బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి అరుణ భాటియా బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమెను సెప్టెంబర్ 3న ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు.
ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారని అక్షయ్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘ మా అమ్మ అరుణ భాటియా ఈ రోజు ఉదయం ఈ లోకాన్ని విడిచిపెట్టారు. వేరే లోకంలో ఉన్న నా తండ్రిని ఆమె కలవనున్నారు. ఆమె నా ప్రాణం. ఆమె మరణం వల్ల నాకు కలిగిన బాధను మాటల్లో వివరించలేను.’
‘ఈ బాధను భరించలేను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా కుటుంబం కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు కృతగ్నతలు. ఓం శాంతి’ అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. కాగా.. అరుణ భాటియా మృతి పట్ల పలువురు సెలబ్రెటీలు, నెటీజన్లు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియా వేదికగా మెసేజ్ లు చేస్తున్నారు.
This post was last modified on September 8, 2021 11:31 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…