టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కుటుంబం నుంచి ఇప్పటికే ఓ వారసుడొచ్చాడు. అతనే.. హర్షిత్ రెడ్డి. రాజు మేనల్లుడైన ఇతను.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ బాధ్యతల్లో పాలు పంచుకుంటున్నాడు. తనే నిర్మాతగా లవర్ అనే సినిమా కూడా తీశాడు. ఆ సినిమా నిరాశ పరిచినప్పటికీ.. ఆ తర్వాత ఎస్వీసీలో సహ నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు రాజు కుటుంబం నుంచి మరో వారసుడు రెడీ అయ్యాడు. అతను అరంగేట్రం చేస్తోంది నిర్మాణంలో కాదు.. నటనలో.
రాజు తమ్ముడు, ఎస్వీసీ అధినేతల్లో ఒకడైన శిరీష్ కొడుకు ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హుషారు చిత్రంతో దర్శకుడిగా సక్సెస్ఫుల్ ఎంట్రీ ఇచ్చిన హర్ష ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ మధ్యనే చాలా హంగామా మధ్య ఈ సినిమాను అనౌన్స్ చేశారు.
తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ లాంచ్ చేశారు. దాని వేడుక కూడా చాలా ఘనంగా చేశారు. ఇక తమ్ముడి కొడుకు అరంగేట్ర సినిమా కోసం టెక్నికల్ టీంను గట్టిగానే సెట్ చేశాడు దిల్ రాజు. సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. శ్రీమంతుడు, ఘాజి, సాహో లాంటి భారీ చిత్రాలకు పని చేసిన టాప్ సినిమాటోగ్రాఫర్ మధి ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సమకూరుస్తుండటం విశేషం. అలాగే దక్షిణాదిన లెజెండరీ టెక్నీషియన్లలో ఒకడిగా పేరున్న రాజీవన్ ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్ చేస్తుండటం గమనార్హం. ఆయన చివరగా సైరా నరసింహారెడ్డి లాంటి భారీ బడ్జెట్ చిత్రానికి పని చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లుకు కూడా ఆయనే ఆర్ట్ డైరెక్టర్.
మొత్తంగా చూస్తే రాజు.. తన తమ్ముడి కొడుకును అరంగేట్రం చేయించే విషయంలో ఏమాత్రం రాజీ పడట్లేదని.. ఓ రేంజిలో ఖర్చు పెట్టి బెస్ట్ ఔట్ పుట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడని స్పష్టమవుతోంది.
This post was last modified on September 4, 2021 11:30 am
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…