అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే.. ఈపాటికి ‘పుష్ప’ సినిమా విడుదలైపోయి ఉండాలి. ఆ సినిమా కథ ఒక్క పార్ట్తోనే ముగిసిపోయి ఉండాలి. కానీ కరోనా సెకండ్ వేవ్ వచ్చి మొత్తం కథ మార్చేసింది. ఆగస్టు 13 నుంచి సినిమాను వాయిదా వేయడమే కాదు.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చేయాలన్న ఆలోచన కూడా తెరపైకి వచ్చింది. చివరికి అదే ఖరారైంది.
‘పుష్ప-ది రైజ్’ పేరుతో ఫస్ట్ పార్ట్ను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయడానికి ముహూర్తం నిర్ణయించడం తెలిసిందే. అంటే ‘పుష్ప’ ఆగమనానికి ఇంకా నాలుగు నెలలు కూడా సమయం లేదు. అంటే ఈపాటికి షూటింగ్ చాలా వరకు అయిపోయి ఉండాలి. బేసిగ్గా సుకుమార్ మేకింగ్ విషయంలో కొంచెం స్లోనే అయినప్పటికీ.. ‘పుష్ప’ను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలన్న నిర్ణయం కలిసొచ్చి ఫస్ట్ పార్ట్ చిత్రీకరణ రిలీజ్ డేట్ కంటే చాలా ముందే పూర్తయిపోతున్నట్లు సమాచారం.
ఇంకో రెండు వారాల్లోనే ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ టాకీ పార్ట్ చిత్రీకరణ ముగియనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే విలన్ పాత్రధారి ఫాహద్ ఫాజిల్ ‘పుష్ప’ సెట్లోకి అడుగు పెట్టడం.. హైదరాబాద్లో బన్నీ, ఫాహద్ కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడం తెలిసిందే. అవి ఆఫీస్ నేపథ్యంలో నడిచే సన్నివేశాలట.
ఐతే అటవీ ప్రాంతంలో బన్నీ-ఫాహద్ కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలు తీయాల్సి ఉంది. దీంతో టీం అంతా తిరిగి గోదావరి ప్రాంతంలోని మారేడుమిల్లి అడవులకు బయల్దేరింది. ఈ సినిమా చిత్రీకరణ మొదలైందే ఆ అడవుల్లో. అక్కడ రెండు దశల్లో రెండు నెలలకుపైగా షూటింగ్ జరిపారు. సగం సినిమా చిత్రీకరణ అక్కడే జరిగింది. ఇప్పుడు చివరి షెడ్యూల్కు కూడా మారేడుమిల్లి అడవులే వేదిక అవుతున్నాయి. అక్కడ రెండు వారాల చిత్రీకరణతో ఫస్ట్ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. టాకీ పార్ట్ అయ్యాక కొన్ని పాటలు తీయాల్సి ఉంటుంది. ఆ పని కూడా పూర్తయ్యాక రెండు నెలలకు పైగానే పోస్ట్ ప్రొడక్షన్కు టైం ఉంటుంది.
This post was last modified on September 3, 2021 11:01 am
రాజస్థాన్ రాయల్స్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ టీమ్ ఇండియా ఎంట్రీపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర…
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న రాకాస మీద టీమ్ మొత్తం ప్రాణాలు పెట్టేసుకుంది. నిర్మాత నీహారిక కొణిదెల చాలా యాక్టివ్…
బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఒక కొత్త గాలి వీస్తోంది. రణ్బీర్ కపూర్ ‘యానిమల్’తో సెన్సేషన్ క్రియేట్ చేస్తే, రీసెంట్…
మార్చి నెలలో దురంధర్ ది రివెంజ్ కనక ఆదుకోకపోయి ఉంటే తెలుగు రాష్ట్రాల థియేటర్ల పరిస్థితి మరింత అన్యాయంగా ఉండేది.…
తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు నీటి పంచాయతీ నెలకొంది. ఈ సందర్భంగా ఏపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు…
ఇరాన్ తో మనకున్న బంధం.. అనుబంధం చాలా కీలకమైనదని.. మన స్నేహం దశాబ్దాల తరబడి సాగుతోందని చెప్పే మాటలకు.. చేతలకు…