అక్కినేని సమంత ఇటీవలే ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా తరువాత కొన్నిరోజులు గ్యాప్ తీసుకుంటానని చెప్పింది. ఈ మధ్యకాలంలో తన స్నేహితులతో కలిసి తెగ ట్రిప్ లు వేస్తోంది. ఇదిలా ఉండగా.. ఆమె ముంబైలో ఇల్లు కొనుక్కుందని.. త్వరలోనే అక్కడికి షిఫ్ట్ అవ్వబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సమంతకి బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయని.. ఇక తెలుగు సినిమాలు చేయదంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే ఇప్పుడు సడెన్ గా ఓ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది సమంత. ఈ కథ సమంతకు ఎంతగా నచ్చిందంటే.. ఈ ఏడాది నవంబర్ నుంచే షూటింగ్ లో పాల్గొనడానికి ఒప్పేసుకుంది. అంతగా తన కథతో సమంతను మెప్పించాడు ఓ కొత్తకుర్రాడు. ఇదొక లేడీ ఓరియెంటెడ్ సినిమా అని టాక్. ఇప్పటివరకు ఏ భాషలో కూడా ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రాలేదట. అందుకే సమంత కథ విన్న వెంటనే కాల్షీట్స్ ఇచ్చేసింది.
ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించబోతున్నారు. గతంలో ఈయన నిర్మించిన ‘ఆదిత్య369’ సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుంది. రీఎంట్రీలో ఈ ప్రొడ్యూసర్ నిర్మించిన ‘జెంటిల్మెన్’, ‘సమ్మోహనం’ వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈసారి సమంత సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి!
This post was last modified on September 17, 2021 10:11 am
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…
ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…
జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…