టాలీవుడ్ మరో కీలక మలుపు దగ్గర నిలబడింది. సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత దాదాపు నెలన్నర వ్యవధిలో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటిలో పూర్తిగా ప్రేక్షకులను మెప్పించి వసూళ్ల మోత మోగించిన సినిమా ఒక్కటీ లేదు. కొన్ని చిత్రాలకు మంచి టాక్ వచ్చింది. కానీ వసూళ్లు ఆశించినట్లు రాలేదు. కొన్ని చిత్రాలకు ఓపెనింగ్స్ వచ్చాయి. టాక్ బాగా లేక ఆ సినిమాలు ఎక్కువ రోజులు నిలబడలేదు.
ఈ నేపథ్యంలో వినాయక చవితి కానుకగా శుక్రవారం విడుదలవుతున్న గోపీచంద్ సినిమా ‘సీటీమార్’పై సినీ పరిశ్రమ చాలా ఆశలే పెట్టుకుంది. థియేటర్లకు వచ్చి సినిమాలు చూసేందుకు అంతగా ఉత్సాహం చూపించని మాస్ ప్రేక్షకుల్లో ఈ చిత్రం కదలిక తెస్తుందని టాలీవుడ్ ఆశిస్తోంది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ చిత్రం ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లు చాలా ఆశలే పెట్టుకున్నాయి. సినిమాకు మంచి టాక్ వచ్చి థియేటర్లలో మాస్ జాతర కనిపిస్తుందనే ఆశతో టాలీవుడ్ ఉంది.
ఇంతకుముందు గోపీచంద్తో తీసిన ‘గౌతమ్ నంద’తో అంచనాలను అందుకోలేకపోయిన సంపత్ నంది.. ఈసారి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తీసినట్లు చెబుతున్నాడు. టీజర్, ట్రైలర్లలో మాస్ అంశాలకు లోటు లేనట్లే కనిపించింది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ను బ్యాలెన్స్ చేస్తూ మాస్ అంశాలను ఎలా పండించారన్నది కీలకం. తమన్నా గ్లామర్ ఈ సినిమాకు ప్లస్ లాగే కనిపిస్తోంది. మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతం కూడా సినిమాను ఎలివేట్ చేస్తాయని భావిస్తున్నారు.
గోపీచంద్ సరైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. అతడికి ఈ సినిమా విజయవంతం కావడం చాలా అవసరం. శుక్రవారం తమిళ చిత్రం ‘తలైవి’ సైతం తెలుగులో రిలీజవుతోంది. ఈ సినిమా ప్రిమియర్లకు ఇప్పటికే మంచి టాక్ వచ్చింది. జయలలిత బయోపిక్ మీద మన వాళ్లు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారు.. ఆ చిత్రాన్ని ఏమేర ఆదరిస్తారన్నది చూడాలి. మరి చవితి వీకెండ్లో టాలీవుడ్ బాక్సాఫీస్ ఏమేర కళకళలాడుతుందో చూద్దాం.
This post was last modified on September 10, 2021 1:40 pm
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…
తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, నటుడు విజయ్.. నేతృత్వంలోని సర్కారు.. తొలి బడ్జెట్ను(2026-27)ను బుధవారం అసెంబ్లీలో…
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…
మంత్రులు మౌనంగా ఉంటే సహించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ముఖ్యంగా టీడీపీ మంత్రులకు ఆయన ఈ విషయంలో…