ఒకప్పుడు సినిమాల్లో చిన్న బూతు మాట వాడటానికి కూడా జంకేవాళ్లు ఫిలిం మేకర్స్. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారిపోయింది. ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చినా పర్వాలేదనుకుని.. కొన్ని బూతు మాటలు పెట్టేస్తున్నారు. సన్నివేశాలు డిమాండ్ చేస్తున్నాయంటూ బూతులు లాగించేస్తున్నారు. ముఖ్యంగా వెబ్ సిరీస్ల ప్రభావం సినిమాలపై బాగా పడుతోంది.
ఓటీటీల్లో వస్తున్న వెబ్ సిరీస్ల్లో బూతుల గురించైతే చెప్పాల్సిన పని లేదు. సహజత్వం పేరుతో పాత్రలు మరీ దారుణంగా బూతులు వాడేస్తుండటం ఓ వర్గం ప్రేక్షకులకు అసలు రుచించట్లేదు. ఐతే సెన్సార్ ఉండదు కాబట్టి.. ఓటీటీ కంటెంట్ను చాలా వరకు సెలెక్టివ్గా, వ్యక్తిగతంగా చూస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ థియేటర్లలో ఫ్యామిలీస్ వచ్చి చూసే సినిమాల్లో బూతుల విషయంలో కచ్చితంగా నియంత్రణ ఉండాల్సిందే.
ఐతే ‘సీటీమార్’ అనే మాస్ మూవీలో తమన్నా నోటి నుంచి వచ్చిన బూతు మాట అందరికీ పెద్ద షాకే ఇస్తోంది. జ్వాలారెడ్డి అనే తెలంగాణ అమ్మాయి పాత్రను చేసింది తమ్మూ ఇందులో. ఆ పాత్రను ఈ తరానికి తగ్గట్లు కొంచెం అగ్రెసివ్గా చూపించాలనుకున్నాడు దర్శకుడు సంపత్ నంది. ఐతే ఈ క్రమంలో ఒక చోట.. ‘లం..కొడుకు’ అంటూ యధాలాపంగా ఓ బూతు మాట అనేస్తుంది తమన్నా పాత్ర. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ స్వయంగా డబ్బింగ్ చెప్పడం గమనార్హం.
ఆమె నోట అలాంటి బూతు మాట వచ్చేసరికి జనాలు షాకవుతున్నారు థియేటర్లలో. ఈ చిత్రంలో మరో చోట పోసాని పాత్రతోనూ అదే బూతు మాట పలికించాడు సంపత్. అర్జున్ రెడ్డి తరహా సినిమాల్లో ఇలాంటి బూతులు వినిపిస్తే అర్థం చేసుకోవచ్చు కానీ.. ‘సీటీమార్’ లాంటి మాస్, ఫ్యామిలీస్ చూసే సినిమాల్లో ఇలాంటి బూతుల అవసరం ఏముందన్నది ప్రశ్న. అసలు సెన్సార్ వాళ్లు ఇలాంటి వాటికి ఎలా ఆమోద ముద్ర వేశారో ఏంటో?
This post was last modified on September 12, 2021 1:38 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…