సూపర్ స్టార్ రజినీకాంత్కు సింగర్ మనో చెప్పే డబ్బింగ్ ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రజినీ స్టైల్కు తగ్గట్లుగా అదిరిపోయే రీతిలో డబ్బింగ్ చెబుతుంటారు మనో. అది రజినీ సొంత గొంతు అన్నట్లే ఫీలవుతారు తెలుగు ప్రేక్షకులు. నాన్నా పందులే గుంపుగా వస్తాయ్.. తరహా డైలాగ్స్ మనో ఎంత పవర్ ఫుల్గా చెప్పాడో తెలిసిందే.
ఐతే మొదట్లో రజినీకి తెలుగులో గొంతు అరువిచ్చింది మనో కాదు. ‘బాషా’ సినిమా వరకు సాయికుమారే డబ్బింగ్ చెప్పేవాడు. కానీ ‘ముత్తు’ సినిమాలో అనుకోకుండా మనోకు అవకాశం దొరికింది. దాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నాడు మనో. ఇక అక్కడి నుంచి దాదాపుగా రజినీ ప్రతి సినిమాకూ మనోనే డబ్బింగ్ చెబుతున్నాడు. తనకు ఈ అవకాశం ఎలా వచ్చిందో.. తన డబ్బింగ్ పట్ల రజినీ అభిప్రాయమేంటో వివరిస్తూ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు మనో. ఆ విశేషాలేంటో చూద్దాం పదండి.
“ముత్తు సినిమా టైంలో సాయికుమార్ కన్నడలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ‘ముత్తు’ రిలీజ్ డేట్ ప్రకటించాక సాయికుమార్ కోసం ప్రయత్నిస్తే ఆయనకు కుదరలేదు. దీంతో రచయిత శ్రీరామకృష్ణ ఫోన్ చేసి నన్ను అడిగారు. క్లైమాక్స్ సన్నివేశానికి డబ్బింగ్ చెప్పమని, అది నచ్చితే రజినీ ఓకే చేస్తారని అన్నారు. సూపర్ స్టార్కి ఒక్క సీన్లో డబ్బింగ్ చెప్పినా చాలు అనుకుని వెళ్లి ఆ పని పూర్తి చేశాను. రజినీ సార్కు నచ్చడంతో నన్నే పూర్తిగా డబ్బింగ్ చెప్పమన్నారు. చంద్రముఖి రిలీజయ్యాక ఒక రోజు రాత్రి రజినీ సార్ ఫోన్ చేశారు. నేను రజినీకాంత్ను మాట్లాడుతున్నా అనగానే ఎవరో మిమిక్రీ చేసి ఆటపట్టిస్తున్నారనుకున్నా. ఏ రజినీకాంత్ అన్నాను. తర్వాత ఆయనే నిజమైన రజినీ అని తెలిసి సారీ చెప్పాను. చంద్రముఖి తెలుగు వెర్షన్ చూశానని, డబ్బింగ్ అద్భుతంగా చెప్పారని ప్రశంసించారు. ఏం కావాలో కోరుకోమని అడిగితే.. ‘నేనే బిరియాని చేసి పంపిస్తా. తిని పెట్టండి చాలు’ అన్నాను. అంతటి మహానుభావుడికి భోజనం పెట్టే అదృష్టం దక్కింది” అని మనో ఎమోషనల్ అయ్యారు.
This post was last modified on September 15, 2021 3:21 pm
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…