సోషల్ మీడియా జమానాలో కొన్ని సిత్రాలు అలా జరిగిపోతుంటాయి. గడిచిన నాలుగు నెలలుగా తెలుగు వారి నోటి మీద తరచూ వినిపిస్తున్న పాట ‘బుల్లెట్టు బండి’. పెండ్లి కూతురు ఈ పాటకు వేసిన స్టెప్పులు.. అవి కాస్తా సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున షేర్ కావటం.. అది కాస్తా వైరల్ గా మారటమే కాదు.. ఎక్కడ చూసినా..ఆ పాట ఇప్పుడు మస్తు ఫేమస్ కావటం తెలిసిందే. దీంతో.. ఈ ఫోక్ సాంగ్ ను సొంతం చేసుకోవటానికి పెద్ద పెద్ద ఆఫర్లతో వెళుతున్నారు..
మోహనా భోగరాజు పాడిన ఆ పాటకు.. లక్ష్మణ్ సాహిత్యం అందించగా.. ఎస్ కె బాజీ సంగీతాన్ని ఇచ్చారు. ఏప్రిల్లో విడుదలైన ఈ పాటకు ఆదరణ లభించినా.. పెండ్లి కుమార్తె తన బరాజ్ సందర్భంగారోడ్డు మీద స్టెప్పులు వేయటంతో.. ఈ పాట మరో లెవల్ కు వెళ్లింది. ఇప్పటికే 92 మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్న ఈ పాటను తమ సినిమాలో వాడేయాలని పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట.
ఆన్ లైన్ లో టాప్ లేపుతున్న ‘బుల్లెట్టుబండి’ పాటను సొంతం చేసుకోవటానికి చాలామంది ప్రయత్నిస్తున్నా.. మోహనా మాత్రం నోఅంటే నో చెప్పేస్తున్నారు. ఎంతో కష్టపడిన చేసిన ఈ పాటను తమ యూట్యూబ్ చానల్ లో ఒక మంచి గురుతుగా ఉండిపోవాలే తప్పించి.. ఎవరికో కట్టబెట్టేందుకు ఆమె ఇష్టపడటం లేదు. ఈ క్రేజీ ‘బుల్లెట్టు బండి’ని సొంతం చేసుకుంటే.. తమ సినిమాకు చక్కటి ప్రచారంగా మారుతుందన్న ఆలోచనకు.. గాయని మోహనా మాత్రం నో అన్న మాటతో బ్రేకులు వేస్తున్నారట. ఫ్యాన్సీ ఆఫర్ కు సైతం ససేమిరా అనటం గమనార్హం.
This post was last modified on September 25, 2021 10:41 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…