హీరోగా బండ్ల గణేష్.. కొన్ని రోజుల కిందట మీడియాలో హల్చల్ చేసిన వార్త ఇది. నటుడిగా చాలా సినిమాలే చేసినా.. చాలా వరకు పెద్దగా గుర్తింపు లేని పాత్రలే చేశాడు బండ్ల గణేష్. అందులో కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించిన, సహాయ పాత్రలు ఎన్నో. ఐతే నిర్మాతగా మాత్రం చాలా పెద్ద స్థాయి సినిమాలే చేసి ఔరా అనిపించాడు. ఈ క్రమంలో నటనకు దూరమయ్యాడు.
ఈ మధ్య సరిలేరు నీకెవ్వరు చిత్రంలో చిన్న పాత్రతో మెరిసిన బండ్ల.. కెరీర్లో ఈ దశలో హీరో కాబోతున్నాడన్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వార్త గురించి బండ్లను సోషల్ మీడియాలో ప్రశ్నించినా.. మొన్న పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పేస్లో అడిగినా సమాధానం దాట వేస్తూ వచ్చాడు. ఈ వార్తను ఖండించలేదు. అలాగే ధ్రువీకరించనూ లేదు. ఐతే ఎట్టకేలకు ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది.
బండ్ల గణేష్ లీడ్ రోల్లో సినిమా మొదలైపోయింది. నుదుటిపై గాయంతో అమాయకంగా కనిపిస్తున్న బండ్ల గణేష్ ఆన్ లొకేషన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. టేబుల్ మీద పోలీస్ టోపీ, వాకీ టాకీని బట్టి బండ్ల స్టేషన్లో ఒక పోలీస్ అధికారితో మాట్లాడుతున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రం తమిళంలో విజయవంతమైన ఒత్త సెరుప్పు సైజ్ 7 ఆధారంగా తెరకెక్కుతోంది.
తమిళంలో ప్రముఖ నటుడు, దర్శకుడు పార్తీబన్ తనే లీడ్ రోల్ చేస్తూ స్వీయ దర్వకత్వం, నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాలో కేవలం ఒక్క పాత్రే ఉంటుంది. తమిళంలో మంచి ప్రయోగంగా పేరు తెచ్చుకుని కమర్షియల్గానూ సక్సెస్ అయిన ఈ సినిమాను హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తుండటం విశేషం. తెలుగులో బండ్ల హీరోగా వెంకట్ చంద్ర అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. స్వాతి చంద్ర, రిషి అగస్త్య నిర్మాతలు.
This post was last modified on September 5, 2021 10:31 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…