కరోనా సినిమా ఇండస్ట్రీపై ఎంతగా ప్రభావం చూపిందో తెలిసిందే. అయితే సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు తెరుచుకోవడంతో ఒక్కొక్కటిగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలా అని ఓటీటీని పక్కన పెట్టలేదు. సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నా.. సరైన వసూళ్లు మాత్రం రావడం లేదు. ఇప్పటికీ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి భయపడుతున్నారు. అందుకే నిర్మాతలు ఇంకా ధైర్యం చేయలేకపోతున్నారు. ఆ కారణంగానే ‘టక్ జగదీష్’ లాంటి క్రేజీ ఫిల్మ్ ఓటీటీకి వెళ్లింది.
ఈ వారమే ‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుంది. అయితే అదే రోజున థియేటర్లలో ‘సీటీమార్’ సినిమా సందడి చేయబోతుంది. ఈ వారంలో విడుదలయ్యే పేరున్న సినిమాలు ఇవే. ఈ రెండు సినిమాల మధ్య పోటీ అనడం కంటే.. థియేటర్ ఓటీటీ మధ్య పోటీ అనడమే కరెక్ట్ అనిపిస్తుంది. ‘టక్ జగదీష్’ ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్ లో వస్తోంది. నాని సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. నిజానికి ‘టక్ జగదీష్’ అనేది థియేటర్లో విడుదల కావాల్సిన సినిమా.
కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది. వినాయకచవితికి ఈ సినిమా వస్తుండడంతో పండగ హడావిడి మరింత ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఓటీటీలో ఈ సినిమాను ఎంతమంది చూశారనే రికార్డులు బయటకు రావు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ‘టక్ జగదీష్’ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.
అదే రోజున వస్తున్న ‘సీటీమార్’ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమా ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇది మంచి మాస్ సినిమా కాబట్టి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తే గనుక మరిన్ని సినిమాలు థియేటర్లోకి వస్తాయి.
This post was last modified on September 6, 2021 11:25 am
గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…
కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…
మాటల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తమ వ్యం గ్యాస్త్రాలు,…
ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్,…
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…