ఒకప్పుడు సినిమాల్లో చిన్న బూతు మాట వాడటానికి కూడా జంకేవాళ్లు ఫిలిం మేకర్స్. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారిపోయింది. ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చినా పర్వాలేదనుకుని.. కొన్ని బూతు మాటలు పెట్టేస్తున్నారు. సన్నివేశాలు డిమాండ్ చేస్తున్నాయంటూ బూతులు లాగించేస్తున్నారు. ముఖ్యంగా వెబ్ సిరీస్ల ప్రభావం సినిమాలపై బాగా పడుతోంది.
ఓటీటీల్లో వస్తున్న వెబ్ సిరీస్ల్లో బూతుల గురించైతే చెప్పాల్సిన పని లేదు. సహజత్వం పేరుతో పాత్రలు మరీ దారుణంగా బూతులు వాడేస్తుండటం ఓ వర్గం ప్రేక్షకులకు అసలు రుచించట్లేదు. ఐతే సెన్సార్ ఉండదు కాబట్టి.. ఓటీటీ కంటెంట్ను చాలా వరకు సెలెక్టివ్గా, వ్యక్తిగతంగా చూస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ థియేటర్లలో ఫ్యామిలీస్ వచ్చి చూసే సినిమాల్లో బూతుల విషయంలో కచ్చితంగా నియంత్రణ ఉండాల్సిందే.
ఐతే ‘సీటీమార్’ అనే మాస్ మూవీలో తమన్నా నోటి నుంచి వచ్చిన బూతు మాట అందరికీ పెద్ద షాకే ఇస్తోంది. జ్వాలారెడ్డి అనే తెలంగాణ అమ్మాయి పాత్రను చేసింది తమ్మూ ఇందులో. ఆ పాత్రను ఈ తరానికి తగ్గట్లు కొంచెం అగ్రెసివ్గా చూపించాలనుకున్నాడు దర్శకుడు సంపత్ నంది. ఐతే ఈ క్రమంలో ఒక చోట.. ‘లం..కొడుకు’ అంటూ యధాలాపంగా ఓ బూతు మాట అనేస్తుంది తమన్నా పాత్ర. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ స్వయంగా డబ్బింగ్ చెప్పడం గమనార్హం.
ఆమె నోట అలాంటి బూతు మాట వచ్చేసరికి జనాలు షాకవుతున్నారు థియేటర్లలో. ఈ చిత్రంలో మరో చోట పోసాని పాత్రతోనూ అదే బూతు మాట పలికించాడు సంపత్. అర్జున్ రెడ్డి తరహా సినిమాల్లో ఇలాంటి బూతులు వినిపిస్తే అర్థం చేసుకోవచ్చు కానీ.. ‘సీటీమార్’ లాంటి మాస్, ఫ్యామిలీస్ చూసే సినిమాల్లో ఇలాంటి బూతుల అవసరం ఏముందన్నది ప్రశ్న. అసలు సెన్సార్ వాళ్లు ఇలాంటి వాటికి ఎలా ఆమోద ముద్ర వేశారో ఏంటో?
This post was last modified on September 12, 2021 1:38 pm
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…