అక్కినేని సమంత ఇటీవలే ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా తరువాత కొన్నిరోజులు గ్యాప్ తీసుకుంటానని చెప్పింది. ఈ మధ్యకాలంలో తన స్నేహితులతో కలిసి తెగ ట్రిప్ లు వేస్తోంది. ఇదిలా ఉండగా.. ఆమె ముంబైలో ఇల్లు కొనుక్కుందని.. త్వరలోనే అక్కడికి షిఫ్ట్ అవ్వబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సమంతకి బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయని.. ఇక తెలుగు సినిమాలు చేయదంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే ఇప్పుడు సడెన్ గా ఓ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది సమంత. ఈ కథ సమంతకు ఎంతగా నచ్చిందంటే.. ఈ ఏడాది నవంబర్ నుంచే షూటింగ్ లో పాల్గొనడానికి ఒప్పేసుకుంది. అంతగా తన కథతో సమంతను మెప్పించాడు ఓ కొత్తకుర్రాడు. ఇదొక లేడీ ఓరియెంటెడ్ సినిమా అని టాక్. ఇప్పటివరకు ఏ భాషలో కూడా ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రాలేదట. అందుకే సమంత కథ విన్న వెంటనే కాల్షీట్స్ ఇచ్చేసింది.
ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించబోతున్నారు. గతంలో ఈయన నిర్మించిన ‘ఆదిత్య369’ సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుంది. రీఎంట్రీలో ఈ ప్రొడ్యూసర్ నిర్మించిన ‘జెంటిల్మెన్’, ‘సమ్మోహనం’ వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈసారి సమంత సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి!
This post was last modified on September 17, 2021 10:11 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…