బేసిగ్గా ఏ దర్శకుడూ రీమేక్ సినిమా చేయడానికి అంతగా ఇష్టపడడు. అందులోనూ కొంచెం కొత్తగా ఏదైనా చేయాలని చూసే దర్శకులు రీమేక్ల జోలికి వెళ్లరు. కెరీర్ అంత ఊపులో లేనపుడు, అవకాశాలు కొంచెం కష్టం అయినపుడు మాత్రమే రీమేక్ ఆఫర్లు వస్తే ఓకే చేస్తుంటారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు మేర్లపాక గాంధీ.. ఒక రీమేక్ మూవీని డైరెక్ట్ చేస్తాడని ఎవరూ అనుకోలేదు. కానీ మూడో సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ డిజాస్టర్ కావడం.. ఆ తర్వాత గాంధీ అనుకున్న హీరోలెవరితోనూ సినిమా సెట్ కాకపోవడంతో అతను రీమేక్ బాట పట్టాడు.
బాలీవుడ్లో సూపర్ హిట్టయిన ‘అంధాదున్’ను ‘మ్యాస్ట్రో’ పేరుతో నితిన్ హీరోగా రీమేక్ చేశాడు. ఈ ప్రపోజల్ పెట్టింది తనే అని.. ఐతే ఇకపై మాత్రం రీమేక్ సినిమాలు తీయనని అతను ఈ సినిమా ప్రమోషన్లలో స్పష్టం చేశాడు.
గత ఏడాది తాను అరకులో ఉండగా ఒక ఫ్రెండ్ చెప్పడంతో ‘అంధాదున్’ సినిమా చూశానని.. బాగా నచ్చి రీమేక్ అంటూ చేస్తే ఇలాంటి సినిమానే చేయాలి అనిపించి నితిన్ను సంప్రదించానని.. అతను ఓకే చెప్పడంతో తన సొంతబేనర్లోనే ఈ సినిమా చేశానని గాంధీ వెల్లడించాడు. ఐతే రీమేక్ సినిమాను ఉన్నదున్నట్లుగా తీస్తే కాపీ పేస్ట్ అంటారని, మార్పులు చేస్తే చెడగొట్టారని అంటారని.. తాను ‘అంధాదున్’ లైన్ తీసుకుని మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి సినిమా తీశానని గాంధీ అన్నాడు.
ఐతే ‘అంధాదున్’ను రీమేక్ చేయడం సంతోషమే అయినప్పటికీ.. ఇకముందు మాత్రం తాను రీమేక్ సినిమాలు తీయనని గాంధీ స్పష్టం చేశాడు. టబు చేసిన పాత్రకు తమన్నాను తీసుకోవాలన్న ఆలోచన తనదే అని.. ఈ సినిమాలో తన పెర్ఫామెన్స్ చూసి తనే షాకైపోయానని.. ప్రేక్షకుల ఫీలింగ్ కూడా అలాగే ఉంటుందని గాంధీ అన్నాడు. ఈ నెల 17న హాట్ స్టార్లో ‘మ్యాస్ట్రో’ స్ట్రీమ్ కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on September 13, 2021 6:53 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…