ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఆమిర్ ఖాన్ ఒకడు. లగాన్, రంగ్ దె బసంతి, త్రీ ఇడియట్స్, పీకే, దంగల్ సినిమాలతో ఎప్పటికప్పుడు భారతీయ సినిమా రికార్డులను అతను బద్దలు కొడుతూ వచ్చాడు. కంటెంట్ పరంగా, కలెక్షన్ల పరంగా ఇండియన్ సినిమా ప్రమాణాలను అమాంతం పెంచిన సూపర్ స్టార్ అతను. బాహుబలితో బాగా కలిసొచ్చి ప్రభాస్ అందరినీ మించిన స్టార్ అయిపోయాడు కానీ.. లేదంటే ఇండియాలో నంబర్ వన్ హీరో ఆమిర్ ఖానే.
ఐతే తాను అంత పెద్ద స్టార్ అనే అహంభావం ఆమిర్లో ఎప్పుడూ కనిపించదు. చాలా అణకువతో కనిపిస్తాడు. హుందాగా వ్యవహరిస్తాడు. ఎన్నడూ లేని విధంగా ఓ తెలుగు సినిమా ఈవెంట్ కోసం ఆమిర్ హైదరాబాద్కు విచ్చేసి ఇక్కడా తన హుందాతనాన్ని చాటుకున్నాడు. తన కొత్త మిత్రుడు అక్కినేని నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరి’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరంజీవిని ఆమిర్ గౌరవించిన తీరు ప్రశంసలందుకుంది.
ఈ ఈవెంట్ వేదిక మీద చివర్లో ఆమిర్ కొన్ని ఫొటోలు దిగాడు. బాలీవుడ్ సూపర్ స్టార్, పైగా ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా వచ్చిన నేపథ్యంలో ఒక వైపు నాగచైతన్య, ఇంకో వైపు చిరంజీవి నిలబడి.. మధ్యలో ఆమిర్ను నిల్చోబెట్టి ఫొటో దిగబోయారు.
ఐతే ఒక్క క్షణం ఆగిన ఆమిర్.. తన ఎడమ వైపున్న చిరంజీవిని మధ్యలోకి తీసుకొచ్చి తను ఆయన స్థానంలోకి వెళ్లాడు. చిరంజీవి తన కన్నా సీనియర్. ఇండియన్ సినిమా లెజెండ్స్లో ఒకడిగా పేరున్నవాడు. అలాంటి నటుడిని పక్కన ఉంచి తాను మధ్య స్థానాన్ని తీసుకోవడం సమంజసం కాదని వెంటనే స్పందించి తన స్థానం మార్చుకుని చిరును సముచిత రీతిలో గౌరవించిన తీరు అందరినీ మెప్పించింది. సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తూ ఆమిర్ హుందాతనాన్ని పొగిడేస్తున్నారు చిరు ఫ్యాన్స్. అంతే కాక చిరు అంటే ఏంటో చెప్పడానికి ఈ వీడియోనే రుజువు అంటూ దాన్ని ఆనందంగా షేర్ చేస్తున్నారు.
This post was last modified on September 20, 2021 7:25 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…