‘క్రాక్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తున్నారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే మరో సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. ఈ సినిమాతో శరత్ అనే కొత్త దర్శకుడు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు ముందు రవితేజ.. త్రినాధరావు నక్కిన డైరెక్షన్ లో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది.
ఇద్దరి మధ్య కథా చర్చలు జరగడంతో ఈ ప్రాజెక్ట్ కూడా ఉంటుందని అన్నారు. కానీ కొన్నిరోజుల తరువాత రవితేజకి కథ నచ్చలేదని.. ఈ సినిమా ఆగిపోయిందని అన్నారు. రవితేజ నో చెప్పడంతో మెగాహీరో వరుణ్ తేజ్ కి ఇదే కథ చెప్పి ఓకే చేయించుకున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని దర్శకుడు త్రినాధరావు క్లారిటీ ఇచ్చారు. ఎన్నో సిట్టింగ్స్ తరువాత రవితేజ ఈ సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు.
సినిమాకి సంబంధించిన స్క్రీన్ ప్లే రెడీ అయిందని.. కుదిరితే అక్టోబర్ మొదటివారం నుంచే సెట్స్ పైకి వచ్చేస్తామని అంటున్నారు. చాలా కాలంగా ఇదే కథపై రైటర్ ప్రసన్న కుమార్ తో కలిసి పని చేస్తున్నానని అన్నారు. ఇప్పుడు ఇదే కథతో రవితేజ హీరోగా సినిమా చేయబోతున్నట్లు స్పష్టంచేశారు. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ బ్యూటీ ‘పెళ్లి సందD’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ కుర్ర హీరోయిన్ రవితేజ పక్కన ఎలా సూట్ అవుతుందో చూడాలి!
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…