అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే.. ఈపాటికి ‘పుష్ప’ సినిమా విడుదలైపోయి ఉండాలి. ఆ సినిమా కథ ఒక్క పార్ట్తోనే ముగిసిపోయి ఉండాలి. కానీ కరోనా సెకండ్ వేవ్ వచ్చి మొత్తం కథ మార్చేసింది. ఆగస్టు 13 నుంచి సినిమాను వాయిదా వేయడమే కాదు.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చేయాలన్న ఆలోచన కూడా తెరపైకి వచ్చింది. చివరికి అదే ఖరారైంది.
‘పుష్ప-ది రైజ్’ పేరుతో ఫస్ట్ పార్ట్ను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయడానికి ముహూర్తం నిర్ణయించడం తెలిసిందే. అంటే ‘పుష్ప’ ఆగమనానికి ఇంకా నాలుగు నెలలు కూడా సమయం లేదు. అంటే ఈపాటికి షూటింగ్ చాలా వరకు అయిపోయి ఉండాలి. బేసిగ్గా సుకుమార్ మేకింగ్ విషయంలో కొంచెం స్లోనే అయినప్పటికీ.. ‘పుష్ప’ను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలన్న నిర్ణయం కలిసొచ్చి ఫస్ట్ పార్ట్ చిత్రీకరణ రిలీజ్ డేట్ కంటే చాలా ముందే పూర్తయిపోతున్నట్లు సమాచారం.
ఇంకో రెండు వారాల్లోనే ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ టాకీ పార్ట్ చిత్రీకరణ ముగియనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే విలన్ పాత్రధారి ఫాహద్ ఫాజిల్ ‘పుష్ప’ సెట్లోకి అడుగు పెట్టడం.. హైదరాబాద్లో బన్నీ, ఫాహద్ కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడం తెలిసిందే. అవి ఆఫీస్ నేపథ్యంలో నడిచే సన్నివేశాలట.
ఐతే అటవీ ప్రాంతంలో బన్నీ-ఫాహద్ కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలు తీయాల్సి ఉంది. దీంతో టీం అంతా తిరిగి గోదావరి ప్రాంతంలోని మారేడుమిల్లి అడవులకు బయల్దేరింది. ఈ సినిమా చిత్రీకరణ మొదలైందే ఆ అడవుల్లో. అక్కడ రెండు దశల్లో రెండు నెలలకుపైగా షూటింగ్ జరిపారు. సగం సినిమా చిత్రీకరణ అక్కడే జరిగింది. ఇప్పుడు చివరి షెడ్యూల్కు కూడా మారేడుమిల్లి అడవులే వేదిక అవుతున్నాయి. అక్కడ రెండు వారాల చిత్రీకరణతో ఫస్ట్ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. టాకీ పార్ట్ అయ్యాక కొన్ని పాటలు తీయాల్సి ఉంటుంది. ఆ పని కూడా పూర్తయ్యాక రెండు నెలలకు పైగానే పోస్ట్ ప్రొడక్షన్కు టైం ఉంటుంది.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…