‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ బడ్జెట్ సినిమా తరువాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో చేయబోతున్నారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా నిర్వహించనున్నారు. రీసెంట్ గా ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూతో ఓ ఫోటోషూట్ ను నిర్వహించారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాకి పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలనుకుంటున్న శంకర్ ఓ పేరుని అనుకున్నారట.
అదేంటంటే.. ‘విశ్వంభర’. దీనికి అర్ధం భూమి. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. రామ్ చరణ్ కి కూడా టైటిల్ నచ్చిందట. దీంతో పాటు మరో రెండు, మూడు టైటిల్ అనుకుంటున్నారు. కానీ దాదాపుగా ఈ టైటిల్ నే ఫిక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.
దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతోన్న 50వ సినిమా కావడంతో దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమా కథ విషయంలో శంకర్ కి యంగ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ సహాయం చేస్తున్నట్లు సమాచారం. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…