Movie News

పూరి త‌మ్ముడి మెగా మూవీ


టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ అండ‌తో ఇండ‌స్ట్రీలోకి హీరోగా అరంగేట్రం చేశాడు అత‌డి త‌మ్ముడు సాయిరాం శంక‌ర్. త‌న అన్న ద‌ర్శ‌క‌త్వంలోనే 143 అనే సినిమాతో అత‌ను ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. త‌ర్వాత న‌టించిన కొన్ని సినిమాలు కూడా నిరాశ‌నే మిగిల్చాయి. ఐతే పూరి క‌థ‌తో చేసిన‌ బంప‌ర్ ఆఫ‌ర్ మాత్రం మంచి ఫ‌లితాన్నందించింది. కానీ ఆ విజ‌యాన్ని అత‌ను స‌రిగా ఉప‌యోగించుకోలేక‌పోయాడు. త‌ర్వాత చాలా సినిమాల్లో న‌టించాడు కానీ.. ఒక్క‌టీ ఆడ‌లేదు. గ‌త కొన్నేళ్ల నుంచి సాయిరాం పేరే ఇండ‌స్ట్రీలో వినిపించ‌ట్లేదు. దాదాపుగా అత‌డి కెరీర్ ముగిసిన‌ట్లే క‌నిపించింది.

ఐతే సోమ‌వారం సాయిరాం శంక‌ర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అత‌డికి శుభాకాంక్ష‌లు చెబుతూ రెండు సినిమాల విశేషాల‌ను పంచుకున్నారు. అందులో ఒక‌టి.. రీసౌండ్. ఇది మామూలు సినిమాలాగే క‌నిపిస్తోంది.

ఐతే సాయిరాం న‌టించిన‌ ఇంకో సినిమా మాత్రం ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లో సాయిరాం శంక‌ర్ ఒక యోగి అవ‌తారంలో క‌నిపిస్తున్నాడు. ఈ పోస్ట‌ర్ గ‌మ‌నిస్తే ఇదొక హిస్టారిక‌ల్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కిన భారీ చిత్రంలా క‌నిపిస్తోంది. మ‌ల‌యాళంలో మంచి పేరున్న వినోద్ విజ‌యన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌డం విశేషం. అత‌ను నిర్మాత‌ల్లో ఒక‌డు కూడా.

రాజీవ్ ర‌వి లాంటి ప్ర‌ముఖ కెమెరామ‌న్ ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌గా.. ఓ మై ఫ్రెండ్ సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన ప్ర‌ముఖ మ‌ల‌యాళ సంగీత ద‌ర్శ‌కుడు రాహుల్ రాజ్ సంగీతం అందించాడు. మ‌రో పేరున్న మ్యూజిక్ కంపోజ‌ర్ గోపీ సుంద‌ర్ నేప‌థ్య సంగీతం స‌మ‌కూర్చాడు. మొత్తంగా చూస్తే ఇది పెద్ద స్థాయి సినిమాలాగే క‌నిపిస్తోంది. ఇలాంటి సినిమాలో సాయిరాం లీడ్ రోల్ చేయ‌డం, చ‌డీచ‌ప్పుడు లేకుండా సినిమా పూర్తయిపోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే.

This post was last modified on September 14, 2021 5:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

22 minutes ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

4 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

5 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

6 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

6 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

8 hours ago