‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత రాజమౌళి ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే విషయంలో ఆసక్తి నెలకొంది. మహేష్ బాబుతో సినిమా ఉంటుందని తెలియడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి మహేష్ బాబు సినిమాకి మధ్యలో మరో సినిమా చేయాలనేది రాజమౌళి ప్లాన్ అట. మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారు పాట’ సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమా తరువాత మహేష్ బాబు కొంత గ్యాప్ తీసుకోబోతున్నారు. నెక్స్ట్ సినిమా మొదలుపెట్టడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఈ గ్యాప్ లో రాజమౌళి ఓ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. తక్కువ బడ్జెట్ లో ప్రయోగాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నారు. బాలీవుడ్ లో ఈ సినిమాను తీస్తారట. బాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్ తో సినిమాను తెరకెక్కించబోతున్నారు.
ఒకట్రెండు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసి.. మరో నెల రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి.. తరువాత ప్రమోషన్స్ కి సమయం కేటాయించి సినిమాను విడుదల చేయాలనేది రాజమౌళి ఆలోచన. అయితే ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తారా..? లేక దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఉంటారా అనే విషయంలో క్లారిటీ లేదు.
గతంలో రాజమౌళి తన సినిమా సినిమాకి మధ్యలో ఇలా తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా అదే రూట్ ని ఫాలో అవ్వబోతున్నారన్నమాట!
This post was last modified on September 16, 2021 2:14 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…