Movie News

రవితేజ ఫోన్ చేస్తే మీ పేరేంటని అడిగాడట

మాస్ రాజా రవితేజ టాలీవుడ్లో ఒక అప్‌కమింగ్ ఆర్టిస్టుకు ఫోన్ చేసి అభినందిస్తే.. ఇంతకీ మీరెవరు.. మీ పేరేంటి అని అడిగితే ఎలా ఉంటుంది? అవసరాల శ్రీనివాస్ ఇదే పని చేశాడట. ‘అష్టాచెమ్మా’ సినిమాలో క్యారెక్టర్ రోల్‌తో అవసరాల టాలీవుడ్‌కు పరిచయం అయిన సంగతి తెలిసిందే. తొలి సినిమాలోనే చక్కటి నటనతో అతను చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక కొత్త నటుడిలాగే అనిపించలేదతను. ఈ పాత్రకు గొప్ప ప్రశంసలు లభించాయి.

ఆ సమయంలో రవితేజ.. అవసరాల నంబర్ తెలుసుకుని ఫోన్ చేసి అభినందించాడట. ఐతే కాల్ చేసినపుడు రవితేజ తానెవరో చెప్పకుండా అతడితో సంభాషణ సాగించాడట. తనతో మాట్లాడుతున్నదెవరో తెలియక చివర్లో మొహమాట పడుతూనే.. ఇంతకీ మీ పేరేంటి అని అడిగాడట రవితేజను. నన్నందరూ రవితేజ అంటారండీ అంటూ నవ్వేశాడట రవితేజ.

కమెడియన్ ఆలీ నిర్వహించే టీవీ ఇంటర్వ్యూ కార్యక్రమంలో అవసరాల ఈ విషయం వెల్లడించాడు. ఇక ‘అష్టాచెమ్మా’ సినిమాకు తాను ఎంపికైన విషయం తన తల్లిదండ్రులకు తెలియదని.. ఈ సినిమా ప్రోమోలు బయటికి వచ్చాకే వాళ్లకు అసలు విషయం తెలిసిందని.. ఐతే చేస్తే చేశావు కానీ.. ఈ సినిమాతో ఆపేయమని తన తండ్రి తనకు చెప్పాడని అవసరాల గుర్తు చేసుకున్నాడు.

తాను దర్శకుడిగా మారి ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా తీశాక తన మీద తండ్రికి గురి కుదిరిందని అతను చెప్పాడు. ఇక సినీ రంగంలో తాను అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నపుడు ఒక దర్శకుడు తాను నటుడిగా పనికి రానని అన్నాడని.. ఆయన అలా అన్నాడని తానేమీ నిరాశ చెందకుండా ప్రయత్నం చేశానని.. ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానని అన్నాడు అవసరాల.

This post was last modified on September 1, 2021 5:50 pm

Share

Recent Posts

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

2 minutes ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

17 minutes ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

2 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

5 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

9 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

13 hours ago