తమన్నా కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ తారగానే గుర్తింపు పొందింది. కొన్ని పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేసినప్పటికీ.. గ్లామర్తోనే ఆమె ఎక్కువగా ఆకట్టుకుంది. ఐతే అవసరమైతే పాటల్లో అందాలు ఆరబోయడం కామనే కానీ.. సినిమా అంతటా, కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ గ్లామర్ విందు చేయడం మాత్రం ఇంత వరకు జరగలేదు.
‘మాస్ట్రో’లో మిల్కీ బ్యూటీ ఇలాగే కనిపించి ఆశ్చర్యపరిచింది. స్క్రీన్లోకి అడుగు పెట్టి తొలి సన్నివేశం నుంచి చివరి వరకు తమన్నా అందాలు ఓ రేంజిలో ఆరబోసిందీ సినిమాలో. చాలా సీన్లలో క్లీవేజ్ షోలతో ప్రేక్షకుల మతులు పోగొట్టేసింది. హిందీలో టబు చేసిన పాత్రను తమన్నా ఇక్కడ చేయడం విశేషం. ఒరిజినల్లో ఆ పాత్రలో గ్లామర్ కోణమే కనిపించదు. ఇక్కడ టబుకు తగ్గట్లుగా ఎవరరైనా మధ్య వయస్కురాలిని తీసుకుంటారని అనుకుంటే తమన్నాను ఆ పాత్రకు ఎంపిక చేసి ఆశ్చర్యపరిచాడు దర్శకుడు మేర్లపాక గాంధీ.
పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్కు తమన్నాను ఎంచుకోవడంలోనే ఈ పాత్ర ఔచిత్యం కొంత దెబ్బ తినగా.. ఆమెతో సినిమా అంతటా అందాల విందు చేయించడంతో పాత్ర స్వరూపమే మారిపోయింది. ప్రేక్షకులు ఈ పాత్రను చూసే కోణమే మారిపోయింది. ఎంతో సీనియర్ అయిన నరేష్ పక్కన అంత సెక్సీగా ఉండే తమన్నా పూర్తిగా మిస్ ఫిట్ అయింది.
వీళ్ల జోడీనే చాలా ఆడ్గా కనిపించింది. తమన్నా గ్లామర్ పట్ల ఆసక్తి ఉన్న వాళ్లకు ఆ పాత్ర బాగానే కనెక్ట్ అయి ఉండొచ్చు కానీ.. కథ పరంగా మాత్రం ఆ పాత్ర సూట్ కాలేదు. తమన్నా రాంగ్ కాస్టింగ్ అన్న ఫీలింగ్ కలిగింది ఒరిజినల్ చూసిన వాళ్లందరికీ. ఒరిజినల్లో ఉన్న ఇంపాక్ట్ ఇక్కడ లేకపోవడానికి తమన్నా.. ఆ పాత్రను చేయడం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అసలు ఇలాంటి పాత్రకు అనసూయ భరద్వాజ్ అయితే కరెక్టుగా ఉండేదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వాళ్లూ లేకపోలేదు. ఆమె అయితే నరేష్ పక్కన తమన్నా కన్నా బాగుండేదేమో.
This post was last modified on September 17, 2021 9:08 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…