సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్ లు చాలా కామన్. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇదిలా ఉండగా.. ప్రముఖ నటి నర్గీస్ ఫక్రీ గతంలో నటుడు ఉదయ్ చోప్రాతో ఐదేళ్లు డేటింగ్ చేసినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇండియాలో తను కలిసిన అద్భుతమైన వ్యక్తి ఉదయ్ చోప్రా అని.. ఎంతో మంచివాడని తెలిపింది. తమ రిలేషన్ గురించి ఎప్పుడూ బయట మాట్లాడకపోవడానికి గల కారణాలను వివరించింది.
సోషల్ మీడియా, ఇంటర్నెట్ లో వచ్చే ఫేక్ న్యూస్ వలన ఇబ్బంది పడాల్సి వస్తుందని.. కాబట్టి తమ బంధం గురించి బయట ప్రపంచానికి తెలియకపోవడమే మంచిదని చాలా మంది చెప్పారని.. అందుకే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలిపింది. కానీ ఈ విషయంలో రిగ్రెట్ అవుతుంటానని.. తనొక అద్భుతమైన వ్యక్తితో ఉన్నానని.. అందరికీ వినిపించే గట్టిగా అరవాలనిపించేదని చెప్పుకొచ్చింది. రిలేషన్షిప్లో ఉన్నంతకాలం కూడా వీరిద్దరూ స్నేహితులు అని మాత్రమే చెప్పుకునేవారు.
గతంలో చాలా సార్లు ఉదయ్ చోప్రా ఈ విషయంపై ట్విట్టర్ లో పోస్ట్ లు పెట్టారు. నర్గీస్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని అన్నారు. అయితే మీడియాలో మాత్రం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. 2016లో వీరిద్దరికీ బ్రేకప్ అయింది. ఆ సమయంలో నర్గీస్ సినిమా ప్రమోషన్స్ ఎగ్గొట్టి న్యూయార్క్ కు వెళ్లిపోయింది. ‘రాక్ స్టార్’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత ‘మద్రాస్ కేఫ్’, ‘హౌస్ ఫుల్ 3’ లాంటి సినిమాల్లో నటించింది.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…