‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ బడ్జెట్ సినిమా తరువాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో చేయబోతున్నారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా నిర్వహించనున్నారు. రీసెంట్ గా ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూతో ఓ ఫోటోషూట్ ను నిర్వహించారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాకి పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలనుకుంటున్న శంకర్ ఓ పేరుని అనుకున్నారట.
అదేంటంటే.. ‘విశ్వంభర’. దీనికి అర్ధం భూమి. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. రామ్ చరణ్ కి కూడా టైటిల్ నచ్చిందట. దీంతో పాటు మరో రెండు, మూడు టైటిల్ అనుకుంటున్నారు. కానీ దాదాపుగా ఈ టైటిల్ నే ఫిక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.
దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతోన్న 50వ సినిమా కావడంతో దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమా కథ విషయంలో శంకర్ కి యంగ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ సహాయం చేస్తున్నట్లు సమాచారం. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
This post was last modified on September 7, 2021 10:07 pm
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…