కరోనా మహమ్మారి దెబ్బకు థియేటర్లు ఎంతగా దెబ్బ తిన్నాయో తెలిసిందే. అందులోనూ సింగిల్ స్క్రీన్ల పరిస్థితి దారుణాతి దారుణం. మల్టీప్లెక్సులను మెయింటైన్ చేసే సంస్థల స్థాయి వేరు. అవి ఎలాగోలా నిలబడతాయి. కానీ సింగిల్ స్క్రీన్ల పరిస్థితి అలా కాదు. మెయింటైనెన్స్ అంత తేలిక కాదు. వాటి కెపాసిటీ ఎక్కువ. మల్టీప్లెక్సుల్లో మాదిరి వంద, రెండొందల సీట్లతో చిన్న స్క్రీన్లు పెట్టి చిన్న సినిమాలతో లాగించేసే పరిస్థితి ఇక్కడ ఉండదు. చిన్న స్థాయి, క్లాస్ సినిమాలతో సింగిల్ స్క్రీన్ల బండి నడవదు. అవి కళకళలాడాలంటే మాస్ మసాలా సినిమాలు, పెద్ద హీరోలు నటించినవి రావాలి.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత గత ఐదు వారాల్లో చాలా సినిమాలే రిలీజయ్యాయి. వాటిలో ఏదీ కూడా సింగిల్ స్క్రీన్లలో కళ తేలేకపోయింది. ఎస్ఆర్ కళ్యాణమండపం, పాగల్ లాంటి చిత్రాలకు తొలి రోజు కొంచెం సందడి కనిపించింది. తర్వాత థియేటర్లు వెలవెలబోయాయి.
ఈ నేపథ్యంలో సింగిల్ స్క్రీన్లకు ప్రాణం పోసే సినిమా కోసం సాగుతున్న నిరీక్షణకు ‘సీటీమార్’ తెరదించేలా ఉంది. యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన ఈ చిత్రంపై మాస్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తున్న ఇలాంటి సినిమా కోసమే మాస్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. సింగిల్ స్క్రీన్లకు సందడి తెచ్చేది ఇలాంటి సినిమాలే. లేక లేక ఇలాంటి సినిమా వస్తుండటంతో ఎగ్జిబిటర్లు చాలా ఆశలతో ఉన్నారు.
గోపీచంద్.. తమన్నా.. సంపత్ నంది.. మణిశర్మ.. ఇలా మాస్ కోరుకునే కాస్ట్ అండ్ క్రూతో తెరకెక్కిన చిత్రం ‘సీటీమార్’. దీని టీజర్, ట్రైలర్లు చూస్తే కమర్షియల్ అంశాలకు ఢోకా లేదని అర్థమైంది. వినాయక చవితి కానుకగా రిలీజవుతున్న ఈ చిత్రానికి బుకింగ్స్ కూడా పర్వాలేదు. కచ్చితంగా ఈ వీకెండ్లో సింగిల్ స్క్రీన్ల దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తుందన్న అంచనాతో ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.
This post was last modified on September 8, 2021 1:49 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…