అక్కినేని సమంత ఇటీవలే ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా తరువాత కొన్నిరోజులు గ్యాప్ తీసుకుంటానని చెప్పింది. ఈ మధ్యకాలంలో తన స్నేహితులతో కలిసి తెగ ట్రిప్ లు వేస్తోంది. ఇదిలా ఉండగా.. ఆమె ముంబైలో ఇల్లు కొనుక్కుందని.. త్వరలోనే అక్కడికి షిఫ్ట్ అవ్వబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సమంతకి బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయని.. ఇక తెలుగు సినిమాలు చేయదంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే ఇప్పుడు సడెన్ గా ఓ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది సమంత. ఈ కథ సమంతకు ఎంతగా నచ్చిందంటే.. ఈ ఏడాది నవంబర్ నుంచే షూటింగ్ లో పాల్గొనడానికి ఒప్పేసుకుంది. అంతగా తన కథతో సమంతను మెప్పించాడు ఓ కొత్తకుర్రాడు. ఇదొక లేడీ ఓరియెంటెడ్ సినిమా అని టాక్. ఇప్పటివరకు ఏ భాషలో కూడా ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రాలేదట. అందుకే సమంత కథ విన్న వెంటనే కాల్షీట్స్ ఇచ్చేసింది.
ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించబోతున్నారు. గతంలో ఈయన నిర్మించిన ‘ఆదిత్య369’ సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుంది. రీఎంట్రీలో ఈ ప్రొడ్యూసర్ నిర్మించిన ‘జెంటిల్మెన్’, ‘సమ్మోహనం’ వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈసారి సమంత సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి!
This post was last modified on September 17, 2021 10:11 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…