మెగాస్టార్ మేనల్లుడు.. టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ వినాయక చవితి పర్వదినాన హైదరాబాద్లో యాక్సిడెంట్కు గురై ఆసుపత్రి పాలవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సిటీలోని ఐకియా రోడ్డులో అతను బైక్ మీద వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ అతడికి తీవ్ర గాయాలేమీ కాలేదని తేలింది. నిన్న అల్లు అరవింద్, ఈ రోజు చిరంజీవి తేజు ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రమాదమేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. తేజు చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి నిన్న రాత్రే కాక శనివారం కూడా హెల్త్ బులిటెన్ ఇచ్చింది. తేజుకు ప్రమాదమేమీ లేదని స్పష్టత ఇచ్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఐతే ఇప్పుడందరి దృష్టీ అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందనే దాని మీదికి వెళ్లింది. ఇలాంటి ఉదంతాల్ని బ్లో అప్ చేయడానికి చాలామంది కాచుకుని ఉంటారు. తేజు మద్యం తాగాడా.. ఓవర్ స్పీడ్లో వెళ్లాడా.. హెల్మెట్ పెట్టుకోలేదా.. ఇంకేమైనా తప్పులు చేశాడా అని శోధించే పనిలో ఒక వర్గం పడిపోయింది. కానీ వాళ్లకు నిరాశను మిగులుస్తూ ఈ యాక్సిడెంట్లో తేజు అలాంటి తప్పులేమీ చేయలేదని తేలింది. స్వయంగా ఈ విషయంలో పోలీసులే స్పష్టత ఇచ్చారు.
తేజు ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ బయటికి వచ్చింది. అతను రోడ్డు మధ్యలో 60-70 కిలోమీటర్ల స్పీడుతో (అంచనా) వెళ్తూ ముందు ఒక వాహనాన్ని తప్పించడానికి బ్రేక్ వేయగా.. స్కిడ్ అయి కింద పడిపోయాడు. రోడ్డు మీద ఇసుక ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయింది. బైక్ కింద పడగానే జారుతూ ముందుకెళ్లగా.. తేజు దాన్నుంచి కింద పడి ముందుకు జారుతూ వెళ్లాడు. ఈ క్రమంలో చిన్న గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో హెల్మెట్ పెట్టుకుని ఉండటం వల్ల అతడికి ప్రాణాపాయం తప్పింది. తేజు మద్యం ఏమీ తాగలేదని, హెల్మెట్ పెట్టుకున్నాడని, ఓవర్ స్పీడ్లో వెళ్లలేదని పోలీసులు ధ్రువీకరించారు.
This post was last modified on September 11, 2021 12:36 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…