అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్.. తొలిసారి ఈ సమాచారం బయటికి వచ్చినపుడు చాలామందికి నమ్మశక్యంగా అనిపించలేదు. షారుఖ్ ఏంటి.. సౌత్ ఇండియన్ డైరెక్టర్తో పని చేయడమేంటి.. అందులోనూ పక్కా సౌత్ ఇండియన్ లోకల్, మాస్ సినిమాలు తీసే అట్లీతో షారుఖ్ జట్టు కట్టడం ఏంటి అనిపించింది. కానీ చివరికి నిజంగానే షారుఖ్.. అట్లీతో సినిమాకు రెడీ అయిపోయాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది కూడా. పుణెలో తొలి షెడ్యూల్ మొదలుపెట్టారు.
ఇలా షూటింగ్ మొదలైందో లేదో.. అలా ఈ సినిమా టైటిల్ టైటిల్ బయటికి వచ్చేసింది. లయన్ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా చిత్రీకరణ మొదలుకావడం విశేషం. అనుకోని విధంగా ఈ టైటిల్ మీడియాలోకి వచ్చేసింది.
పుణెలో ఒక ప్రాంతంలో షూటింగ్ అనుమతుల కోసం చిత్ర బృందం పెట్టుకున్న అప్లికేషన్ కాపీ మీడియాలోకి వచ్చేసింది. అందులో సినిమా వివరాలను వెల్లడిస్తూ.. టైటిల్ లయన్ అని పేర్కొన్నారు. షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు.. ఇందులో షారుఖ్కు జోడీగా నయనతార నటిస్తున్నట్లు కూడా ఈ అప్లికేషన్లో పేర్కొన్నారు. దర్శకుడిగా అట్లీ కుమార్ అని పూర్తి పేరుంది. మొత్తానికి ఈ చిత్రానికి లయన్ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టడంతో షారుఖ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగానే ఉన్నారు.
ఈ టైటిల్ను బట్టి అట్లీ.. కింగ్ ఖాన్తో మంచి మాస్ మూవీ తీస్తున్నాడనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. జీరో సినిమాతో మార్కెట్ బాగా దెబ్బ తిన్న షారుఖ్.. రెండేళ్లకు పైగా విరామం తీసుకుని పఠాన్ అనే సినిమా మొదలుపెట్టాడు. అది చివరి దశలో ఉండగానే.. అట్లీ సినిమాను పట్టాలెక్కించాడు.
This post was last modified on September 16, 2021 9:55 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…