ఇండియాలో ప్రస్తుతం ట్రూ పాన్ ఇండియా రైటర్ అంటే విజయేంద్ర ప్రసాద్ పేరే చెప్పాలి. ఆయన వివిధ భాషల్లో భారీ చిత్రాలకు రచన చేస్తూ తన సత్తా చాటుతున్నారు. ‘బాహుబలి’తో వచ్చిన పేరును చాలా బాగా ఉపయోగించుకుని.. హిందీలో భజరంగి భాయిజాన్, మణికర్ణిక.. తమిళంలో మెర్శల్, తలైవి.. కన్నడలో జాగ్వార్ లాంటి భారీ చిత్రాలకు ఆయన పని చేశారు. హిందీలో ఆయనకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు.
తాజాగా ఆయన ‘సీత’ పేరుతో ఓ స్క్రిప్టు రాశారు. రామాయణాన్ని సీత కోణంలో చూపించే మెగా బడ్జెట్ మూవీ ఇది. ఈ సినిమాకు కొన్ని నెలల ముందే స్క్రిప్టు పూర్తయింది కానీ.. అందులో లీడ్ రోల్ చేసే నటి ఎవరన్నదే తేలలేదు. కరీనా కపూర్ అని.. దీపికా పదుకొనే అని.. రకరకాల పేర్లు వినిపించాయి. కానీ చివరికి విజయేంద్ర ప్రసాద్ ఫేవరెట్ యాక్ట్రెస్ కంగనా రనౌత్నే ఈ చిత్రంలో ప్రధాన పాత్రకు ఖరారు చేశారు.
‘మణికర్ణిక’ సమయంలో కంగనాతో విజయేంద్ర ప్రసాద్కు మంచి అనుబంధం ఏర్పడింది. ఆయన్ని ఆమె గురువులా చూస్తుంది. బాలీవుడ్లో పెద్ద పెద్ద వాళ్లను అసలేమాత్రం కేర్ చేయని కంగనా.. విజయేంద్రను మాత్రం ఎంతో గౌరవిస్తుంది. ‘మణికర్ణిక’ టైంలో ఆమె విజయేంద్రకు పాదాభివందనం కూడా చేయడం గమనార్హం. ఆయన చెప్పాడనే తమిళంలో జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’ సినిమాలో నటించింది. ఈ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వకపోయినప్పటికీ ఆమె విజయేంద్ర రాసిన మరో స్క్రిప్టుతో సినిమా చేయడానికి ఓకే చెప్పింది.
‘సీత’ పేరుతోనే తెరకెక్కనున్న ఈ చిత్రానికి విజయేంద్ర కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా సమకూరుస్తున్నాడు. అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హ్యూమన్ బీయింగ్ స్టూడియో నిర్మించనుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
This post was last modified on September 14, 2021 9:05 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…