కొన్ని సినిమాలు అంతే. విడుదలకు ముందు కొన్ని పాటలతో విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. తీరా.. సినిమా విడుదలయ్యాక.. సదరు పాట ప్రేక్షకుల ఊహకు.. అంచనాలకు తగ్గట్లుగా ఉండటం చాలా కష్టం. కరోనాకు ముందు త్రివిక్రమ్ అల వైకుంఠపురం మూవీలో సామజవరగమన పాటను తీసుకుంటే.. ఆ పాట ఎంతలా ఫేమస్ అయ్యిందో తెలిసిందే. ఆ పాట ఎలాంటి స్టిట్యూవేషన్ లో వస్తుందన్న ఆసక్తి చాలామందిలో ఉండటం.. అందుకు తగ్గట్లే ఆ పాట ఉండటంతో సినిమాకు ప్లస్ అయ్యింది.
కానీ.. తాజా లవ్ స్టోరీలో సారంగదరియా పాట పరిస్థితి ఇందుకు భిన్నమని చెప్పాలి. హుషారు ఎక్కించే ఈ పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేసినప్పుడు దీని మీద జరిగిన చర్చ.. అదెంత వైరల్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పటానికి లేదు. ఆ పాట మీద ఉన్న అంచనాలు అంతా ఇంతా కావు. నిజానికి.. ఈ పాట పుణ్యమా అని.. ‘లవ్ స్టోరీ’ సినిమాకు సరికొత్త క్రేజ్ వచ్చిందనటంలో సందేహం లేదు.
అలాంటి ఈ పాట.. వెండితెర మీద చూద్దామని.. దాన్ని ఎంజాయ్ చేద్దామన్న వారికి నిరాశ కలుగక మానదు. ఎందుకంటే.. ఈ పాటకు సంబంధించి ప్రేక్షకుడు ఊహించుకునే మూడ్ కు భిన్నమైన వాతావరణంలో ఈ పాట సినిమాలో వస్తుంది. దీంతో.. ఇంత హుషారైన పాటను ఎంజాయ్ చేయలేకపోవటమే కాదు.. ఇంతలా ఎదురుచూసిన పాట.. ఇలానా? అన్న పెదవి విరుపు పలువురి నోట వినిపిస్తోంది.
యూ ట్యూబ్ లో తెలుగు పాటల పరంగా.. సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసిన ఈ పాట.. వెండి తెర మీద ఎంజాయ్ చేసేలా లేదని.. ఆశించినంతలా లేక తేలిపోయిందంటున్నారు. ఈ పాటకు సంబంధించి హైప్ క్రియేట్ అయిన వేళ.. ఈ పాట వచ్చే సమయానికి సంబంధించి దర్శకుడు శేఖర్ కమ్ముల కాస్తంత సమాచారం ఇచ్చి.. ప్రేక్షకుల్ని మెంటల్ గా ప్రిపేర్ చేసి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on September 25, 2021 3:47 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…