సోషల్ మీడియా జమానాలో కొన్ని సిత్రాలు అలా జరిగిపోతుంటాయి. గడిచిన నాలుగు నెలలుగా తెలుగు వారి నోటి మీద తరచూ వినిపిస్తున్న పాట ‘బుల్లెట్టు బండి’. పెండ్లి కూతురు ఈ పాటకు వేసిన స్టెప్పులు.. అవి కాస్తా సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున షేర్ కావటం.. అది కాస్తా వైరల్ గా మారటమే కాదు.. ఎక్కడ చూసినా..ఆ పాట ఇప్పుడు మస్తు ఫేమస్ కావటం తెలిసిందే. దీంతో.. ఈ ఫోక్ సాంగ్ ను సొంతం చేసుకోవటానికి పెద్ద పెద్ద ఆఫర్లతో వెళుతున్నారు..
మోహనా భోగరాజు పాడిన ఆ పాటకు.. లక్ష్మణ్ సాహిత్యం అందించగా.. ఎస్ కె బాజీ సంగీతాన్ని ఇచ్చారు. ఏప్రిల్లో విడుదలైన ఈ పాటకు ఆదరణ లభించినా.. పెండ్లి కుమార్తె తన బరాజ్ సందర్భంగారోడ్డు మీద స్టెప్పులు వేయటంతో.. ఈ పాట మరో లెవల్ కు వెళ్లింది. ఇప్పటికే 92 మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్న ఈ పాటను తమ సినిమాలో వాడేయాలని పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట.
ఆన్ లైన్ లో టాప్ లేపుతున్న ‘బుల్లెట్టుబండి’ పాటను సొంతం చేసుకోవటానికి చాలామంది ప్రయత్నిస్తున్నా.. మోహనా మాత్రం నోఅంటే నో చెప్పేస్తున్నారు. ఎంతో కష్టపడిన చేసిన ఈ పాటను తమ యూట్యూబ్ చానల్ లో ఒక మంచి గురుతుగా ఉండిపోవాలే తప్పించి.. ఎవరికో కట్టబెట్టేందుకు ఆమె ఇష్టపడటం లేదు. ఈ క్రేజీ ‘బుల్లెట్టు బండి’ని సొంతం చేసుకుంటే.. తమ సినిమాకు చక్కటి ప్రచారంగా మారుతుందన్న ఆలోచనకు.. గాయని మోహనా మాత్రం నో అన్న మాటతో బ్రేకులు వేస్తున్నారట. ఫ్యాన్సీ ఆఫర్ కు సైతం ససేమిరా అనటం గమనార్హం.
This post was last modified on September 25, 2021 10:41 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…