సూపర్ స్టార్ రజినీకాంత్కు సింగర్ మనో చెప్పే డబ్బింగ్ ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రజినీ స్టైల్కు తగ్గట్లుగా అదిరిపోయే రీతిలో డబ్బింగ్ చెబుతుంటారు మనో. అది రజినీ సొంత గొంతు అన్నట్లే ఫీలవుతారు తెలుగు ప్రేక్షకులు. నాన్నా పందులే గుంపుగా వస్తాయ్.. తరహా డైలాగ్స్ మనో ఎంత పవర్ ఫుల్గా చెప్పాడో తెలిసిందే.
ఐతే మొదట్లో రజినీకి తెలుగులో గొంతు అరువిచ్చింది మనో కాదు. ‘బాషా’ సినిమా వరకు సాయికుమారే డబ్బింగ్ చెప్పేవాడు. కానీ ‘ముత్తు’ సినిమాలో అనుకోకుండా మనోకు అవకాశం దొరికింది. దాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నాడు మనో. ఇక అక్కడి నుంచి దాదాపుగా రజినీ ప్రతి సినిమాకూ మనోనే డబ్బింగ్ చెబుతున్నాడు. తనకు ఈ అవకాశం ఎలా వచ్చిందో.. తన డబ్బింగ్ పట్ల రజినీ అభిప్రాయమేంటో వివరిస్తూ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు మనో. ఆ విశేషాలేంటో చూద్దాం పదండి.
“ముత్తు సినిమా టైంలో సాయికుమార్ కన్నడలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ‘ముత్తు’ రిలీజ్ డేట్ ప్రకటించాక సాయికుమార్ కోసం ప్రయత్నిస్తే ఆయనకు కుదరలేదు. దీంతో రచయిత శ్రీరామకృష్ణ ఫోన్ చేసి నన్ను అడిగారు. క్లైమాక్స్ సన్నివేశానికి డబ్బింగ్ చెప్పమని, అది నచ్చితే రజినీ ఓకే చేస్తారని అన్నారు. సూపర్ స్టార్కి ఒక్క సీన్లో డబ్బింగ్ చెప్పినా చాలు అనుకుని వెళ్లి ఆ పని పూర్తి చేశాను. రజినీ సార్కు నచ్చడంతో నన్నే పూర్తిగా డబ్బింగ్ చెప్పమన్నారు. చంద్రముఖి రిలీజయ్యాక ఒక రోజు రాత్రి రజినీ సార్ ఫోన్ చేశారు. నేను రజినీకాంత్ను మాట్లాడుతున్నా అనగానే ఎవరో మిమిక్రీ చేసి ఆటపట్టిస్తున్నారనుకున్నా. ఏ రజినీకాంత్ అన్నాను. తర్వాత ఆయనే నిజమైన రజినీ అని తెలిసి సారీ చెప్పాను. చంద్రముఖి తెలుగు వెర్షన్ చూశానని, డబ్బింగ్ అద్భుతంగా చెప్పారని ప్రశంసించారు. ఏం కావాలో కోరుకోమని అడిగితే.. ‘నేనే బిరియాని చేసి పంపిస్తా. తిని పెట్టండి చాలు’ అన్నాను. అంతటి మహానుభావుడికి భోజనం పెట్టే అదృష్టం దక్కింది” అని మనో ఎమోషనల్ అయ్యారు.
This post was last modified on September 15, 2021 3:21 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…