టాలీవుడ్ మరో కీలక మలుపు దగ్గర నిలబడింది. సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత దాదాపు నెలన్నర వ్యవధిలో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటిలో పూర్తిగా ప్రేక్షకులను మెప్పించి వసూళ్ల మోత మోగించిన సినిమా ఒక్కటీ లేదు. కొన్ని చిత్రాలకు మంచి టాక్ వచ్చింది. కానీ వసూళ్లు ఆశించినట్లు రాలేదు. కొన్ని చిత్రాలకు ఓపెనింగ్స్ వచ్చాయి. టాక్ బాగా లేక ఆ సినిమాలు ఎక్కువ రోజులు నిలబడలేదు.
ఈ నేపథ్యంలో వినాయక చవితి కానుకగా శుక్రవారం విడుదలవుతున్న గోపీచంద్ సినిమా ‘సీటీమార్’పై సినీ పరిశ్రమ చాలా ఆశలే పెట్టుకుంది. థియేటర్లకు వచ్చి సినిమాలు చూసేందుకు అంతగా ఉత్సాహం చూపించని మాస్ ప్రేక్షకుల్లో ఈ చిత్రం కదలిక తెస్తుందని టాలీవుడ్ ఆశిస్తోంది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ చిత్రం ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లు చాలా ఆశలే పెట్టుకున్నాయి. సినిమాకు మంచి టాక్ వచ్చి థియేటర్లలో మాస్ జాతర కనిపిస్తుందనే ఆశతో టాలీవుడ్ ఉంది.
ఇంతకుముందు గోపీచంద్తో తీసిన ‘గౌతమ్ నంద’తో అంచనాలను అందుకోలేకపోయిన సంపత్ నంది.. ఈసారి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తీసినట్లు చెబుతున్నాడు. టీజర్, ట్రైలర్లలో మాస్ అంశాలకు లోటు లేనట్లే కనిపించింది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ను బ్యాలెన్స్ చేస్తూ మాస్ అంశాలను ఎలా పండించారన్నది కీలకం. తమన్నా గ్లామర్ ఈ సినిమాకు ప్లస్ లాగే కనిపిస్తోంది. మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతం కూడా సినిమాను ఎలివేట్ చేస్తాయని భావిస్తున్నారు.
గోపీచంద్ సరైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. అతడికి ఈ సినిమా విజయవంతం కావడం చాలా అవసరం. శుక్రవారం తమిళ చిత్రం ‘తలైవి’ సైతం తెలుగులో రిలీజవుతోంది. ఈ సినిమా ప్రిమియర్లకు ఇప్పటికే మంచి టాక్ వచ్చింది. జయలలిత బయోపిక్ మీద మన వాళ్లు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారు.. ఆ చిత్రాన్ని ఏమేర ఆదరిస్తారన్నది చూడాలి. మరి చవితి వీకెండ్లో టాలీవుడ్ బాక్సాఫీస్ ఏమేర కళకళలాడుతుందో చూద్దాం.
This post was last modified on September 10, 2021 1:40 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…