తెలుగమ్మాయిలకు కథానాయికలుగా ఓ మోస్తరు అవకాశాలు రావడమే కష్టం. అలాంటిది ఓ తెలుగమ్మాయి తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంతో వెంకటేష్, బాలకృష్ణ, రవితేజ లాంటి పెద్ద హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని దశాబ్దంన్నర పాటు కెరీర్ సాగించడం అంటే చిన్న విషయం కాదు. ఈ అరుదైన ఘనత సాధించింది అంజలి.
అచ్చ తెలుగు అమ్మాయి అయిన అంజలి.. ‘మనీ’ దర్శకుడు శివ నాగేశ్వరరావుతో ‘ఫొటో’ అనే చిన్న సినిమా ద్వారా కథానాయికగా పరిచయం అయింది. ఆ సినిమా వచ్చింది వెళ్లింది కూడా జనాలకు తెలియదు. తెలుగులో తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ టైంలోనే కోలీవుడ్కు వెళ్లి అక్కడ మంచి అవకాశాలు అందుకుంది. షాపింగ్ మాల్, జర్నీ లాంటి సినిమాల్లో గొప్ప నటనతో అక్కడ బిజీ హీరోయిన్ అయిపోయింది. రచ్చ గెలిచాక ఇంటికొచ్చి ఇక్కడా సత్తా చాటుకుంది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు, గీతాంజలి లాంటి చిత్రాలు అంజలికి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టాయో తెలిసిందే. ఒక ఐదారేళ్ల పాటు అటు తమిళంలో, ఇటు తెలుగులో అంజలి మంచి రేంజిలో ఉంది. కానీ తర్వాత ఆమె జోరు తగ్గింది. తమిళంలో ఓ దర్శకుడితో వివాదం అంజలి కెరీర్పై ప్రభావం చూపింది. కొన్నాళ్లు అక్కడ సినిమా అవకాశాలు వచ్చినా ఒప్పుకోలేని పరిస్థితి తలెత్తింది. ఐతే ఆ టైంలోనే తెలుగులో ఆమె జోరు సాగింది. తర్వాత తిరిగి కోలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చినా సరైన హిట్లు పడక అంజలి జోరు తగ్గింది.
ఐతే ఒకప్పటంత ఊపు లేకపోయినా అంజలికి సినిమాలైతే ఆగిపోలేదు. అడపా దడపా పేరున్న చిత్రాల్లోనే కనిపిస్తోంది. ఒకప్పుడు బాగా బొద్దుగా ఉన్న అంజలి.. ఈ మధ్య బాగా బరువు తగ్గి కెరీర్ను పొడిగించుకునే ప్రయత్నంలో ఉంది. మొత్తానికి ఓ తెలుగమ్మాయి ఇలా 15 ఏళ్ల పాటు కెరీర్ను నడిపించడం, రెండు భాషల్లో పేరున్న కథానాయికగా పేరు సంపాదించడం గొప్ప విషయమే.
This post was last modified on September 6, 2021 7:14 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…