హీరోగా బండ్ల గణేష్.. కొన్ని రోజుల కిందట మీడియాలో హల్చల్ చేసిన వార్త ఇది. నటుడిగా చాలా సినిమాలే చేసినా.. చాలా వరకు పెద్దగా గుర్తింపు లేని పాత్రలే చేశాడు బండ్ల గణేష్. అందులో కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించిన, సహాయ పాత్రలు ఎన్నో. ఐతే నిర్మాతగా మాత్రం చాలా పెద్ద స్థాయి సినిమాలే చేసి ఔరా అనిపించాడు. ఈ క్రమంలో నటనకు దూరమయ్యాడు.
ఈ మధ్య సరిలేరు నీకెవ్వరు చిత్రంలో చిన్న పాత్రతో మెరిసిన బండ్ల.. కెరీర్లో ఈ దశలో హీరో కాబోతున్నాడన్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వార్త గురించి బండ్లను సోషల్ మీడియాలో ప్రశ్నించినా.. మొన్న పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పేస్లో అడిగినా సమాధానం దాట వేస్తూ వచ్చాడు. ఈ వార్తను ఖండించలేదు. అలాగే ధ్రువీకరించనూ లేదు. ఐతే ఎట్టకేలకు ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది.
బండ్ల గణేష్ లీడ్ రోల్లో సినిమా మొదలైపోయింది. నుదుటిపై గాయంతో అమాయకంగా కనిపిస్తున్న బండ్ల గణేష్ ఆన్ లొకేషన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. టేబుల్ మీద పోలీస్ టోపీ, వాకీ టాకీని బట్టి బండ్ల స్టేషన్లో ఒక పోలీస్ అధికారితో మాట్లాడుతున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రం తమిళంలో విజయవంతమైన ఒత్త సెరుప్పు సైజ్ 7 ఆధారంగా తెరకెక్కుతోంది.
తమిళంలో ప్రముఖ నటుడు, దర్శకుడు పార్తీబన్ తనే లీడ్ రోల్ చేస్తూ స్వీయ దర్వకత్వం, నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాలో కేవలం ఒక్క పాత్రే ఉంటుంది. తమిళంలో మంచి ప్రయోగంగా పేరు తెచ్చుకుని కమర్షియల్గానూ సక్సెస్ అయిన ఈ సినిమాను హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తుండటం విశేషం. తెలుగులో బండ్ల హీరోగా వెంకట్ చంద్ర అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. స్వాతి చంద్ర, రిషి అగస్త్య నిర్మాతలు.
This post was last modified on September 5, 2021 10:31 am
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…