సోషల్ మీడియా జమానాలో కొన్ని సిత్రాలు అలా జరిగిపోతుంటాయి. గడిచిన నాలుగు నెలలుగా తెలుగు వారి నోటి మీద తరచూ వినిపిస్తున్న పాట ‘బుల్లెట్టు బండి’. పెండ్లి కూతురు ఈ పాటకు వేసిన స్టెప్పులు.. అవి కాస్తా సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున షేర్ కావటం.. అది కాస్తా వైరల్ గా మారటమే కాదు.. ఎక్కడ చూసినా..ఆ పాట ఇప్పుడు మస్తు ఫేమస్ కావటం తెలిసిందే. దీంతో.. ఈ ఫోక్ సాంగ్ ను సొంతం చేసుకోవటానికి పెద్ద పెద్ద ఆఫర్లతో వెళుతున్నారు..
మోహనా భోగరాజు పాడిన ఆ పాటకు.. లక్ష్మణ్ సాహిత్యం అందించగా.. ఎస్ కె బాజీ సంగీతాన్ని ఇచ్చారు. ఏప్రిల్లో విడుదలైన ఈ పాటకు ఆదరణ లభించినా.. పెండ్లి కుమార్తె తన బరాజ్ సందర్భంగారోడ్డు మీద స్టెప్పులు వేయటంతో.. ఈ పాట మరో లెవల్ కు వెళ్లింది. ఇప్పటికే 92 మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్న ఈ పాటను తమ సినిమాలో వాడేయాలని పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట.
ఆన్ లైన్ లో టాప్ లేపుతున్న ‘బుల్లెట్టుబండి’ పాటను సొంతం చేసుకోవటానికి చాలామంది ప్రయత్నిస్తున్నా.. మోహనా మాత్రం నోఅంటే నో చెప్పేస్తున్నారు. ఎంతో కష్టపడిన చేసిన ఈ పాటను తమ యూట్యూబ్ చానల్ లో ఒక మంచి గురుతుగా ఉండిపోవాలే తప్పించి.. ఎవరికో కట్టబెట్టేందుకు ఆమె ఇష్టపడటం లేదు. ఈ క్రేజీ ‘బుల్లెట్టు బండి’ని సొంతం చేసుకుంటే.. తమ సినిమాకు చక్కటి ప్రచారంగా మారుతుందన్న ఆలోచనకు.. గాయని మోహనా మాత్రం నో అన్న మాటతో బ్రేకులు వేస్తున్నారట. ఫ్యాన్సీ ఆఫర్ కు సైతం ససేమిరా అనటం గమనార్హం.
This post was last modified on September 25, 2021 10:41 am
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…