తెలుగమ్మాయిలకు కథానాయికలుగా ఓ మోస్తరు అవకాశాలు రావడమే కష్టం. అలాంటిది ఓ తెలుగమ్మాయి తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంతో వెంకటేష్, బాలకృష్ణ, రవితేజ లాంటి పెద్ద హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని దశాబ్దంన్నర పాటు కెరీర్ సాగించడం అంటే చిన్న విషయం కాదు. ఈ అరుదైన ఘనత సాధించింది అంజలి.
అచ్చ తెలుగు అమ్మాయి అయిన అంజలి.. ‘మనీ’ దర్శకుడు శివ నాగేశ్వరరావుతో ‘ఫొటో’ అనే చిన్న సినిమా ద్వారా కథానాయికగా పరిచయం అయింది. ఆ సినిమా వచ్చింది వెళ్లింది కూడా జనాలకు తెలియదు. తెలుగులో తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ టైంలోనే కోలీవుడ్కు వెళ్లి అక్కడ మంచి అవకాశాలు అందుకుంది. షాపింగ్ మాల్, జర్నీ లాంటి సినిమాల్లో గొప్ప నటనతో అక్కడ బిజీ హీరోయిన్ అయిపోయింది. రచ్చ గెలిచాక ఇంటికొచ్చి ఇక్కడా సత్తా చాటుకుంది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు, గీతాంజలి లాంటి చిత్రాలు అంజలికి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టాయో తెలిసిందే. ఒక ఐదారేళ్ల పాటు అటు తమిళంలో, ఇటు తెలుగులో అంజలి మంచి రేంజిలో ఉంది. కానీ తర్వాత ఆమె జోరు తగ్గింది. తమిళంలో ఓ దర్శకుడితో వివాదం అంజలి కెరీర్పై ప్రభావం చూపింది. కొన్నాళ్లు అక్కడ సినిమా అవకాశాలు వచ్చినా ఒప్పుకోలేని పరిస్థితి తలెత్తింది. ఐతే ఆ టైంలోనే తెలుగులో ఆమె జోరు సాగింది. తర్వాత తిరిగి కోలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చినా సరైన హిట్లు పడక అంజలి జోరు తగ్గింది.
ఐతే ఒకప్పటంత ఊపు లేకపోయినా అంజలికి సినిమాలైతే ఆగిపోలేదు. అడపా దడపా పేరున్న చిత్రాల్లోనే కనిపిస్తోంది. ఒకప్పుడు బాగా బొద్దుగా ఉన్న అంజలి.. ఈ మధ్య బాగా బరువు తగ్గి కెరీర్ను పొడిగించుకునే ప్రయత్నంలో ఉంది. మొత్తానికి ఓ తెలుగమ్మాయి ఇలా 15 ఏళ్ల పాటు కెరీర్ను నడిపించడం, రెండు భాషల్లో పేరున్న కథానాయికగా పేరు సంపాదించడం గొప్ప విషయమే.
This post was last modified on September 6, 2021 7:14 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…