సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది. ఓ పక్క తెలుగు సినిమాలు చేస్తూనే.. మరోపక్క హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతోంది. ఈ క్రమంలో తనకు ఏదైనా కథ కొత్తగా అనిపిస్తే వెంటనే ఒప్పేసుకుంటోంది. ఇలానే ‘ఛత్రివాలి’ అనే సినిమాలో నటించడానికి అంగీకరించింది. ఇందులో ఆమె కండోమ్ టెస్టర్ పాత్రలో కనిపించడానికి రెడీ అయింది.
ఈ విషయం తెలిసినప్పుడు ఆమె ఫ్యాన్స్ షాకయ్యారు. ఇలాంటి బోల్డ్ రోల్ లో రకుల్ ఎలా నటిస్తుందోనని అనుకున్నారు. దర్శకుడు తేజస్ విజయ్ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు సోషల్ మీడియాలో రకుల్ పై ట్రోలింగ్ జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందని సమాచారం. నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారట. సినిమా రిలీజ్ అయ్యే సమయానికి మరిన్ని వివాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావించిన ఆయన ప్రాజెక్ట్ ను ఆపేసినట్లు తెలుస్తోంది.
మరి దర్శకుడు తేజస్ కొత్త ప్రొడ్యూసర్ ను వెతుక్కుంటాడేమో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ అటకెక్కినట్లే. మరోపక్క రకుల్ కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది. దాదాపు అరడజనుకి పైగా బాలీవుడ్ సినిమాలు ఆమె చేతిలో ఉన్నారు. అలానే తెలుగులో ఆమె నటించిన ‘కొండపొలం’ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేశాడు.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…
ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…