విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రకటించింది రెండేళ్ల ముందు. షూటింగ్ మొదలు కావడంలో మామూలుగానే కొంత ఆలస్యం జరిగింది. చిత్రీకరణ మొదలయ్యాక కరోనా ప్రభావంతో సినిమా ఆలస్యం అయింది. చాలా స్పీడుగా సినిమాలు తీస్తాడని పేరున్న పూరి జగన్నాథ్.. తన కెరీర్లోనూ ఎన్నడూ లేనంత సుదీర్ఘ సమయం తీసుకుంటున్నాడు ఈ చిత్రానికి. ఈ ఏడాది ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదని స్పష్టమవుతోంది.
దీంతో విజయ్ ఓకే చేసిన వేరే సినిమాల పరిస్థితి డోలాయమానంలో పడింది. ‘లైగర్’ తర్వాత అతను శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సింది. ఐతే తనకు ఖాళీ దొరక్కపోవడానికి తోడు.. కథ విషయంలో సంతృప్తి చెందక.. పైగా ‘టక్ జగదీష్’ ఆశించిన ఫలితం రాకపోవడం లాంటి కారణాలు కూడా తోడై ఈ చిత్రాన్ని విజయ్ తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఐతే విజయ్ నో అన్నప్పటికీ శివ ఈ కథనేమీ పక్కన పెట్టట్లేదు. అదే కథను అక్కినేని నాగచైతన్యతో తీయడానికి రెడీ అయినట్లు సమాచారం. శివతో ఇంతకుముందు ‘మజిలీ’ సినిమా చేశాడు చైతూ. ఆ సినిమా అతడి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ‘టక్ జగదీష్’ అంత బాగా లేకపోయినా శివ మీద అతను నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బేనర్లో ఈ సినిమా తెరకెక్కనుందట. త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుందని.. ఈ ఏడాది చివర్లో సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం.
చైతూ ప్రస్తుతం ‘లవ్ స్టోరి’ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్ యు’ సినిమాను కూడా అతను పూర్తి చేశాడు. ఒక హిందీ వెబ్ సిరీస్ను అతను ప్రస్తుతం అంగీకరించాడు. త్వరలోనే దీని షూటింగ్ మొదలు కానుంది. దీంతో సమాంతరంగా శివ సినిమాను అతను చేసే అవకాశం ఉంది.
This post was last modified on September 20, 2021 6:34 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…