ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రిష.. ఇక్కడ హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ కు వెళ్లింది. అక్కడ స్టార్ హీరోలతో రొమాన్స్ చేస్తూ బిజీ అయింది. ఆ తరువాత కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు మరోసారి త్రిష పేరు టాలీవుడ్ లో వినిపిస్తోంది. తెలుగులో తెరకెక్కుతోన్న రెండు పెద్ద ప్రాజెక్ట్ లలో త్రిషను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి ‘భోళా శంకర్’ అనే టైటిల్ పెట్టారు. ఇందులో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్ కనిపించబోతుంది. ఇక చిరు సరసన హీరోయిన్ గా త్రిషను సంప్రదించారట. దాదాపు ఆ ఛాన్స్ ఆమెకే అని అంటున్నారు. గతంలో ఈ బ్యూటీ చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సమయంలో వీరిద్దరి జంటపై విమర్శలు వినిపించాయి. ఆ సినిమాలో చిరు కాస్త బొద్దుగా కనిపించడంతో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వలేదు.
చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో కూడా హీరోయిన్ గా మొదట త్రిషనే అనుకున్నారు. కానీ ఆమె హ్యాండ్ ఇవ్వడంతో కాజల్ కి ఛాన్స్ దక్కింది. ఈసారి మాత్రం చిరు-త్రిష కాంబినేషన్ సెట్ అవ్వడం పక్కా అంటున్నారు. అలానే బాలయ్య సినిమాలో త్రిషను హీరోయిన్ గా అనుకుంటున్నారట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా కమిట్ అయ్యారు.
వచ్చే నెలలో ఈ సినిమా మొదలుకానుంది. ఇందులో హీరోయిన్ గా త్రిష పేరును పరిశీలిస్తున్నారు. బాలయ్య నటించిన ‘లయన్’ సినిమాలో త్రిష హీరోయిన్ గా కనిపించింది. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. అయినప్పటికీ మరోసారి త్రిషను రంగంలోకి దింపాలనుకుంటున్నారు. మరి ఈ ఇద్దరు సీనియర్ హీరోలకు త్రిష గ్రీన్ ఇస్తుందేమో చూడాలి!
This post was last modified on September 14, 2021 5:33 pm
సీనియర్ సినీ నటి పావలా శ్యామల కన్నుమూశారు. 75 ఏళ్ల వయసున్న ఆమె కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…