ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రిష.. ఇక్కడ హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ కు వెళ్లింది. అక్కడ స్టార్ హీరోలతో రొమాన్స్ చేస్తూ బిజీ అయింది. ఆ తరువాత కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు మరోసారి త్రిష పేరు టాలీవుడ్ లో వినిపిస్తోంది. తెలుగులో తెరకెక్కుతోన్న రెండు పెద్ద ప్రాజెక్ట్ లలో త్రిషను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి ‘భోళా శంకర్’ అనే టైటిల్ పెట్టారు. ఇందులో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్ కనిపించబోతుంది. ఇక చిరు సరసన హీరోయిన్ గా త్రిషను సంప్రదించారట. దాదాపు ఆ ఛాన్స్ ఆమెకే అని అంటున్నారు. గతంలో ఈ బ్యూటీ చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సమయంలో వీరిద్దరి జంటపై విమర్శలు వినిపించాయి. ఆ సినిమాలో చిరు కాస్త బొద్దుగా కనిపించడంతో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వలేదు.
చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో కూడా హీరోయిన్ గా మొదట త్రిషనే అనుకున్నారు. కానీ ఆమె హ్యాండ్ ఇవ్వడంతో కాజల్ కి ఛాన్స్ దక్కింది. ఈసారి మాత్రం చిరు-త్రిష కాంబినేషన్ సెట్ అవ్వడం పక్కా అంటున్నారు. అలానే బాలయ్య సినిమాలో త్రిషను హీరోయిన్ గా అనుకుంటున్నారట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా కమిట్ అయ్యారు.
వచ్చే నెలలో ఈ సినిమా మొదలుకానుంది. ఇందులో హీరోయిన్ గా త్రిష పేరును పరిశీలిస్తున్నారు. బాలయ్య నటించిన ‘లయన్’ సినిమాలో త్రిష హీరోయిన్ గా కనిపించింది. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. అయినప్పటికీ మరోసారి త్రిషను రంగంలోకి దింపాలనుకుంటున్నారు. మరి ఈ ఇద్దరు సీనియర్ హీరోలకు త్రిష గ్రీన్ ఇస్తుందేమో చూడాలి!
This post was last modified on September 14, 2021 5:33 pm
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…