‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత రాజమౌళి ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే విషయంలో ఆసక్తి నెలకొంది. మహేష్ బాబుతో సినిమా ఉంటుందని తెలియడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి మహేష్ బాబు సినిమాకి మధ్యలో మరో సినిమా చేయాలనేది రాజమౌళి ప్లాన్ అట. మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారు పాట’ సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమా తరువాత మహేష్ బాబు కొంత గ్యాప్ తీసుకోబోతున్నారు. నెక్స్ట్ సినిమా మొదలుపెట్టడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఈ గ్యాప్ లో రాజమౌళి ఓ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. తక్కువ బడ్జెట్ లో ప్రయోగాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నారు. బాలీవుడ్ లో ఈ సినిమాను తీస్తారట. బాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్ తో సినిమాను తెరకెక్కించబోతున్నారు.
ఒకట్రెండు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసి.. మరో నెల రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి.. తరువాత ప్రమోషన్స్ కి సమయం కేటాయించి సినిమాను విడుదల చేయాలనేది రాజమౌళి ఆలోచన. అయితే ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తారా..? లేక దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఉంటారా అనే విషయంలో క్లారిటీ లేదు.
గతంలో రాజమౌళి తన సినిమా సినిమాకి మధ్యలో ఇలా తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా అదే రూట్ ని ఫాలో అవ్వబోతున్నారన్నమాట!
This post was last modified on September 16, 2021 2:14 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…