టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అండతో ఇండస్ట్రీలోకి హీరోగా అరంగేట్రం చేశాడు అతడి తమ్ముడు సాయిరాం శంకర్. తన అన్న దర్శకత్వంలోనే 143 అనే సినిమాతో అతను ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తర్వాత నటించిన కొన్ని సినిమాలు కూడా నిరాశనే మిగిల్చాయి. ఐతే పూరి కథతో చేసిన బంపర్ ఆఫర్ మాత్రం మంచి ఫలితాన్నందించింది. కానీ ఆ విజయాన్ని అతను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. తర్వాత చాలా సినిమాల్లో నటించాడు కానీ.. ఒక్కటీ ఆడలేదు. గత కొన్నేళ్ల నుంచి సాయిరాం పేరే ఇండస్ట్రీలో వినిపించట్లేదు. దాదాపుగా అతడి కెరీర్ ముగిసినట్లే కనిపించింది.
ఐతే సోమవారం సాయిరాం శంకర్ పుట్టిన రోజు సందర్భంగా అతడికి శుభాకాంక్షలు చెబుతూ రెండు సినిమాల విశేషాలను పంచుకున్నారు. అందులో ఒకటి.. రీసౌండ్. ఇది మామూలు సినిమాలాగే కనిపిస్తోంది.
ఐతే సాయిరాం నటించిన ఇంకో సినిమా మాత్రం ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లో సాయిరాం శంకర్ ఒక యోగి అవతారంలో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ గమనిస్తే ఇదొక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన భారీ చిత్రంలా కనిపిస్తోంది. మలయాళంలో మంచి పేరున్న వినోద్ విజయన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడం విశేషం. అతను నిర్మాతల్లో ఒకడు కూడా.
రాజీవ్ రవి లాంటి ప్రముఖ కెమెరామన్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించగా.. ఓ మై ఫ్రెండ్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు రాహుల్ రాజ్ సంగీతం అందించాడు. మరో పేరున్న మ్యూజిక్ కంపోజర్ గోపీ సుందర్ నేపథ్య సంగీతం సమకూర్చాడు. మొత్తంగా చూస్తే ఇది పెద్ద స్థాయి సినిమాలాగే కనిపిస్తోంది. ఇలాంటి సినిమాలో సాయిరాం లీడ్ రోల్ చేయడం, చడీచప్పుడు లేకుండా సినిమా పూర్తయిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
This post was last modified on September 14, 2021 5:26 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…