‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత రాజమౌళి ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే విషయంలో ఆసక్తి నెలకొంది. మహేష్ బాబుతో సినిమా ఉంటుందని తెలియడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి మహేష్ బాబు సినిమాకి మధ్యలో మరో సినిమా చేయాలనేది రాజమౌళి ప్లాన్ అట. మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారు పాట’ సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమా తరువాత మహేష్ బాబు కొంత గ్యాప్ తీసుకోబోతున్నారు. నెక్స్ట్ సినిమా మొదలుపెట్టడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఈ గ్యాప్ లో రాజమౌళి ఓ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. తక్కువ బడ్జెట్ లో ప్రయోగాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నారు. బాలీవుడ్ లో ఈ సినిమాను తీస్తారట. బాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్ తో సినిమాను తెరకెక్కించబోతున్నారు.
ఒకట్రెండు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసి.. మరో నెల రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి.. తరువాత ప్రమోషన్స్ కి సమయం కేటాయించి సినిమాను విడుదల చేయాలనేది రాజమౌళి ఆలోచన. అయితే ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తారా..? లేక దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఉంటారా అనే విషయంలో క్లారిటీ లేదు.
గతంలో రాజమౌళి తన సినిమా సినిమాకి మధ్యలో ఇలా తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా అదే రూట్ ని ఫాలో అవ్వబోతున్నారన్నమాట!
This post was last modified on September 16, 2021 2:14 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…