లాక్ డౌన్ లో ఓటీటీ బిజినెస్ ఊపందుకున్న సంగతి తెలిసిందే. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చాలా వరకు ఓటీటీలోకి వచ్చేశాయి. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలను కూడా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పటికే చాలా మంది దర్శకులు, హీరోలు, హీరోయిన్లు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ ఓటీటీ కోసం సినిమాలు చేయాలనుకుంటున్నారు. వరుస హిట్టు సినిమాలతో దూసుకుపోతున్న కొరటాల శివ ఇప్పుడు ఓటీటీ ఛానెల్స్ కోసం కొన్ని కథలు సిద్ధం చేస్తున్నారట.
వీటి కోసం తనకు బాగా తెలిసిన కొంతమంది దర్శకులతో కలిసి ఓ గ్రూప్ ను తయారుచేశారు కొరటాల శివ. ప్రస్తుతం కొరటాల గైడెన్స్ లో కొంతమంది దర్శకులు ఓటీటీ కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. ఓటీటీ సంస్థల నుంచి అనుమతులు వచ్చిన తరువాత స్వయంగా కొరటాల శివ సినిమాపై పెట్టుబడులు పెట్టి.. సదరు దర్శకులతో సినిమాలను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నిజానికి ఈ సినిమాను దసరా కానుకహా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పటివరకు సినిమా రిలీజ్ డేట్ పై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు కొరటాల శివ. ఈ సినిమా కోసం కథను సిద్ధం చేస్తూనే మరోపక్క ఓటీటీల కోసం కథలను రెడీ చేస్తున్నారు. మరి కొరటాల ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!
This post was last modified on September 18, 2021 8:49 am
బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో…
తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…
రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…
వేసవి సీజన్లో కొంచెం ముందుగానే రేసులోకి దిగింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. కానీ ఈ చిత్రం టాలీవుడ్కు శుభారంభాన్ని అందించలేకపోయింది.…
మావిగన్.. నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న పదం. ఇప్పటిదాకా ఎన్నడూ వినని ఈ పదం…
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…