బేసిగ్గా ఏ దర్శకుడూ రీమేక్ సినిమా చేయడానికి అంతగా ఇష్టపడడు. అందులోనూ కొంచెం కొత్తగా ఏదైనా చేయాలని చూసే దర్శకులు రీమేక్ల జోలికి వెళ్లరు. కెరీర్ అంత ఊపులో లేనపుడు, అవకాశాలు కొంచెం కష్టం అయినపుడు మాత్రమే రీమేక్ ఆఫర్లు వస్తే ఓకే చేస్తుంటారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు మేర్లపాక గాంధీ.. ఒక రీమేక్ మూవీని డైరెక్ట్ చేస్తాడని ఎవరూ అనుకోలేదు. కానీ మూడో సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ డిజాస్టర్ కావడం.. ఆ తర్వాత గాంధీ అనుకున్న హీరోలెవరితోనూ సినిమా సెట్ కాకపోవడంతో అతను రీమేక్ బాట పట్టాడు.
బాలీవుడ్లో సూపర్ హిట్టయిన ‘అంధాదున్’ను ‘మ్యాస్ట్రో’ పేరుతో నితిన్ హీరోగా రీమేక్ చేశాడు. ఈ ప్రపోజల్ పెట్టింది తనే అని.. ఐతే ఇకపై మాత్రం రీమేక్ సినిమాలు తీయనని అతను ఈ సినిమా ప్రమోషన్లలో స్పష్టం చేశాడు.
గత ఏడాది తాను అరకులో ఉండగా ఒక ఫ్రెండ్ చెప్పడంతో ‘అంధాదున్’ సినిమా చూశానని.. బాగా నచ్చి రీమేక్ అంటూ చేస్తే ఇలాంటి సినిమానే చేయాలి అనిపించి నితిన్ను సంప్రదించానని.. అతను ఓకే చెప్పడంతో తన సొంతబేనర్లోనే ఈ సినిమా చేశానని గాంధీ వెల్లడించాడు. ఐతే రీమేక్ సినిమాను ఉన్నదున్నట్లుగా తీస్తే కాపీ పేస్ట్ అంటారని, మార్పులు చేస్తే చెడగొట్టారని అంటారని.. తాను ‘అంధాదున్’ లైన్ తీసుకుని మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి సినిమా తీశానని గాంధీ అన్నాడు.
ఐతే ‘అంధాదున్’ను రీమేక్ చేయడం సంతోషమే అయినప్పటికీ.. ఇకముందు మాత్రం తాను రీమేక్ సినిమాలు తీయనని గాంధీ స్పష్టం చేశాడు. టబు చేసిన పాత్రకు తమన్నాను తీసుకోవాలన్న ఆలోచన తనదే అని.. ఈ సినిమాలో తన పెర్ఫామెన్స్ చూసి తనే షాకైపోయానని.. ప్రేక్షకుల ఫీలింగ్ కూడా అలాగే ఉంటుందని గాంధీ అన్నాడు. ఈ నెల 17న హాట్ స్టార్లో ‘మ్యాస్ట్రో’ స్ట్రీమ్ కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on September 13, 2021 6:53 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…