ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రిష.. ఇక్కడ హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ కు వెళ్లింది. అక్కడ స్టార్ హీరోలతో రొమాన్స్ చేస్తూ బిజీ అయింది. ఆ తరువాత కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు మరోసారి త్రిష పేరు టాలీవుడ్ లో వినిపిస్తోంది. తెలుగులో తెరకెక్కుతోన్న రెండు పెద్ద ప్రాజెక్ట్ లలో త్రిషను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి ‘భోళా శంకర్’ అనే టైటిల్ పెట్టారు. ఇందులో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్ కనిపించబోతుంది. ఇక చిరు సరసన హీరోయిన్ గా త్రిషను సంప్రదించారట. దాదాపు ఆ ఛాన్స్ ఆమెకే అని అంటున్నారు. గతంలో ఈ బ్యూటీ చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సమయంలో వీరిద్దరి జంటపై విమర్శలు వినిపించాయి. ఆ సినిమాలో చిరు కాస్త బొద్దుగా కనిపించడంతో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వలేదు.
చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో కూడా హీరోయిన్ గా మొదట త్రిషనే అనుకున్నారు. కానీ ఆమె హ్యాండ్ ఇవ్వడంతో కాజల్ కి ఛాన్స్ దక్కింది. ఈసారి మాత్రం చిరు-త్రిష కాంబినేషన్ సెట్ అవ్వడం పక్కా అంటున్నారు. అలానే బాలయ్య సినిమాలో త్రిషను హీరోయిన్ గా అనుకుంటున్నారట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా కమిట్ అయ్యారు.
వచ్చే నెలలో ఈ సినిమా మొదలుకానుంది. ఇందులో హీరోయిన్ గా త్రిష పేరును పరిశీలిస్తున్నారు. బాలయ్య నటించిన ‘లయన్’ సినిమాలో త్రిష హీరోయిన్ గా కనిపించింది. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. అయినప్పటికీ మరోసారి త్రిషను రంగంలోకి దింపాలనుకుంటున్నారు. మరి ఈ ఇద్దరు సీనియర్ హీరోలకు త్రిష గ్రీన్ ఇస్తుందేమో చూడాలి!
This post was last modified on September 14, 2021 5:33 pm
పెళ్లి లేదు ప్రెగ్నెంటూ లేదు, కొడుకు పేరు కృష్ణమనోహర్ అనేది కొత్త సామెత. కొన్ని రిలీజ్ డేట్ల వ్యవహారం చూస్తుంటే…
ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి సాగు ఎక్కువ. దేశంలో కేరళ తర్వాత.. కోనసీమలో భారీ ఎత్తున కొబ్బరి సాగు చేస్తున్నారు.…
సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…