‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ బడ్జెట్ సినిమా తరువాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో చేయబోతున్నారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా నిర్వహించనున్నారు. రీసెంట్ గా ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూతో ఓ ఫోటోషూట్ ను నిర్వహించారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాకి పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలనుకుంటున్న శంకర్ ఓ పేరుని అనుకున్నారట.
అదేంటంటే.. ‘విశ్వంభర’. దీనికి అర్ధం భూమి. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. రామ్ చరణ్ కి కూడా టైటిల్ నచ్చిందట. దీంతో పాటు మరో రెండు, మూడు టైటిల్ అనుకుంటున్నారు. కానీ దాదాపుగా ఈ టైటిల్ నే ఫిక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.
దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతోన్న 50వ సినిమా కావడంతో దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమా కథ విషయంలో శంకర్ కి యంగ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ సహాయం చేస్తున్నట్లు సమాచారం. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
This post was last modified on September 7, 2021 10:07 pm
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…