సక్సెస్ సాధించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం అంటారు. సక్సెస్ రేట్ మరీ తక్కువైన సినీ రంగానికి ఇది మరింతగా వర్తిస్తుంది. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయి వరుసగా అవకాశాలు దక్కించుకున్న కార్తికేయ.. జాగ్రత్తగా అడుగులు వేయలేకపోయాడు. గత మూడేళ్లలో అరడజనుకు పైగానే సినిమాలు చేశాడు కానీ.. ఒక్కటి కూడా అతడికి ఆశించిన ఫలితాన్నివ్వలేదు.
తమిళంలో కలైపులి థాను.. తెలుగులో అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాతల సంస్థల్లో సినిమాలు చేసినా కూడా చేదు అనుభవాలు తప్పలేదు. హిప్పి నుంచి చావు కబురు చల్లగా వరకు అన్నీ డిజాస్టర్లే ఎదురయ్యాయి. దీంతో కార్తికేయ కెరీర్ డోలాయమానంలో పడిపోయింది. ఎంత వేగంగా పైకెగిరాడో అంతే వేగంగా కింద పడ్డ అతను.. ఇంకో ఫ్లాప్ ఎదుర్కొంటే ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోతాడేమో అనే పరిస్థితి తలెత్తింది. ఇప్పుడతడి హిట్టు చాలా చాలా అవసరం.
అలాంటి స్థితిలో వస్తున్న చిత్రం ‘రాజా విక్రమార్క’. శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడు రూపొందించిన థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో కార్తికేయ ఎన్ఐఏ ఏజెంట్గా నటించడం విశేషం. ఈ సినిమా టీజర్ శనివారం రిలీజ్ చేశారు. నిమిషంన్నర నిడివితో ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. హీరో ఎన్ఐఏ ఎజెంట్ అనగానే సినిమా సీరియస్గా ఉంటుందనుకుంటాం కానీ.. ఈ చిత్రం మాత్రం పూర్తి వినోదాత్మకంగా సాగేలా కనిపిస్తోంది. అలాగే యాక్షన్ ఘట్టాలకూ ప్రాధాన్యం ఉన్నట్లుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా కనిపించాయి. కొంచెం కొత్తగా ఉంటూనే కమర్షియల్ అంశాలకు, హీరోయిజానికి లోటు లేని విధంగా సినిమా కనిపిస్తోంది.
గత మూడేళ్లలో కార్తికేయ పేలవమైన సినిమాల ఎంపికతో ఉన్న క్రేజంతా పోగొట్టుకున్నాడు. ఎట్టకేలకు అతనో మంచి స్క్రిప్టును ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. అతడి కెరీర్ను మళ్లీ రైట్ ట్రాక్ ఎక్కించేలాగే కనిపిస్తోంది ‘రాజా విక్రమార్క’. మరి టీజర్ లాగే సినిమా కూడా ఆకట్టుకుంటుందేమో చూడాలి.
This post was last modified on September 4, 2021 4:26 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…