Movie News

హీరోల పారితోష‌కం ప్ర‌భుత్వం చేతుల మీదుగాన‌ట‌


ఒక సినిమాకు ప‌ని చేసే న‌టీన‌టుల‌కు.. సాంకేతిక నిపుణుల‌కు ప్ర‌భుత్వమే పారితోష‌కం ఇస్తే..?పారితోష‌కాల కింద ఇవ్వాల్సిన డ‌బ్బుల‌న్నీ నిర్మాతల ద‌గ్గ‌ర్నుంచి క‌లెక్ట్ చేసి.. వాటిని ఒక అకౌంట్లో వేసి దాని ద్వారా అంద‌రికీ ప్ర‌భుత్వ‌మే చెల్లింపులు చేస్తే..? ఈ ప్ర‌తిపాద‌నలు వింటే ఏమ‌నిపిస్తోంది? ఇదెలా సాధ్యం అంటారా? మాజీ మంత్రి.. కాపు నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి ఈ చిత్ర‌మైన ప్ర‌తిపాద‌న‌లు చేశారు.

తన‌కు ఒకప్పుడు ఎగ్జిబిట‌ర్‌గా ప‌ని చేసిన అనుభ‌వంతో ఈ సూచ‌న‌లు చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఆయ‌న ఒక లేఖ కూడా రాయ‌డం విశేషం. ఆ లేఖలో ఆయ‌న ఇంకా ఏమేం అన్నారంటే..

“సినిమా టికెట్లు ఆన్‌లైన్లో విక్రయించేలా చూడాలని ప్రముఖ నటులు మిమ్మల్ని కోరిన విషయం ఎమ్‌. ఎల్‌.ఎ.రోజా, మరికొందరు పెద్దలు వెల్లడించిన సంగతి పత్రికల్లో చూశా. వారు కోరిన విధానం చాలా మంచిది. మాజీ ఎగ్జిబిటర్‌గా నేను కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నా. వీటిని అందరూ గౌరవించాలని కోరుకుంటున్నా. నటీనటులు, సాంకేతిక బృంద సభ్యులు, కార్వాన్లు, వసతి గృహాలు, భోజనం తదితర వాటికి సంబంధించిన ఖర్చుని నిర్మాత నుంచి తీసుకుని, ప్రభుత్వం దాన్ని నేరుగా సినిమా కోసం పనిచేసే వారి (నటీనటులు, సాంకేతిబృంద సభ్యులు తదితరులు) బ్యాంకు ఖాతాల్లోకి పంపిస్తే బాగుంటుంది. అప్పుడు ఎలాంటి అనవరసరపు ఖర్చులు, ఎగవేతలు ఉండవు. ప్రతి పైసా ఎలా ఖర్చు చేశామో తెలుస్తుంది. బ్లాక్‌ మనీ అనే మాట వినిపించదు. వైట్‌ మనీతోనే వ్యాపారం నడుస్తుంది. చిత్ర నిర్మాణ వ్యయం తగ్గే అవకాశం ఉంది” అని త‌న లేఖ‌లో ముద్ర‌గ‌డ‌ పేర్కొన్నారు.

ఐతే ముద్ర‌గ‌డ ప్ర‌తిపాద‌న‌ల‌పై ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. నిర్మాత‌ల క‌ష్టం తెలియాలంటే ముద్ర‌గ‌డ ముందు ఒక సినిమా నిర్మించి.. ఆ త‌ర్వాత ఇలాంటి ప్ర‌తిపాద‌న‌లు చేయాల‌ని ఆయ‌న‌న్నారు.

This post was last modified on September 21, 2021 11:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’

తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్…

59 minutes ago

ఫౌజీకి ప్రాణం… చివరి ఘట్టం

రాజా సాబ్ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ ఫౌజీనే. స్పిరిట్ వచ్చే ఏడాది ఆల్రెడీ లాక్ చేసుకుంది కనక ఈ…

3 hours ago

చెన్నై మ్యాచ్ అవుట్ వివాదం.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నితీష్ రాణా అవుటైన తీరు ఇప్పుడు…

3 hours ago

గట్టు మీదున్న ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా

ఎల్లుండి విడుదల కాబోతున్న గోదారి గట్టుపైన సినిమా కోసం హీరో సుమంత్ ప్రభాస్ ఫుల్ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఒకపక్క ఇంటర్వ్యూలు…

5 hours ago

ఎంత పెద్ద నాయకుడు ఫోన్ చేసినా పట్టించుకోకండి: అనిత

టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నోట నుంచి వచ్చే మాటలు ఎప్పటికప్పుడు వైరల్…

6 hours ago

జియో ఉంది… పెద్దికి టెన్ష‌న్ లేదు

ఈ రోజుల్లో సినిమా తీయ‌డం కంటే దాన్ని జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డం, మంచి రిలీజ్ ఉండేలా చూసుకోవ‌డం స‌వాలుగా మారింది. తెలుగులో…

7 hours ago