సినిమా ఇండస్ట్రీ ప్రేమ వ్యవహారాలు చాలా కామన్. ఎవరైనా హీరో, హీరోయిన్లు కాస్త క్లోజ్ గా ఉంటే చాలు.. వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం సాగుతుంది. ఇప్పుడే కాదు.. ఎన్నో ఏళ్లుగా ఇలానే జరుగుతోంది. 1970లలో హీరోయిన్ రేఖ గురించి ఇలాంటి వార్తలే వచ్చేవి. తన గ్లామర్, నటనతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయిన రేఖ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. కానీ మీడియాలో మాత్రం ఎక్కువగా ఆమె లవ్ లైఫ్ కి సంబంధించిన వార్తలే వచ్చేవి.
అందులో ఒకటి రేఖ-వినోద్ మెహ్రాల ప్రేమ వ్యవహారం. వీరిద్దరూ చాలా కాలం ప్రేమించుకున్నారు. కానీ ఈ విషయం వినోద్ ఫ్యామిలీకు ఇష్టం లేదు. ముఖ్యంగా వినోద్ తల్లి రేఖను బాగా వ్యతిరేకించేవారు. అది ఏ రేంజ్ లో అంటే.. ఒకరోజు రేఖ-వినోద్ మెహ్రాలు ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా కోల్కతాలో పెళ్లి చేసేసుకున్నారు. ఆ తరువాత వినోద్ మెహ్రా.. రేఖను తీసుకొని తన ఇంటికి వచ్చాడు. తల్లికి తాను పెళ్లి చేసుకున్న విషయం చెప్పాడు. అది విన్న వినోద్ తల్లి.. రేఖ మీద కోపంతో చెప్పుతో కొట్టడానికి వెళ్లారు. వినోద్ ఎంతగా ప్రయత్నించినా.. తన తల్లిని కంట్రోల్ చేయలేకపోయారు. రేఖను ఆమె తీవ్రంగా అవమానించారు.
ఆ అవమానాలు తట్టుకోలేక రేఖ ఏడ్చుకుంటూ వినోద్ ఇంటి నుండి వెళ్లిపోయారు. ఆ తరువాత కొన్నాళ్లపాటు వినోద్ తో టచ్ లో ఉన్నారు రేఖ. అనంతరం ఇద్దరూ విడిపోయారు. దీని గురించి రేఖ ఓ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. వినోద్ మెహ్రా తల్లి దృష్టిలో తను కేవలం ఒక నటిని మాత్రమే అని.. గతంలో ఎన్నో చేదు అనుభవాలు కలిసి వినోద్ తల్లి తన కోడలిగా అంగీకరించడానికి ఇష్టపడలేదని చెప్పుకొచ్చారు. ఆ తరువాత రేఖ ఢిల్లీకి చెందిన ముఖేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్ని నెలలకే ముఖేష్ సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆ సమయంలో కూడా అందరూ రేఖనే అనుమానించారు.
This post was last modified on September 9, 2021 12:15 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…