ఎన్నడూ లేనంతగా ‘మా’ ఎలెక్షన్స్ లో అధ్యక్ష పదవి కోసం రగడ మొదలైంది. దానికి తోడు బండ్ల గణేష్ రాజకీయాలు ‘మా’లో మరిన్ని గొడవలకు దారి తీస్తుంది. ‘మా’లో విషయాలను బయటకు పొక్కనీయకుండా చూడమని చిరంజీవి లాంటి పెద్దలు ఎంతగా చెబుతున్నా ఎవరూ వినడం లేదు. చిన్న చిన్న విషయాలను కూడా రాజకీయం చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి చిరంజీవి మద్దతు ఇస్తున్నారనే విషయం అందరికీ ఇప్పుడు ఈ విషయంలో చిరు ఎక్కడా ఏం మాట్లాడడం లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి.
ఇండస్ట్రీలో చిరుకి మంచి ఇమేజ్ ఉంది. దాసరి తరువాత స్థానంలో సినీ జనాలు చిరునే భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవి ఏదో ఒక్క వర్గానికి మాత్రమే మద్దతు ఇవ్వడం సమంజసంగా ఉండదు. పైగా ప్రకాష్ రాజ్ కి ఓటు వేయమని ఆయన నేరుగా కూడా చెప్పలేరు. ఒకవేళ ప్రకాష్ రాజ్ గనుక ఓడిపోతే చిరు సపోర్ట్ ఇచ్చినా.. ఓడిపోయారనే మాటలు వినిపిస్తాయి. వీటన్నింటికీ దూరంగా ఉండడమే బెటర్ అని చిరు భావిస్తున్నారు.
అందుకే ‘మా’ ఎన్నికల్లో తటస్థంగా ఉండడమే సమంజసమని ఆయన నిర్ణయించుకున్నారు. అలా చూసుకుంటే చిరు ఫలానా వాళ్లకు ఓటేయండి.. సపోర్ట్ చేయండి అంటూ చెప్పే ఛాన్స్ లేనట్లే. తెరవెనుక కూడా ఆయన ఎలాంటి నడిపే అవకాశం ఉండదు. మరి చిరు మద్దతు లేకుండా ఏ వర్గం ఈ ఎన్నికల్లో గెలుస్తుందో చూడాలి!
This post was last modified on September 7, 2021 3:36 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…