లాక్ డౌన్ లో ఓటీటీ బిజినెస్ ఊపందుకున్న సంగతి తెలిసిందే. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చాలా వరకు ఓటీటీలోకి వచ్చేశాయి. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలను కూడా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పటికే చాలా మంది దర్శకులు, హీరోలు, హీరోయిన్లు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ ఓటీటీ కోసం సినిమాలు చేయాలనుకుంటున్నారు. వరుస హిట్టు సినిమాలతో దూసుకుపోతున్న కొరటాల శివ ఇప్పుడు ఓటీటీ ఛానెల్స్ కోసం కొన్ని కథలు సిద్ధం చేస్తున్నారట.
వీటి కోసం తనకు బాగా తెలిసిన కొంతమంది దర్శకులతో కలిసి ఓ గ్రూప్ ను తయారుచేశారు కొరటాల శివ. ప్రస్తుతం కొరటాల గైడెన్స్ లో కొంతమంది దర్శకులు ఓటీటీ కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. ఓటీటీ సంస్థల నుంచి అనుమతులు వచ్చిన తరువాత స్వయంగా కొరటాల శివ సినిమాపై పెట్టుబడులు పెట్టి.. సదరు దర్శకులతో సినిమాలను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నిజానికి ఈ సినిమాను దసరా కానుకహా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పటివరకు సినిమా రిలీజ్ డేట్ పై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు కొరటాల శివ. ఈ సినిమా కోసం కథను సిద్ధం చేస్తూనే మరోపక్క ఓటీటీల కోసం కథలను రెడీ చేస్తున్నారు. మరి కొరటాల ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…