Kohli and Rohit Sharma
కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నదే నిజమైంది. విరాట్ కోహ్లి టీమ్ ఇండియా టీ20 కెప్టెన్సీని వదిలేశాడు. కాకపోతే అతను వన్డే సారథ్యాన్ని కూడా విడిచి పెడతాడని ప్రచారం జరిగింది. కానీ టీ20ల వరకే సారథ్యానికి గుడ్బై చెప్పాడు కోహ్లి. బ్యాట్స్మన్గా కోహ్లికి తిరుగులేదు కానీ.. కెప్టెన్గా అతడికి మరీ గొప్ప పేరేమీ లేదు.
అతడి నాయకత్వంలో జట్టు వివిధ ఫార్మాట్లలో చాలా విజయాలు సాధించింది కానీ.. వన్డే, టీ20ల్లో ఒక్క మేజర్ టైటిల్ కూడా గెలవలేదు. ఐపీఎల్లో అతడి నాయకత్వంలోని బెంగళూరు జట్టు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. అదే సమయంలో రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబయి ఇండియన్స్ ఐదుసార్లు విజేతగా నిలిచింది. దీంతో కోహ్లిని తప్పించి టీ20 పగ్గాలు రోహిత్కు అప్పగించాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో వినిపిస్తోంది.
ఇంతకుముందు బ్యాట్స్మన్గా టాప్ ఫాంలో ఉన్నపుడు కోహ్లి కెప్టెన్సీ వదులుకోవాలన్న డిమాండ్లు మరీ గట్టిగా లేవు. కానీ గత రెండేళ్లలో విరాట్ ఫాం అంత గొప్పగా లేదు. దీంతో డిమాండ్లు పెరిగాయి. ఐతే టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లి తప్పుకోనున్న నేపథ్యంలో రోహిత్కే పగ్గాలు దక్కుతాయని చాలామంది భావిస్తున్నారు.
కానీ కచ్చితంగా రోహిత్నే టీ20 కెప్టెన్ను చేస్తారని అనుకోలేం. ఎందుకంటే టీ20లంటే కుర్రాళ్ల ఆట. భవిష్యత్ దృష్టి యువ ఆటగాళ్లకు పగ్గాలందించడం మంచిదనే అభిప్రాయం ఉంది. రోహిత్కు ఐపీఎల్లో, భారత జట్టుకు నాయకత్వం వహించిన కొన్ని మ్యాచ్ల్లో ఎంత మంచి రికార్డున్నప్పటికీ.. అతను కోహ్లి కన్నా రెండేళ్లు పెద్దవాడు.
అతడి వయసు 34 ఏళ్లు. ఈ వయసులో రోహిత్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం కంటే భవిష్యత్ దృష్ట్యా కేఎల్ రాహుల్ (29 ఏళ్లు), రిషబ్ పంత్ (23 ఏళ్లు) లాంటి వాళ్లకు ఛాన్స్ ఇవ్వడం మంచిదనే అభిప్రాయాలూ ఉన్నాయి. బీసీసీఐ ఈ దిశగా ఆలోచిస్తుందా.. రోహిత్నే ఎంచుకుంటుందా చూడాలి మరి.
This post was last modified on September 16, 2021 9:07 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…