లాక్ డౌన్ లో ఓటీటీ బిజినెస్ ఊపందుకున్న సంగతి తెలిసిందే. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చాలా వరకు ఓటీటీలోకి వచ్చేశాయి. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలను కూడా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పటికే చాలా మంది దర్శకులు, హీరోలు, హీరోయిన్లు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ ఓటీటీ కోసం సినిమాలు చేయాలనుకుంటున్నారు. వరుస హిట్టు సినిమాలతో దూసుకుపోతున్న కొరటాల శివ ఇప్పుడు ఓటీటీ ఛానెల్స్ కోసం కొన్ని కథలు సిద్ధం చేస్తున్నారట.
వీటి కోసం తనకు బాగా తెలిసిన కొంతమంది దర్శకులతో కలిసి ఓ గ్రూప్ ను తయారుచేశారు కొరటాల శివ. ప్రస్తుతం కొరటాల గైడెన్స్ లో కొంతమంది దర్శకులు ఓటీటీ కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. ఓటీటీ సంస్థల నుంచి అనుమతులు వచ్చిన తరువాత స్వయంగా కొరటాల శివ సినిమాపై పెట్టుబడులు పెట్టి.. సదరు దర్శకులతో సినిమాలను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నిజానికి ఈ సినిమాను దసరా కానుకహా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పటివరకు సినిమా రిలీజ్ డేట్ పై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు కొరటాల శివ. ఈ సినిమా కోసం కథను సిద్ధం చేస్తూనే మరోపక్క ఓటీటీల కోసం కథలను రెడీ చేస్తున్నారు. మరి కొరటాల ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…
రాజకీయ చతురతలో మరోసారి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చాణక్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. సర్కారును ఇరుకున పెట్టేసి.. కుల,…
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల ఫిజిక్, లుక్స్ మీద రకరకాల కామెంట్స్ రావడం చాలా కామన్. కొంచెం బరువు పెరిగినా లేదా…