ఎన్నడూ లేనంతగా ‘మా’ ఎలెక్షన్స్ లో అధ్యక్ష పదవి కోసం రగడ మొదలైంది. దానికి తోడు బండ్ల గణేష్ రాజకీయాలు ‘మా’లో మరిన్ని గొడవలకు దారి తీస్తుంది. ‘మా’లో విషయాలను బయటకు పొక్కనీయకుండా చూడమని చిరంజీవి లాంటి పెద్దలు ఎంతగా చెబుతున్నా ఎవరూ వినడం లేదు. చిన్న చిన్న విషయాలను కూడా రాజకీయం చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి చిరంజీవి మద్దతు ఇస్తున్నారనే విషయం అందరికీ ఇప్పుడు ఈ విషయంలో చిరు ఎక్కడా ఏం మాట్లాడడం లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి.
ఇండస్ట్రీలో చిరుకి మంచి ఇమేజ్ ఉంది. దాసరి తరువాత స్థానంలో సినీ జనాలు చిరునే భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవి ఏదో ఒక్క వర్గానికి మాత్రమే మద్దతు ఇవ్వడం సమంజసంగా ఉండదు. పైగా ప్రకాష్ రాజ్ కి ఓటు వేయమని ఆయన నేరుగా కూడా చెప్పలేరు. ఒకవేళ ప్రకాష్ రాజ్ గనుక ఓడిపోతే చిరు సపోర్ట్ ఇచ్చినా.. ఓడిపోయారనే మాటలు వినిపిస్తాయి. వీటన్నింటికీ దూరంగా ఉండడమే బెటర్ అని చిరు భావిస్తున్నారు.
అందుకే ‘మా’ ఎన్నికల్లో తటస్థంగా ఉండడమే సమంజసమని ఆయన నిర్ణయించుకున్నారు. అలా చూసుకుంటే చిరు ఫలానా వాళ్లకు ఓటేయండి.. సపోర్ట్ చేయండి అంటూ చెప్పే ఛాన్స్ లేనట్లే. తెరవెనుక కూడా ఆయన ఎలాంటి నడిపే అవకాశం ఉండదు. మరి చిరు మద్దతు లేకుండా ఏ వర్గం ఈ ఎన్నికల్లో గెలుస్తుందో చూడాలి!
This post was last modified on September 7, 2021 3:36 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…