సినిమా ఇండస్ట్రీ ప్రేమ వ్యవహారాలు చాలా కామన్. ఎవరైనా హీరో, హీరోయిన్లు కాస్త క్లోజ్ గా ఉంటే చాలు.. వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం సాగుతుంది. ఇప్పుడే కాదు.. ఎన్నో ఏళ్లుగా ఇలానే జరుగుతోంది. 1970లలో హీరోయిన్ రేఖ గురించి ఇలాంటి వార్తలే వచ్చేవి. తన గ్లామర్, నటనతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయిన రేఖ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. కానీ మీడియాలో మాత్రం ఎక్కువగా ఆమె లవ్ లైఫ్ కి సంబంధించిన వార్తలే వచ్చేవి.
అందులో ఒకటి రేఖ-వినోద్ మెహ్రాల ప్రేమ వ్యవహారం. వీరిద్దరూ చాలా కాలం ప్రేమించుకున్నారు. కానీ ఈ విషయం వినోద్ ఫ్యామిలీకు ఇష్టం లేదు. ముఖ్యంగా వినోద్ తల్లి రేఖను బాగా వ్యతిరేకించేవారు. అది ఏ రేంజ్ లో అంటే.. ఒకరోజు రేఖ-వినోద్ మెహ్రాలు ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా కోల్కతాలో పెళ్లి చేసేసుకున్నారు. ఆ తరువాత వినోద్ మెహ్రా.. రేఖను తీసుకొని తన ఇంటికి వచ్చాడు. తల్లికి తాను పెళ్లి చేసుకున్న విషయం చెప్పాడు. అది విన్న వినోద్ తల్లి.. రేఖ మీద కోపంతో చెప్పుతో కొట్టడానికి వెళ్లారు. వినోద్ ఎంతగా ప్రయత్నించినా.. తన తల్లిని కంట్రోల్ చేయలేకపోయారు. రేఖను ఆమె తీవ్రంగా అవమానించారు.
ఆ అవమానాలు తట్టుకోలేక రేఖ ఏడ్చుకుంటూ వినోద్ ఇంటి నుండి వెళ్లిపోయారు. ఆ తరువాత కొన్నాళ్లపాటు వినోద్ తో టచ్ లో ఉన్నారు రేఖ. అనంతరం ఇద్దరూ విడిపోయారు. దీని గురించి రేఖ ఓ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. వినోద్ మెహ్రా తల్లి దృష్టిలో తను కేవలం ఒక నటిని మాత్రమే అని.. గతంలో ఎన్నో చేదు అనుభవాలు కలిసి వినోద్ తల్లి తన కోడలిగా అంగీకరించడానికి ఇష్టపడలేదని చెప్పుకొచ్చారు. ఆ తరువాత రేఖ ఢిల్లీకి చెందిన ముఖేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్ని నెలలకే ముఖేష్ సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆ సమయంలో కూడా అందరూ రేఖనే అనుమానించారు.
This post was last modified on September 9, 2021 12:15 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాటజీకి తెరదీశారు. త్వరలోనే జిల్లాల విభజన చేయనున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం…
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…