ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఆమిర్ ఖాన్ ఒకడు. లగాన్, రంగ్ దె బసంతి, త్రీ ఇడియట్స్, పీకే, దంగల్ సినిమాలతో ఎప్పటికప్పుడు భారతీయ సినిమా రికార్డులను అతను బద్దలు కొడుతూ వచ్చాడు. కంటెంట్ పరంగా, కలెక్షన్ల పరంగా ఇండియన్ సినిమా ప్రమాణాలను అమాంతం పెంచిన సూపర్ స్టార్ అతను. బాహుబలితో బాగా కలిసొచ్చి ప్రభాస్ అందరినీ మించిన స్టార్ అయిపోయాడు కానీ.. లేదంటే ఇండియాలో నంబర్ వన్ హీరో ఆమిర్ ఖానే.
ఐతే తాను అంత పెద్ద స్టార్ అనే అహంభావం ఆమిర్లో ఎప్పుడూ కనిపించదు. చాలా అణకువతో కనిపిస్తాడు. హుందాగా వ్యవహరిస్తాడు. ఎన్నడూ లేని విధంగా ఓ తెలుగు సినిమా ఈవెంట్ కోసం ఆమిర్ హైదరాబాద్కు విచ్చేసి ఇక్కడా తన హుందాతనాన్ని చాటుకున్నాడు. తన కొత్త మిత్రుడు అక్కినేని నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరి’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరంజీవిని ఆమిర్ గౌరవించిన తీరు ప్రశంసలందుకుంది.
ఈ ఈవెంట్ వేదిక మీద చివర్లో ఆమిర్ కొన్ని ఫొటోలు దిగాడు. బాలీవుడ్ సూపర్ స్టార్, పైగా ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా వచ్చిన నేపథ్యంలో ఒక వైపు నాగచైతన్య, ఇంకో వైపు చిరంజీవి నిలబడి.. మధ్యలో ఆమిర్ను నిల్చోబెట్టి ఫొటో దిగబోయారు.
ఐతే ఒక్క క్షణం ఆగిన ఆమిర్.. తన ఎడమ వైపున్న చిరంజీవిని మధ్యలోకి తీసుకొచ్చి తను ఆయన స్థానంలోకి వెళ్లాడు. చిరంజీవి తన కన్నా సీనియర్. ఇండియన్ సినిమా లెజెండ్స్లో ఒకడిగా పేరున్నవాడు. అలాంటి నటుడిని పక్కన ఉంచి తాను మధ్య స్థానాన్ని తీసుకోవడం సమంజసం కాదని వెంటనే స్పందించి తన స్థానం మార్చుకుని చిరును సముచిత రీతిలో గౌరవించిన తీరు అందరినీ మెప్పించింది. సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తూ ఆమిర్ హుందాతనాన్ని పొగిడేస్తున్నారు చిరు ఫ్యాన్స్. అంతే కాక చిరు అంటే ఏంటో చెప్పడానికి ఈ వీడియోనే రుజువు అంటూ దాన్ని ఆనందంగా షేర్ చేస్తున్నారు.
This post was last modified on September 20, 2021 7:25 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…