‘క్రాక్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తున్నారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే మరో సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. ఈ సినిమాతో శరత్ అనే కొత్త దర్శకుడు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు ముందు రవితేజ.. త్రినాధరావు నక్కిన డైరెక్షన్ లో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది.
ఇద్దరి మధ్య కథా చర్చలు జరగడంతో ఈ ప్రాజెక్ట్ కూడా ఉంటుందని అన్నారు. కానీ కొన్నిరోజుల తరువాత రవితేజకి కథ నచ్చలేదని.. ఈ సినిమా ఆగిపోయిందని అన్నారు. రవితేజ నో చెప్పడంతో మెగాహీరో వరుణ్ తేజ్ కి ఇదే కథ చెప్పి ఓకే చేయించుకున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని దర్శకుడు త్రినాధరావు క్లారిటీ ఇచ్చారు. ఎన్నో సిట్టింగ్స్ తరువాత రవితేజ ఈ సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు.
సినిమాకి సంబంధించిన స్క్రీన్ ప్లే రెడీ అయిందని.. కుదిరితే అక్టోబర్ మొదటివారం నుంచే సెట్స్ పైకి వచ్చేస్తామని అంటున్నారు. చాలా కాలంగా ఇదే కథపై రైటర్ ప్రసన్న కుమార్ తో కలిసి పని చేస్తున్నానని అన్నారు. ఇప్పుడు ఇదే కథతో రవితేజ హీరోగా సినిమా చేయబోతున్నట్లు స్పష్టంచేశారు. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ బ్యూటీ ‘పెళ్లి సందD’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ కుర్ర హీరోయిన్ రవితేజ పక్కన ఎలా సూట్ అవుతుందో చూడాలి!
This post was last modified on September 21, 2021 1:30 pm
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…