‘బాహుబలి’ తర్వాత ఇండియాలో ఆ స్థాయి హైప్ ఉన్న సినిమా అంటే.. ‘ఆర్ఆర్ఆర్’యే. ఈ సినిమా మొదలైనప్పుడు ఉన్న సందేహాలు ఇప్పుడు చెరిగిపోయినట్లే ఉన్నాయి. మరోసారి ‘బాహుబలి’ తరహా భారీ చిత్రం తీసి, ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇవ్వడానికి జక్కన్న రెడీ అయినట్లే ఉన్నాడు. ఐతే కరోనా దెబ్బను తట్టుకుని వీలైనంత త్వరగానే సినిమాను పూర్తి చేసినప్పటికీ మరోసారి రిలీజ్ వాయిదా వేయక తప్పట్లేదు. అక్టోబరు 13న తమ చిత్రం రావట్లేదని ఎట్టకేలకు చిత్ర బృందం క్లారిటీ ఇచ్చేసింది. కానీ కొత్త రిలీజ్ డేట్ మాత్రం ఇప్పుడే చెప్పలేమని పేర్కొంది.
మరి ‘ఆర్ఆర్ఆర్’ ఎప్పుడు రిలీజవుతుందనే చర్చ మొదలైంది. ఆ సినిమా విడుదలను బట్టి వివిధ భాషల్లో చాలా సినిమాల రిలీజ్ డేట్లు ఖరారవుతాయి. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి స్పష్టత కోరుకుంటున్నారు.
కానీ నార్త్ ఇండియాలో చాలా చోట్ల థియేటర్లపై ఆంక్షలు కొనసాగుతుండటం.. అలాగే జనాలు మళ్లీ థియేటర్లకు ఇంకా అలవాటు పడకపోవడంతో ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రాన్ని ఈ కష్ట కాలంలో రిలీజ్ చేయడానికి భయపడుతున్నారు. కాస్తయినా నార్త్ మార్కెట్ పుంజుకుంటే తప్ప ‘ఆర్ఆర్ఆర్’ వచ్చేలా లేదు. ఐతే అక్టోబరు 21న పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ముగిసిపోతాయని చిత్ర బృందం అంటున్న నేపథ్యంలో ఆరేడు నెలలు ఎదురు చూసి 2022 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని అనుకోలేం.
వందల కోట్ల ఖర్చుతో తీసిన సినిమాను అంత కాలం ఆపితే.. పడే వడ్డీల భారం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అలా ఆలస్యమయ్యే కొద్దీ నిర్మాత ఆదాయం కోల్పోతున్నట్లే. అలాగని ఇప్పుడిప్పుడే సినిమాను విడుదల చేసే సాహసమూ చేయకపోవచ్చు. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం వీలును బట్టి 2022 సంక్రాంతి ముంగిటే ఈ చిత్రాన్ని రిలీజ్ చేద్దామనుకుంటున్నారట. సంక్రాంతి సినిమాలతో పోటీ పడకుండా వారం ముందే జనవరి 8న ఈ సినిమాను రిలీజ్ చేసే యోచన ఉంది. కాకపోతే అప్పటికి మార్కెట్ ఆశావహంగా ఉండాలి. కాని పక్షంలో 2022 లేట్ సమ్మర్లో ఈ చిత్రాన్నిఆశించవచ్చు.
This post was last modified on September 11, 2021 5:55 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…