‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత రాజమౌళి ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే విషయంలో ఆసక్తి నెలకొంది. మహేష్ బాబుతో సినిమా ఉంటుందని తెలియడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి మహేష్ బాబు సినిమాకి మధ్యలో మరో సినిమా చేయాలనేది రాజమౌళి ప్లాన్ అట. మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారు పాట’ సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమా తరువాత మహేష్ బాబు కొంత గ్యాప్ తీసుకోబోతున్నారు. నెక్స్ట్ సినిమా మొదలుపెట్టడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఈ గ్యాప్ లో రాజమౌళి ఓ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. తక్కువ బడ్జెట్ లో ప్రయోగాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నారు. బాలీవుడ్ లో ఈ సినిమాను తీస్తారట. బాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్ తో సినిమాను తెరకెక్కించబోతున్నారు.
ఒకట్రెండు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసి.. మరో నెల రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి.. తరువాత ప్రమోషన్స్ కి సమయం కేటాయించి సినిమాను విడుదల చేయాలనేది రాజమౌళి ఆలోచన. అయితే ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తారా..? లేక దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఉంటారా అనే విషయంలో క్లారిటీ లేదు.
గతంలో రాజమౌళి తన సినిమా సినిమాకి మధ్యలో ఇలా తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా అదే రూట్ ని ఫాలో అవ్వబోతున్నారన్నమాట!
This post was last modified on September 16, 2021 2:14 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…