పూరి జగన్నాథ్ టాలీవుడ్లో చాలామంది హీరోలకు లైఫ్ ఇచ్చాడు. ఇమేజ్ లేని హీరోలను స్టార్లను చేయడంలో, స్టార్లను సూపర్ స్టార్లను చేయడంలో పూరి ట్రాక్ రికార్డు గొప్పదే. కానీ బయటి హీరోలకు తిరుగులేని విజయాలను కట్టబెట్టిన పూరి జగన్నాథ్.. తన కొడుకు ఆకాశ్ను మాత్రం హీరోగా నిలబెట్టలేకపోయాడు. తాను బ్యాడ్ ఫామ్లో ఉండగా ‘మెహబూబా’ లాంటి డిజాస్టర్ మూవీ తీసి కొడుకు కెరీర్ను డోలాయమానంలోకి నెట్టాడు.
ఇలా పూరి పంచ్ తిన్న మరో కొత్త కుర్రాడు కూడా ఉన్నాడు. అతనే.. కన్నడ నటుడు ఇషాన్. శాండిల్వుడ్లో పెద్ద నిర్మాతల్లో ఒకడైన మనోహర్ కొడుకితను. కన్నడలో పునీత్ రాజ్కుమార్, తెలుగులో రామ్ చరణ్లను హీరోలుగా పరిచయం చేసి వాళ్లు పెద్ద స్టార్లు కావడానికి పునాది వేసిన పూరి మీద ఎంతో నమ్మకంతో ఇషాన్ను ‘రోగ్’ అనే మూవీతో లాంచ్ చేయించారు.
పెద్ద బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం అటు కన్నడలో, ఇటు తెలుగులో డిజాస్టర్ అయింది. డబ్బులు పోయాయి. కొత్త హీరోకు విజయం దక్కలేదు. మొత్తంగా ఇషాన్ కెరీర్ అయోమయంగా తయారైంది. ఆ తర్వాత కన్నడలో రెమో అనే సినిమా ఒకటి చేశాడు. అది కూడా అంతగా ఫలితాన్నివ్వలేదు. అయినా ఇషాన్ ప్రయత్నం ఆపలేదు. ఇప్పుడతను ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేస్తుండటం విశేషం. ఆ సినిమా పేరు.. తత్వమసి. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్ లాంటి పేరున్న ఆర్టిస్టులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రమణ గోపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ తేలు నిర్మిస్తున్నాడు.
ఈ రోజు రిలీజ్ చేసిన టైటిల్ లుక్ సినిమా మీద అంచనాలు పెంచేలా ఉంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుండటం విశేషం. మ్యాన్లీ లుక్స్తో ఆకర్షణీయంగా కనిపించే ఇషాన్.. ఈ సినిమాతో అయినా మంచి విజయాన్నందుకుని హీరోగా నిలదొక్కుకుంటాడేమో చూడాలి.
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…