లాక్ డౌన్ లో ఓటీటీ బిజినెస్ ఊపందుకున్న సంగతి తెలిసిందే. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చాలా వరకు ఓటీటీలోకి వచ్చేశాయి. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలను కూడా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పటికే చాలా మంది దర్శకులు, హీరోలు, హీరోయిన్లు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ ఓటీటీ కోసం సినిమాలు చేయాలనుకుంటున్నారు. వరుస హిట్టు సినిమాలతో దూసుకుపోతున్న కొరటాల శివ ఇప్పుడు ఓటీటీ ఛానెల్స్ కోసం కొన్ని కథలు సిద్ధం చేస్తున్నారట.
వీటి కోసం తనకు బాగా తెలిసిన కొంతమంది దర్శకులతో కలిసి ఓ గ్రూప్ ను తయారుచేశారు కొరటాల శివ. ప్రస్తుతం కొరటాల గైడెన్స్ లో కొంతమంది దర్శకులు ఓటీటీ కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. ఓటీటీ సంస్థల నుంచి అనుమతులు వచ్చిన తరువాత స్వయంగా కొరటాల శివ సినిమాపై పెట్టుబడులు పెట్టి.. సదరు దర్శకులతో సినిమాలను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నిజానికి ఈ సినిమాను దసరా కానుకహా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పటివరకు సినిమా రిలీజ్ డేట్ పై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు కొరటాల శివ. ఈ సినిమా కోసం కథను సిద్ధం చేస్తూనే మరోపక్క ఓటీటీల కోసం కథలను రెడీ చేస్తున్నారు. మరి కొరటాల ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!
This post was last modified on September 18, 2021 8:49 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…