సోషల్ మీడియా జమానాలో కొన్ని సిత్రాలు అలా జరిగిపోతుంటాయి. గడిచిన నాలుగు నెలలుగా తెలుగు వారి నోటి మీద తరచూ వినిపిస్తున్న పాట ‘బుల్లెట్టు బండి’. పెండ్లి కూతురు ఈ పాటకు వేసిన స్టెప్పులు.. అవి కాస్తా సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున షేర్ కావటం.. అది కాస్తా వైరల్ గా మారటమే కాదు.. ఎక్కడ చూసినా..ఆ పాట ఇప్పుడు మస్తు ఫేమస్ కావటం తెలిసిందే. దీంతో.. ఈ ఫోక్ సాంగ్ ను సొంతం చేసుకోవటానికి పెద్ద పెద్ద ఆఫర్లతో వెళుతున్నారు..
మోహనా భోగరాజు పాడిన ఆ పాటకు.. లక్ష్మణ్ సాహిత్యం అందించగా.. ఎస్ కె బాజీ సంగీతాన్ని ఇచ్చారు. ఏప్రిల్లో విడుదలైన ఈ పాటకు ఆదరణ లభించినా.. పెండ్లి కుమార్తె తన బరాజ్ సందర్భంగారోడ్డు మీద స్టెప్పులు వేయటంతో.. ఈ పాట మరో లెవల్ కు వెళ్లింది. ఇప్పటికే 92 మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్న ఈ పాటను తమ సినిమాలో వాడేయాలని పలువురు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట.
ఆన్ లైన్ లో టాప్ లేపుతున్న ‘బుల్లెట్టుబండి’ పాటను సొంతం చేసుకోవటానికి చాలామంది ప్రయత్నిస్తున్నా.. మోహనా మాత్రం నోఅంటే నో చెప్పేస్తున్నారు. ఎంతో కష్టపడిన చేసిన ఈ పాటను తమ యూట్యూబ్ చానల్ లో ఒక మంచి గురుతుగా ఉండిపోవాలే తప్పించి.. ఎవరికో కట్టబెట్టేందుకు ఆమె ఇష్టపడటం లేదు. ఈ క్రేజీ ‘బుల్లెట్టు బండి’ని సొంతం చేసుకుంటే.. తమ సినిమాకు చక్కటి ప్రచారంగా మారుతుందన్న ఆలోచనకు.. గాయని మోహనా మాత్రం నో అన్న మాటతో బ్రేకులు వేస్తున్నారట. ఫ్యాన్సీ ఆఫర్ కు సైతం ససేమిరా అనటం గమనార్హం.
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…