కరోనా మహమ్మారి దెబ్బకు థియేటర్లు ఎంతగా దెబ్బ తిన్నాయో తెలిసిందే. అందులోనూ సింగిల్ స్క్రీన్ల పరిస్థితి దారుణాతి దారుణం. మల్టీప్లెక్సులను మెయింటైన్ చేసే సంస్థల స్థాయి వేరు. అవి ఎలాగోలా నిలబడతాయి. కానీ సింగిల్ స్క్రీన్ల పరిస్థితి అలా కాదు. మెయింటైనెన్స్ అంత తేలిక కాదు. వాటి కెపాసిటీ ఎక్కువ. మల్టీప్లెక్సుల్లో మాదిరి వంద, రెండొందల సీట్లతో చిన్న స్క్రీన్లు పెట్టి చిన్న సినిమాలతో లాగించేసే పరిస్థితి ఇక్కడ ఉండదు. చిన్న స్థాయి, క్లాస్ సినిమాలతో సింగిల్ స్క్రీన్ల బండి నడవదు. అవి కళకళలాడాలంటే మాస్ మసాలా సినిమాలు, పెద్ద హీరోలు నటించినవి రావాలి.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత గత ఐదు వారాల్లో చాలా సినిమాలే రిలీజయ్యాయి. వాటిలో ఏదీ కూడా సింగిల్ స్క్రీన్లలో కళ తేలేకపోయింది. ఎస్ఆర్ కళ్యాణమండపం, పాగల్ లాంటి చిత్రాలకు తొలి రోజు కొంచెం సందడి కనిపించింది. తర్వాత థియేటర్లు వెలవెలబోయాయి.
ఈ నేపథ్యంలో సింగిల్ స్క్రీన్లకు ప్రాణం పోసే సినిమా కోసం సాగుతున్న నిరీక్షణకు ‘సీటీమార్’ తెరదించేలా ఉంది. యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన ఈ చిత్రంపై మాస్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తున్న ఇలాంటి సినిమా కోసమే మాస్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. సింగిల్ స్క్రీన్లకు సందడి తెచ్చేది ఇలాంటి సినిమాలే. లేక లేక ఇలాంటి సినిమా వస్తుండటంతో ఎగ్జిబిటర్లు చాలా ఆశలతో ఉన్నారు.
గోపీచంద్.. తమన్నా.. సంపత్ నంది.. మణిశర్మ.. ఇలా మాస్ కోరుకునే కాస్ట్ అండ్ క్రూతో తెరకెక్కిన చిత్రం ‘సీటీమార్’. దీని టీజర్, ట్రైలర్లు చూస్తే కమర్షియల్ అంశాలకు ఢోకా లేదని అర్థమైంది. వినాయక చవితి కానుకగా రిలీజవుతున్న ఈ చిత్రానికి బుకింగ్స్ కూడా పర్వాలేదు. కచ్చితంగా ఈ వీకెండ్లో సింగిల్ స్క్రీన్ల దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తుందన్న అంచనాతో ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.
This post was last modified on September 8, 2021 1:49 pm
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…