హీరోగా బండ్ల గణేష్.. కొన్ని రోజుల కిందట మీడియాలో హల్చల్ చేసిన వార్త ఇది. నటుడిగా చాలా సినిమాలే చేసినా.. చాలా వరకు పెద్దగా గుర్తింపు లేని పాత్రలే చేశాడు బండ్ల గణేష్. అందులో కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించిన, సహాయ పాత్రలు ఎన్నో. ఐతే నిర్మాతగా మాత్రం చాలా పెద్ద స్థాయి సినిమాలే చేసి ఔరా అనిపించాడు. ఈ క్రమంలో నటనకు దూరమయ్యాడు.
ఈ మధ్య సరిలేరు నీకెవ్వరు చిత్రంలో చిన్న పాత్రతో మెరిసిన బండ్ల.. కెరీర్లో ఈ దశలో హీరో కాబోతున్నాడన్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వార్త గురించి బండ్లను సోషల్ మీడియాలో ప్రశ్నించినా.. మొన్న పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పేస్లో అడిగినా సమాధానం దాట వేస్తూ వచ్చాడు. ఈ వార్తను ఖండించలేదు. అలాగే ధ్రువీకరించనూ లేదు. ఐతే ఎట్టకేలకు ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది.
బండ్ల గణేష్ లీడ్ రోల్లో సినిమా మొదలైపోయింది. నుదుటిపై గాయంతో అమాయకంగా కనిపిస్తున్న బండ్ల గణేష్ ఆన్ లొకేషన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. టేబుల్ మీద పోలీస్ టోపీ, వాకీ టాకీని బట్టి బండ్ల స్టేషన్లో ఒక పోలీస్ అధికారితో మాట్లాడుతున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రం తమిళంలో విజయవంతమైన ఒత్త సెరుప్పు సైజ్ 7 ఆధారంగా తెరకెక్కుతోంది.
తమిళంలో ప్రముఖ నటుడు, దర్శకుడు పార్తీబన్ తనే లీడ్ రోల్ చేస్తూ స్వీయ దర్వకత్వం, నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాలో కేవలం ఒక్క పాత్రే ఉంటుంది. తమిళంలో మంచి ప్రయోగంగా పేరు తెచ్చుకుని కమర్షియల్గానూ సక్సెస్ అయిన ఈ సినిమాను హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తుండటం విశేషం. తెలుగులో బండ్ల హీరోగా వెంకట్ చంద్ర అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. స్వాతి చంద్ర, రిషి అగస్త్య నిర్మాతలు.
This post was last modified on September 5, 2021 10:31 am
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…