Movie News

పూరి త‌మ్ముడి మెగా మూవీ


టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ అండ‌తో ఇండ‌స్ట్రీలోకి హీరోగా అరంగేట్రం చేశాడు అత‌డి త‌మ్ముడు సాయిరాం శంక‌ర్. త‌న అన్న ద‌ర్శ‌క‌త్వంలోనే 143 అనే సినిమాతో అత‌ను ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. త‌ర్వాత న‌టించిన కొన్ని సినిమాలు కూడా నిరాశ‌నే మిగిల్చాయి. ఐతే పూరి క‌థ‌తో చేసిన‌ బంప‌ర్ ఆఫ‌ర్ మాత్రం మంచి ఫ‌లితాన్నందించింది. కానీ ఆ విజ‌యాన్ని అత‌ను స‌రిగా ఉప‌యోగించుకోలేక‌పోయాడు. త‌ర్వాత చాలా సినిమాల్లో న‌టించాడు కానీ.. ఒక్క‌టీ ఆడ‌లేదు. గ‌త కొన్నేళ్ల నుంచి సాయిరాం పేరే ఇండ‌స్ట్రీలో వినిపించ‌ట్లేదు. దాదాపుగా అత‌డి కెరీర్ ముగిసిన‌ట్లే క‌నిపించింది.

ఐతే సోమ‌వారం సాయిరాం శంక‌ర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అత‌డికి శుభాకాంక్ష‌లు చెబుతూ రెండు సినిమాల విశేషాల‌ను పంచుకున్నారు. అందులో ఒక‌టి.. రీసౌండ్. ఇది మామూలు సినిమాలాగే క‌నిపిస్తోంది.

ఐతే సాయిరాం న‌టించిన‌ ఇంకో సినిమా మాత్రం ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లో సాయిరాం శంక‌ర్ ఒక యోగి అవ‌తారంలో క‌నిపిస్తున్నాడు. ఈ పోస్ట‌ర్ గ‌మ‌నిస్తే ఇదొక హిస్టారిక‌ల్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కిన భారీ చిత్రంలా క‌నిపిస్తోంది. మ‌ల‌యాళంలో మంచి పేరున్న వినోద్ విజ‌యన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌డం విశేషం. అత‌ను నిర్మాత‌ల్లో ఒక‌డు కూడా.

రాజీవ్ ర‌వి లాంటి ప్ర‌ముఖ కెమెరామ‌న్ ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌గా.. ఓ మై ఫ్రెండ్ సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన ప్ర‌ముఖ మ‌ల‌యాళ సంగీత ద‌ర్శ‌కుడు రాహుల్ రాజ్ సంగీతం అందించాడు. మ‌రో పేరున్న మ్యూజిక్ కంపోజ‌ర్ గోపీ సుంద‌ర్ నేప‌థ్య సంగీతం స‌మ‌కూర్చాడు. మొత్తంగా చూస్తే ఇది పెద్ద స్థాయి సినిమాలాగే క‌నిపిస్తోంది. ఇలాంటి సినిమాలో సాయిరాం లీడ్ రోల్ చేయ‌డం, చ‌డీచ‌ప్పుడు లేకుండా సినిమా పూర్తయిపోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే.

This post was last modified on September 14, 2021 5:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

27 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

1 hour ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago