ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది సందీప్ కిషన్ కొత్త చిత్రం గల్లీ రౌడీ. కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రానికి కోన వెంకట్ సమర్పకుడన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఈ సినిమా రచనలో భాగస్వామ్యం లేదు. అయినా సరే.. పోస్టర్ మీద ఫ్రమ్ ద రైటర్ ఆఫ్ ఢీ, రెడీ, దూకుడు అని వేసుకోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆ సినిమా రైటర్ నుంచి వస్తున్న సినిమా అంటే.. ఈ చిత్రానికి కూడా ఆయనే రచయిత అనుకోవడం సహజం. మరి రైటింగ్లో తన భాగస్వామ్యం లేకపోయినా కోన ఇలా ఎందుకు వేసుకున్నట్లు అన్న సందేహం కలుగుతోంది.
గల్లీ రౌడీ ప్రి రిలీజ్ ఈవెంట్లో దీనికి సమాధానం చెప్పాడు కోన. ఈ సినిమాకు కథ అందించింది భాను అయితే.. సినిమా తీసింది నాగేశ్వరరెడ్డి అని.. తాను ఈ చిత్రానికి రచయితను కానని.. ఐతే పోస్టర్లో ఫ్రమ్ ద రైటర్ ఆఫ్ ఢీ, రెడీ, దూకుడు అని వేయడానికి కారణం.. ఈ సినిమా కూడా ఆ చిత్రాల తరహాలోనే ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ కావడమే అని కోన వెల్లడించాడు.
ఇక తాను ఏ హీరోతో తొలిసారి పని చేసినా ఆ సినిమా బ్లాక్బస్టర్ అవుతుందన్న సెంటిమెంటు ఉందని.. ఢీ సినిమా విష్ణుకు బ్లాక్బస్టర్ అయితే.. రామ్తో తొలిసారి చేసిన రెడీ కూడా ఘనవిజయం సాధించిందని.. ఎన్టీఆర్తో చేసిన తొలి సినిమా అదుర్స్.. మహేష్ బాబుతో చేసిన తొలి చిత్రం దూకుడు కూడా భారీ విజయాలను అందుకున్నాయని.. ఇప్పుడు సందీప్ కిషన్తో తాను చేసిన తొలి సినిమా గల్లీ రౌడీ కూడా బ్లాక్బస్టర్ కావడం గ్యారెంటీ అని కోన ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on September 16, 2021 9:49 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…