వరుసగా రెండు ఒలింపిక్స్లో పతకాలు సాధించి భారత క్రీడా చరిత్రలోనే అత్యంత గొప్ప అథ్లెట్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు. 2016 రియో ఒలింపిక్స్లో రజతంతోనే ఆమె లెజండరీ స్టేటస్ తెచ్చుకుంది. ఆమె ఆ పతకం సాధించినపుడు దేశం మొత్తం ఉద్వేగంతో ఊగిపోయింది. రియో ఒలింపిక్స్ తర్వాత సింధుకు దేశంలో దక్కిన ఆదరణ చూసి.. ఆమె జీవిత కథను వెండితెరకు ఎక్కించాలని అనుకున్నాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్.
సొంత నిర్మాణ సంస్థలో ఈ సినిమా కోసం సన్నాహాలు మొదలుపెట్టాడు. దాదాపు రెండేళ్ల పాటు స్క్రిప్ట్ వర్క్ జరిగింది. సింధుతో కలిసి అతడి టీం సుదీర్ఘ కాలం పని చేసింది. ఇక సినిమా మొదలుపెట్టడమే తరువాయి అన్నారు. సింధు పాత్ర చేసే నటి కోసం వేట కూడా సాగింది. కానీ ఏమైందో ఏమో ఎంతకీ ఆ సినిమా పట్టాలెక్కలేదు.
కరోనా మొదలయ్యాక సింధు సినిమా పూర్తిగా పక్కకు వెళ్లిపోయింది. సోనూ సినిమాల కంటే సామాజిక కార్యక్రమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. సింధు సినిమా గురించి అతను స్పందించడమే మానేశాడు. ఐతే ఇప్పుడు సింధు సినిమా చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్టార్ షట్లర్ పాత్ర చేయడమే కాదు.. ఈ సినిమాను నిర్మించడానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి తన పాత్రను దీపిక చేస్తే బాగుంటుందని సింధు గతంలో స్వయంగా పేర్కొంది.
ఈ మధ్యే టోక్యోలో కాంస్యంతో మరో పతకాన్ని ఖాతాలో వేసుకుని ఇంకా స్థాయిని పెంచుకున్న సింధును తాజాగా దీపికా, ఆమె భర్త రణ్వీర్ సింగ్ డిన్నర్కు పిలిచారు. ఈ సమయంలోనే సింధు సినిమాపై ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. సోనూతో డీల్ క్యాన్సిల్ చేసి తన సినిమాను దీపికా, రణ్వీర్ల చేతికి సింధు అప్పగించనున్నట్లు బాలీవుడ్లో వార్తలొస్తున్నాయి. దీపికా లెజెండరీ షటర్ల ప్రకాశ్ పదుకొనే కూతురు కావడం ఈ సినిమా చేయడానికి అదనపు అర్హత కావచ్చు. మరి ఛాన్సులు తగ్గి కెరీర్ చరమాంకానికి చేరిన దీపికకు ఈ సినిమా ఏమేర ప్లస్ అవుతుందో చూడాలి.
This post was last modified on September 14, 2021 3:05 pm
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…