బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి అరుణ భాటియా బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమెను సెప్టెంబర్ 3న ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు.
ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారని అక్షయ్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘ మా అమ్మ అరుణ భాటియా ఈ రోజు ఉదయం ఈ లోకాన్ని విడిచిపెట్టారు. వేరే లోకంలో ఉన్న నా తండ్రిని ఆమె కలవనున్నారు. ఆమె నా ప్రాణం. ఆమె మరణం వల్ల నాకు కలిగిన బాధను మాటల్లో వివరించలేను.’
‘ఈ బాధను భరించలేను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా కుటుంబం కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు కృతగ్నతలు. ఓం శాంతి’ అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. కాగా.. అరుణ భాటియా మృతి పట్ల పలువురు సెలబ్రెటీలు, నెటీజన్లు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియా వేదికగా మెసేజ్ లు చేస్తున్నారు.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…